తన మార్ఫింగ్ ఫొటోలు SMలో వైరల్ అవ్వడంపై నటి అనుపమ పరమేశ్వరన్ స్పందించింది. ‘దీనిపై పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో తమిళనాడుకు చెందిన 21ఏళ్ల అమ్మాయి నా ఫొటోలను మార్ఫింగ్ చేసినట్లు తేలింది. ఇన్స్టాలో ఫేక్ అకౌంట్ సృష్టించి మార్ఫింగ్ ఫొటోలతో పాటు అసభ్యకర కంటెంట్తో నా ఇమేజ్ను డ్యామేజ్ చేసింది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని పోస్ట్ పెట్టింది.