దిగ్గజ దర్శకుడు SS రాజమౌళి ఇటీవల ‘వారణాసి’ మూవీ ఈవెంట్లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజమౌళిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం సభ్యులు సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.