TG: రాష్ట్ర పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. అదే విధంగా సోషల్ మీడియా ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడే వారిని ట్రాక్ చేయాలని డిసైడ్ అయ్యింది. వర్గాలను రెచ్చగొట్టడం, ఉద్దేశ పూర్వకంగా వ్యక్తులపై తప్పుడు కథనాలను ప్రచారం చేయడం మొదలైన అంశాలపై ఇకనుంచి చర్యలు తీసుకోనున్నారు.