తమిళ హీరో విశాల్, దుషారా విజయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘మకుటం’. తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు దుషారా పోస్ట్ పెట్టారు. ‘ఈ షూటింగ్ సమయంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. ప్రతిక్షణం చాలా మధురంగా అనిపించింది. గర్వంగా భావిస్తున్నా. ఇవన్నీ సాధ్యం చేసిన చిత్రబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.