• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

తెలుగు రాష్ట్రాలకు రెండు చొప్పున ప్రెసిడెంట్ పోలీసు మెడల్

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్‌ మెడల్ తో పాటు 668 మందికి పోలీస్‌ మెడల్ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ పతకం, ఇద్దరికి రాష్ట్రప...

January 25, 2023 / 02:22 PM IST

అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన ప్రధాని

రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ప్రధాని మోదీ కానుక అందించారు. దర్గాకు చాదర్ సమర్పించారు. ప్రతి ఏటా జరిగే దర్గా ఉర్సు ఉత్సవాలకు చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దర్గా నిర్వాహకులకు మోదీ చాదర్ అందించారు.సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ ఛిస్తి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అజ్మీర్ షరీఫ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఖ్వాజా మొయినుద్దీన్ ప్రముఖ సూ...

January 25, 2023 / 02:33 PM IST

రిపబ్లిక్ డే వేడుకల్లో అవార్డులు అందుకోనున్న 901 మంది పోలీసులు

గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ వేడుకలను పురస్కరించుకుని రేపు దేశ వ్యాప్తంగా 901 మంది పోలీసులకు పతకాలు అందించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ తెలిపింది. సీఆర్‌పీఎఫ్ సిబ్బందిలో గరిష్టంగా 48 గ్యాలంట్రీ అవార్డులు దక్కనున్నాయి. అలాగే మహరాష్ట్రలో విధులు నిర్వహిస్తున్న 31 మంది, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 25 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు అవార్డులు దక్కించుకున్నారు. అలాగే ఢిల్లీ,...

January 25, 2023 / 01:20 PM IST

మహారాష్ట్రలో 451 మంది ఖైదీలు మిస్సింగ్

మహారాష్ట్రలో 451 మంది ఖైదీలు మిస్ అయ్యారు. కరోనా సమయంలో ఖైదీలు పెరోల్ పై విడుదలయ్యారు. ఆ సమయంలో కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలు నుంచి రిలీజ్ చేశారు. అందులో చాలా మంది పెరోల్ గడువు ముగిసినా కూడా ఇంకా జైలుకు రాలేదు. ఖైదీలు ఇదే మంచి సమయం అనుకుని పరారయ్యారని సమాచారం. అదృశ్యమైన 451 మంది ఖైదీలలో 357 మంది ఖైదీలపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వారి ఆచూకీ కోసం తీవ్రంగా […]

January 25, 2023 / 12:17 PM IST

లక్నోలో బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి.. శిథిలాల కింద మరింత మంది..

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో నాలుగంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. లక్నోలోని, హజ్రత్ గంజ్ ప్రాంతంలోని ఒక నాలుగంతస్థుల భవనం మంగళవారం రాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప...

January 25, 2023 / 09:58 AM IST

న్యూజిలాండ్‌పై గెలుపుతో వన్డేల్లో నంబర్ 1 స్థానానికి భారత్ !

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ నిన్న జరిగిన తుది మ్యాచ్ లో టీమిండియా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్‌లో జరిగిన రెండో వన్డేలో ఓడిన తర్వాత అగ్రస్థానాన్ని కోల్పోయిన కివీస్ రెండోస్థానానికి పడిపోయింది. దీంతో ఇంగ్లండ్‌కు టాప్ ప్లేస్ దక్కింది. మూడో వన్డేకు ముందు ...

January 25, 2023 / 09:26 AM IST

లక్నోలో కూలిన భవనం.. ముగ్గురు మృతి

లక్నోలో ఓ ఐదంతస్తుల భవనం కూలింది. శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వజీర్ హసన్ రోడ్‌లో గల బహుళ అంతస్తుల భవనం కూలగా, పక్కన గల భవనాలకు పగుళ్ల ఏర్పడ్డాయి. ‘భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని, చనిపోయిన ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకెళ్లారు. గాయపడ్డవారిని చికిత్స కోసం సివిల్ ఆస్పత్రికి తరలించాం’ అని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ తె...

January 24, 2023 / 09:23 PM IST

నదిలో తేలిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు.. అసలేం జరిగింది?

మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఉన్న భీమా నది తీరంలో విషాదం చోటు చేసుకుంది. భీమా నది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. భీమా నది తీరంలో మృతదేహాలు ఉన్నాయనే సమాచారం అందండంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. నది తీరంలో నాలుగు మృతదేహాలు తేలుతూ కనిపించాయి. ఆ తర్వాత కొంత సేపటికి మరో మూడు మృతదేహాలు కనిపించాయి. వీళ్లంతా ఒకే ఫ్యామిలీకి...

