మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’ మూవీ ప్రాజెక్టు నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తారనే వార్తలను అధికారికంగా హీరో విష్ణు ప్రకటించారు. దీంతోపాటు ఈ చిత్రంలో నయనతార కూడా యాక్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.
గత ఐదారెళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు మంచు మనోజ్. ఇప్పుడిప్పుడు సినిమాలు చేస్తున్నారు. దాంతోపాటు ఈటీవీ విన్లో ఓ రియాలిటీ గేమ్ షో కూడా చేస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీరి పెళ్లి వేడుకలు ఇప్పటికే ఉదయ్పూర్లో మొదలయ్యాయి. దీంతోపాటు పలువురు సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నేతలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తాను ఎక్కడుంది? ఏం చేస్తుందో అన్ని ఫోటోల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అయితే, ఈ మధ్యకాలంలో సమంత షేర్ చేసిన ఫోటోల్లో ఆమె డల్ గా కనపడింది. ఫోటోలు చూసి సమంత ఏంటి? ఇలా అయిపోయింది అని చాలా మంది కామెంట్స్ చేశారు.
చివరగా భోళా శంకర్తో మెప్పించలేకపోయినా మెగాస్టార్ చిరంజీవి.. నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెగా 156, మెగా 157 అనౌన్స్మెంట్స్ ఇచ్చేశాడు. కానీ తాజాగా మెగా 156 పై ఓ ఫేక్ న్యూస్ వైరల్గా మారింది.
మాస్ మహారాజాతో నేషనల్ క్రష్ రష్మిక రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుందా? అంటే ఔననే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త కాంబినేషన్ న్యూస్ వైరల్గా మారింది. ఇంతకీ ఈ మాస్ కాంబో ఏ సినిమా కోసం..?
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే మాట నెపొటిజమ్. స్టార్ కిడ్స్ ఏ మాత్రం కష్టం లేకుండా, ఇండస్ట్రీలోకి అడుగుపెడతారనే భావన అందరిలోనూ ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేనివారికి మాత్రం ఇండస్ట్రీలో ఎదుగుదల ఉండదు అనే కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా నెపొటిజమ్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
తమిళ్ స్టార్ హీరో సూర్య తెలుగు డైరెక్టర్ తో ఓ మాస్ సినిమా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బోయపాటి శ్రీను చెప్పిన ఓ స్టోరిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది దాదాపు ఖరారైనట్లు సమాచారం.
ప్రముఖ దక్షిణ భారత నటి సాయి పల్లవి, తమిళ దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి ఉన్న ఒక వైరల్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి, తనపై ఎలాంటి రూమార్స్ వచ్చినా సాయి పల్లవి పెద్దగా పట్టించుకోదు. కానీ, ఈ పెళ్లి అనే రూమర్ క్రియేట్ చేసి ఆమె కుటుంబాన్ని కూడా ఈ విషయంలోకి లాగడంతో, ఆమె స్పందించక తప్పలేదు.
రీసెంట్గా బాబీ సింహా పై కేసు నమోదైనట్టు వార్తలొచ్చాయి. ఓ ఇంజినీర్ను బెదిరించిన నటుడు బాబీ సింహా సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్టు సంచలన ఆరోపణలు చేశాడు బాబీ సింహా.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన 'యాత్ర' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ టార్గెట్గా యాత్ర2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది.