MH గోండియా జిల్లా దరేక్సా పోలీసుల ఎదుట 11 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఇందులో ఎంఎంసీ జోన్ ముఖ్య ప్రతినిధి అనంత్ ఉన్నారు. జనవరి 1 నాటికి ఆయుధాలు వదులుకుంటామని ప్రకటించిన ఒక్క రోజు వ్యవధిలోనే లొంగిపోవడం గమనార్హం. లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఎంఎంసీ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్పై రూ.కోటి రివార్డు ఉంది.