AP: విజయవాడలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. భవానీపురంలో మేరారామ్(12), ఉమారామ్(13) గురువారం మిస్ అవ్వగా.. వారు ట్యూషన్కి వెళ్లకుండా బస్టాండ్ నుంచి ముంబైకి చేరారని, అక్కడి నుంచి గుజరాత్ సూరత్కు వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చిన పోలీసులు.. సూరత్ వెళ్లి పిల్లలను తీసుకొచ్చి క్షేమంగా వారికి అప్పగించారు.