• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Corona Cases : ఏపీలో కరోనా టెన్షన్..ఒకరు మృతి

ఏపీలో కరోనా(Corona)తో ఒకరు మృతి చెందారు. కుక్కునూరు మండలం కొండపల్లికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని చికిత్స కోసం మార్చి 30వ తేదిన భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కరోనా సోకి ఆ వ్యక్తి 8న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

April 9, 2023 / 08:44 PM IST

MK Stalin: CRPF పరీక్షను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి

CRPF రిక్రూట్‌మెంట్ కోసం కంప్యూటర్ పరీక్షలో తమిళాన్ని చేర్చకపోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్(MK Stalin) వ్యతిరేకించారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah)కు లేఖ రాశారు. ఆంగ్లం, హిందీ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పరీక్ష నిర్వహించాలని కోరారు.

April 9, 2023 / 06:29 PM IST

Sachin Pilot ఒకరోజు దీక్ష.. గెహ్లాట్ పక్కలో బల్లెంలా..? ఈసారి ఎందుకంటే.?

రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ మరోసారి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన నిరసన దీక్ష చేపడుతానని ప్రకటించారు. వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.

April 9, 2023 / 05:55 PM IST

Elephant Whisperers జంటతో ప్రధాని మోడీ భేటీ.. ఉద్వేగంతో ఫొటోలు పోస్ట్

ఎలిఫెంట్ విస్సరర్స్ నటులు బొమ్మన్ , బెల్లీని ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. తెప్పకడు ఎలిఫెంట్ క్యాంపులో మీట్ అయ్యారు. వారితో దిగిన ఫోటోలను మోడీ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.

April 9, 2023 / 04:43 PM IST

9 yearsలో తెలంగాణ కన్నా డెవలప్ అయినా రాష్ట్రం పేరు చెప్పండి

ప్రధాని మోడీ కామెంట్లకు మంత్రి కేటీఆర్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. అభివృద్ది పనుల సాకు చూపి.. రాజకీయాల కోసమే మోడీ హైదరాబాద్ వచ్చారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.

April 9, 2023 / 04:02 PM IST

Mangoes On EMI: టీవీలు, ఫోన్లే కాదు.. మామిడి పండ్లు ఈఎంఐలో దొరుకుతాయ్​

Mangoes On EMI: ఇప్పటి వరకు మనం ఎలక్ర్టానిక్ వస్తువులు నెలవారీ ఈఎంఐలో తీసుకుని ఉంటాం. మహారాష్ట్రలో ఓ వ్యాపారి వినూత్నంగా మామిడి పండ్లు కూడా ఈఎంఐలో అమ్ముతానని ప్రకటించాడు. వేసవి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. ప్రతీ ఒక్కరు మామిడి పండ్లను తినాలని చూస్తుంటారు. ఎందుకంటూ మామిడికున్న క్రేజ్ అలాంటిది పైగా అది ‘పండ్లలో రాజు’ . మామిడిలో చాలా రకాలున్నాయి. కొన్ని రకాలు వరల్డ్ ఫేమస్. ఆ కేటగిర...

April 9, 2023 / 12:22 PM IST

బందీపూర్ పార్క్ లో ప్రధాని మోదీ సఫారీ.. వీడియో వైరల్

క‌ర్ణాట‌క‌లో బందీపూర్ (Bandipur) పులుల సంర‌క్ష‌ణ కేంద్రాన్ని ప్రధాని మోదీ (Pm Modi) సంద‌ర్శించారు. 20 కిలోమీట‌ర్ల మేర జంగిల్ స‌ఫారీని చేప‌ట్టారు. టైగ‌ర్ రిజ‌ర్వ్ (Tiger Reserve) పాక్షికంగా చామ‌రాజ‌న‌గ‌ర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత మేర మైసూరు (Mysore) జిల్లాలోని హెచ్ డి కోట్ , నంజ‌న్ గూడ తాలూకాల‌లో విస్త‌రించి ఉంది. ఆదివారం తెల్ల‌వారుజామున స‌ఫారీ దుస్తులు, టోపీ ధ‌రించారు. వేట‌కు వెళ్లారు.

