శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా దర్శకత్వంలో ‘మృత్యుంజయ్’ ఇవాళ విడుదలైంది. ప్రమాదాలుగా చిత్రీకరించిన హత్యల వెనుక గుట్టును రిపోర్టర్ జయ్ ఎలా ఛేదించాడనేదే ఈ పరిశోధనాత్మక థ్రిల్లర్ కథ. శ్రీవిష్ణు నటన, ద్వితీయార్ధంలో మైండ్ గేమ్ సినిమాకు బలం. కాలభైరవ సంగీతం ఉత్కంఠను పెంచింది. సాగదీత సీన్లు ఉన్నా, థ్రిల్లర్ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. రేటింగ్: 2.75/5
శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా దర్శకత్వంలో ‘మృత్యుంజయ్’ ఇవాళ విడుదలైంది. ప్రమాదాలుగా చిత్రీకరించిన హత్యల వెనుక గుట్టును రిపోర్టర్ జయ్ ఎలా ఛేదించాడనేదే ఈ పరిశోధనాత్మక థ్రిల్లర్ కథ. శ్రీవిష్ణు నటన, ద్వితీయార్ధంలో మైండ్ గేమ్ సినిమాకు బలం. కాలభైరవ సంగీతం ఉత్కంఠను పెంచింది. సాగదీత సీన్లు ఉన్నా, థ్రిల్లర్ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. రేటింగ్: 2.75/5
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. మార్చి 15న జరగనున్న ఆస్కార్ వేడుకల్లో ఆమె ప్రజెంటర్గా వ్యవహరించనుంది. హాలీవుడ్ ప్రముఖులతో కలసి ఆమె ఒక విజేతకు అవార్డు అందించనుంది. దీంతో ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లోనూ ఆమె ప్రజెంటర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
యాంకర్, నటి అనసూయ ఇటీవల పాల్గొన్న హోలీ సంబరాల్లో ట్రోలింగ్కు గురైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆమె అసహనం వ్యక్తం చేసింది. ‘ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని సమాజం నిలదీసే రోజు రావాలి. మహిళలపై వివక్ష చూపడం సరికాదు. ఇలాంటివారిని చూసి సమాజం సిగ్గుపడాలి. ఎన్నో ఎదుర్కొని పైకి వచ్చేవారిని విమర్శించడానికి మీరెవరు?’ అంటూ ఆమె పోస్ట్ పెట్టింది.
ఇటీవల మలయాళ చిత్రం ‘సర్వం మాయ’లో ప్రీతి ముకుందన్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె బాలీవుడ్లోకి అడుగుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కార్తిక్ ఆర్యన్ ‘నాగ్జిల్లా’ సినిమాలో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలోని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసినట్లు సమాచారం. మృగ్దీప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్లో కొన్నిసార్లు హిట్ కొట్టాలనే ఆత్రుతతో పాత్రలను అంగీకరించి తప్పు చేశానని తెలిపింది. ఇకపై తనని అగౌరవపరిచే పాత్రలు చేయనని వెల్లడించింది. అలాగే, కెరీర్లో ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడినట్లు భూమి చెప్పుకొచ్చింది.
దుబాయ్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న వారికి నటుడు సోనూసూద్ ఉచిత వసతి కల్పిస్తున్నారు. ఏ దేశస్థులైనా పర్వాలేదు, ఎలాంటి షరతులు లేకుండా మీరు ఉచితంగా బస చేయవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత్వం మాత్రమే ముఖ్యం అని సోనూసూద్ పేర్కొన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మెసేజ్ చేస్తే, తన టీమ్ సంప్రదించి ఏర్పాట్లు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
‘మృత్యుంజయ్’ ప్రీమియర్ షోకి వచ్చిన వారి స్పందన చూశానని, అందరూ ఎంజాయ్ చేశారని హీరో శ్రీవిష్ణు తెలిపాడు. సిినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజయ్ చేస్తారని, రాజమౌళి నుంచి ఈ సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని అన్నారు. రాజమౌళి నుంచి మా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిందన్నాడు. NTR ట్రైలర్ రిలీజ్ చేశారని, నానీ తమ మూవీ చూసి మెచ్చుకున్నారని గుర్తుచేశాడు.
సీఎం రేవంత్ రెడ్డి నటుడు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయ్, రష్మిక దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, హైదరాబాద్ తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహావిందు నిన్న ఘనంగా జరిగింది. వీరి పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్లో జరిగిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు బాబీ ‘మెగా 158’ మూవీని తెరకెక్కించనున్నాడు. మార్చి 14న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనుండగా.. ఏప్రిల్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా AR రెహమాన్ పేరు వినిపించగా.. చివరికి తమన్ను ఫైనల్ చేసినట్లు సమాచారం.
‘వృషకర్మ’ ఈవెంట్లో దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సినిమాపై ఇష్టం కలగడానికి కింగ్ నాగార్జునే కారణమని, ఆయనే తన మొదటి హీరో అని తెలిపాడు. ఇప్పుడు ఆయన తనయుడు నాగచైతన్యతో సినిమా చేయడం తన అదృష్టమని పేర్కొన్నాడు. చైతన్య కెరీర్లోనే ది బెస్ట్ సినిమా ఇస్తానని, ఈ చిత్రం భారీ స్థాయిలో ఉండబోతోందని ఎంతో ధీమాగా వ్యక్తం చేశాడు.
ప్రముఖ OTT వేదిక జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘D/O ప్రసాద్రావు కనబడుటలేదు’ వెబ్ సిరీస్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఫిబ్రవరి 27న ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్కు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సిరీస్లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి రాజస్థాన్ ఉదయ్పూర్లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల ఖర్చుపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. రాజస్థాన్ వేడుకలు, నగలు, షాపింగ్, సంగీత్, హైదరాబాద్ రిసెప్షన్, అభిమానుల మీట్ ఇలా అన్నింటికీ కలిపి సుమారు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ జంట ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది.
‘వృషకర్మ’ గ్లింప్స్ లాంచ్లో నాగచైతన్య దర్శకుడు కార్తీక్ దండుపై ప్రశంసలు కురిపించాడు. తొలుత కథ విన్నప్పుడు విజువల్స్ విషయంలో సందేహాలు కలిగినా, గ్లింప్స్ చూశాక కార్తీక్ విజన్ అర్థమైందని తెలిపాడు. ‘కార్తీక్ అద్భుతమైన విజనరీ, ఆయన గురించి జీవితాంతం మాట్లాడుతూనే ఉంటాను’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత మొదటిసారి విజయ్ అమ్మమ్మ ఊరికి వెళ్లారు. అక్కడ విజయ్ తన తాతయ్య గోపాల్ రావు, అమ్మమ్మ ప్రమీల సమాధుల వద్ద భార్య రష్మికతో కలిసి నివాళులర్పించి, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం బంధువుల ఇళ్లకు వెళ్లి పెద్దల దీవెనలు పొందారు. వీరి ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.