మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి ఎదుగుదలను చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల విడుదలైన ఓ మూవీలో పృథ్వీరాజ్ పేరు తొలగించాలని చూశారని వాపోయారు. కాగా, ప్రస్తుతం మహేష్ బాబు ‘వారణాసి’ సినిమాలో సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.