April 9, 2023 / 11:52 AM IST

Tej Pratap Yadav : వారణాసీలో మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చేదు అనుభవం

బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌(Tej Pratap Yadav)కు వారణాసీ(Varanasi)లో చేదు పరాభవం ఎదురైంది. అక్కడి హోటల్‌లో బస చేసిన తేజ్‌ప్రతాప్ బయటకు వెళ్లిన సమయంలో మంత్రి, హోటల్ సెక్యూరిటీ సిబ్బంది లగేజీ(luggage)ని బయటపడేశారు. హోటల్ గదికి చేరుకున్న మంత్రి తమ లగేజీ రిసెప్షన్ వద్ద ఉండడం చూసి షాకయ్యారు. దీనిపై ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 9, 2023 / 10:36 AM IST

Karnataka: ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న నాయకులు.. ఆటోవాలాల చుట్టే రాజకీయం

Karnataka: కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఓట్లు రాబట్టుకునేందుకు సాధ్యం కాని హామీలను ప్రజలపై గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ రాజకీయాలన్నీ ఇప్పుడు ఆటోవాలాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆటో డ్రైవర్ల ఓట్ల కోసం అధికార బీజేపీ మొదలు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో 7.7 ల...

April 9, 2023 / 09:50 AM IST

AP BJP : అమిత్ షాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi), బీజేపీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్‌ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గత నెలలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్.. భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి ముందు ఆ పార్టీ ముఖ్య నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా తెలుస...

April 9, 2023 / 09:30 AM IST

Covid : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

కరోనా (Corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi), కేరళలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కేరళ(Kerala)లో శనివారం ఒక్కరోజే 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం(Ernakulam), తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

April 9, 2023 / 08:58 AM IST

Chocoate: భర్త చాక్లెట్ తీసుకురాలేదని భార్య ఆత్మహత్య

Chocoate:భర్త చాక్లెట్ తీసుకురాలేదని 25 ఏళ్ల భార్య ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని లెటర్ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని హెన్నూరు బండే సమీపంలోని హొన్నప్ప లేఅవుట్‌లో చోటుచేసుకుంది. సెలూన్‌లో పనిచేసే గౌతమ్‌, అతని భార్య నందిని కాలేజీ నుంచి ఒకరికొకరు తెలుసు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఘటన జరిగిన రోజు గౌతమ్‌ను నందిని పనికి వెళ్లకుండా అడ్డుకుంది. ఆపై ఇద్దరి మధ్య గొడవ జరిగ...

April 9, 2023 / 07:59 AM IST

IPL-16 : దంచికొట్టిన రహానే .. ముంబైపై చెన్నై ఘనవిజయం

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (IPL )16వ సీజన్​లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)​ జట్టు.. రెండో విజయాన్ని నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్(Mumbai Indians​)తో జరిగిన మ్యాచ్​లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించేసింది. చెన్నై జట్టు బ్యాటర్లు​ అజింక్య రహానే(Ajinkya Rahane), రుతురాజ్​ గైక్వాడ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు.

April 9, 2023 / 07:58 AM IST

Kiren Rijiju : కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కారును ఢీకొట్టిన ట్రక్కు

Kiren Rijiju : కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటన జమ్మూలోని బనిహాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాంబన్‌ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తన బుల్లెట్ ప్రూఫ్ కారులో కిరణ్ రిజిజు శ్రీనగర్ వెళ్తున్న సమ...

April 8, 2023 / 09:12 PM IST

Emine Dzhaparova: భారత్ లో పర్యటించనున్న ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి

Emine Dzhaparova: ఉక్రెయిన్ మొదటి ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు రానున్నారు. గతేడాది జరిగిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. ఝపరోవా భారత పర్యటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో ప్రకటించింది. ఉక్రెయిన్ విదేశాంగ వ్యవహారాల మొదటి డిప్యూటీ మంత్రి ఎమిన్ ఝపరోవా ఏప్రిల్ 9 నుండి 12 వరకు భారతదేశంలో అధికారిక పర్యట...

April 8, 2023 / 07:34 PM IST