సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ చిత్రం గురించి రేపు కీలక ప్రకటన వెలువడనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్పై నిర్మించబోతున్నాడు. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉ.11 గంటలకు వెల్లడించనున్నారు.