MNCL: భీమారంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ఎస్సీ సంక్షేమ శాఖ పాఠశాల, వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, విద్యార్థుల గదులు, వంటశాల, భోజనశాల, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీరు అందించాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.