‘ధురంధర్’ మూవీపై పశ్చిమాసియాలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి నిర్మాతల మండలి లేఖ రాసింది. ఈ చిత్రాన్ని ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు.. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపింది. కానీ అక్కడ ఈ మూవీని బ్యాన్ విధించడం తమ భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడమేనని పేర్కొంది.