January 24, 2023 / 09:18 PM IST

మెట్రోలో చంద్రముఖి.. హెడ్ ఫోన్ పెట్టుకున్న వదలని బొమ్మాళి

చంద్రముఖి మూవీ ఎంత హిట్ అయ్యిందో తెలుసు. అందులో నాంద చంద్రముఖి అంటూ పలికే డైలాగ్ మూవీలో హైలెట్. ఢిల్లీ మెట్రో రైలులోకి చంద్రముఖి వచ్చింది. అంటే దెయ్యం కాదు లెండి.. చంద్రముఖి డ్రెస్, కళ్లకు కాటుక పెట్టుకొని ఓ యువతి వచ్చింది. అక్కడ ఉన్న వారిని భయపెట్టింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రాజస్తాన్‌‌లో గల భరత్‌పూర్‌కు చెందిన మహిళ లక్ష్మీ నివాస...

January 24, 2023 / 04:48 PM IST

Breaking : ఢిల్లీలో భారీ భూకంపం.. రోడ్ల మీదికి పరుగెత్తిన జనం

Breaking : దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 2.28 గంటలకు ఈ భూకంపం సంభవించింది. నేపాల్ కేంద్రంగా ఈ భూకంపం సంభవించిందని.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8 గా నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ఢిల్లీతో పాటు పలు చుట్టు పక్కన ప్రాంతాలు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేపాల్ కేంద్రంగా.. ఉత్తరాఖండ్ లోని పిథోరాఘర్ ప్రాంతానికి 148 కిలోమీటర్ల దూరంలో భూకం...

January 24, 2023 / 04:13 PM IST

వీడికేమైనా పిచ్చా.. ఫ్లైఓవర్ ఎక్కి నోట్ల కట్టలను రోడ్డు మీద వెదజల్లాడు

ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు. ఇంతలో ఒక ఫ్లైఓవర్ వచ్చింది. ఫ్లైఓవర్ మధ్యలోకి రాగానే సడెన్ గా బండి ఆపాడు. బైక్ పక్కన పెట్టి తన దగ్గర ఉన్న బ్యాగును పట్టుకొని ఫ్లైఓవర్ పక్కకు వెళ్లి అందులో నుంచి నోట్ల కట్టలను తీసి కిందికి వెదజల్లడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాక వాహనదారులు తలలు పట్టుకున్నారు. తేరుకొని వెంటనే అతడు చేసే పనిని వీడియో తీయడం ప్రారంభించారు. ఈ ఘటన […]

January 24, 2023 / 04:13 PM IST

కేరళలో ‘నోరో’ టెన్షన్..19 మంది విద్యార్థులకు పాజిటివ్

కేరళలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నోరో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులన్నీ చిన్నారుల్లోనే కనిపించాయి. చిన్నారుల్లో అధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ ను గుర్తించడంతో సర్కార్ అప్రమత్తమైంది. ఈ వైరస్ అతిసారం, వాంతులతో సంబంధం కలిగి ఉంటుందని, చికిత్స సులభమే అయినా ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని పలు అధ్యయనాలు తెలి...

January 24, 2023 / 01:18 PM IST

మధ్యప్రదేశ్ సీఎం సంచలన వ్యాఖ్యలు..పాఠ్యాంశాలుగా భగవద్గీత, ప్రవేశపెడతాం

ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా హిందూ మత గ్రంథాలను ప్రవేశపెడతాం అంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో భగవద్గీత, శ్రీరామ చరితం,రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, వేదాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెడతాం అంటూ వ్యాఖ్యానించారు. ఇవి చదివితే మనిషిలో నైతికత పెరుగుతుందని నేటి బాలలే రేపటి పౌరులని భారత దేశ పౌరులకు నైతికత పెంపొందాలంటే హిందూ గ్రంధాలను చదవాలని అన్నారు. హిందూ...

January 24, 2023 / 01:00 PM IST

కేరళ ప్రభుత్వం వినూత్న నిర్ణయం.. విద్యార్థినులకు ప్రత్యేక సెలవు

కేరళ సర్కారు ఒక ఆదర్మనీయమైన నిర్ణయం తీసుకుంది. విద్యార్దినులు నెలసరి సమయంలో శారీరక ,మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కనుక ఆ సమయంలో వారు కళాశాలలకు హాజరు కాకపోయినా ఫర్వాలేదంటూ ఆదేశాలు జారీ చేసింది. కేరళవ్యాప్తంగా పనిచేస్తున్న 14 యూనివర్సిటీల్లో విద్యార్థినులకు రెండు శాతం అదనంగా హాజరు మాఫీ అవకాశం కల్పించింది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలిసారి ఈ నిర్ణయాన్ని అమల్లో పెట్టింది. ...

January 24, 2023 / 12:00 PM IST

గవర్నర్ పదవి నుంచి దిగిపోతానంటున్న భగత్‭సింగ్ కోశ్యారి.. ప్రధానికి సందేశం

తాను గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలని అనుకుంటున్నట్లు స్వయంగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ప్రకటించారు. సోమవారం రాజ్ భవన్ నుంచి వెలువడిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఆయన తెలిపారు. 2019 నుంచి మహారాష్ట్ర గవర్నర్‭గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. అనేక రాజకీయ కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. భార...

January 24, 2023 / 11:22 AM IST