AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. ముందుగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కిరణ్కు ప్రభుత్వ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టుకు తరలించారు. డీఎస్పీ మరళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు కోర్టు వద్ద మోహరించారు.