TG: హైదరాబాద్లో అన్ని దారులు హుస్సేన్ సాగర్ వైపే కదులుతున్నాయి. నగరంలో వైభవంగా నిమజ్జోనత్సవ వేడుక సాగుతోంది. గణనాథులు భారీ సంఖ్యలో సాగర్ వైపు వస్తున్నారు. నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ వద్ద సందడి నెలకొంది. గణపతి నామస్మరణలతో ప్రధాన రోడ్లన్నీ మార్మోగుతున్నాయి. మరోవైపు బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర ముందుకు సాగుతోంది.