ఓ పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి రూ.60 కోట్లు మోసం చేశారనే ఆరోపణలతో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదైంది. ఈ కేసు విషయంపై శిల్పా దంపతులకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. వారిద్దరూ తరచూ విదేశాలకు వెళ్తుండటంతో ఈ నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసులు వెల్లడించారు.