మహిళల ఆరోగ్యానికి నానబెట్టిన నల్ల కిస్మిస్ అద్భుత ఔషధమని నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గి, హార్మోన్ల ఉత్పత్తి బ్యాలన్స్ అవుతుంది. ముఖ్యంగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు దృఢంగా మారడమే కాక, చర్మంపై ముడతలు రాకుండా యవ్వనంగా ఉంచుతుంది. అయితే రాత్రి 6-10 ద్రాక్షలను నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తింటే మంచిది.
యోగాసనాల్లో శవాసనం చేయడం చాలా సులభం. ఇది చాలా మందికి ఇష్టమైన ఆసనం కూడా. దీనికి శవంలా పడుకుంటే చాలు. శవాసనం చేస్తున్నప్పుడు పడుకుని మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేయాలి. కళ్ళు మూసుకుని ఈ ఆసనం వేసేటప్పుడు మనస్సు శరీరంలోని ప్రతి భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వాలి. దీంతో రక్తపోటు తగ్గుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల ‘Y’ క్రోమోజోమ్ను ఎక్కువగా నష్ట పోతున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులతోపాటు, తక్కువ ఆయుర్దాయంతో ముడిపడి ఉందట. 60 ఏళ్లు పైబడిన పురుషులలో ‘Y’ క్రోమోజోమ్ లోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆడవారితో పోలిస్తే మగవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఇది ఒక కారణం కావొచ్చని అంచనా వేశారు.