TG: కేంద్రం నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్, BRS డబ్బులు పంచుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ రూ.5 వేలు, BRS రూ.7 వేలు ఇస్తున్నాయని తెలిపారు. ఔరంగజేబు వారసులు కావాలా.. రాముడి వారసులు కావాలా తేల్చుకోవాలన్నారు.