తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసింది. సీఎం కేసీఆర్ పాల్గొని ముస్లింలకు ఖర్జూరా తినిపించి ఉపవాసం విడిపించారు.
తిరుమల(Tirumala)లో హనుమత్ జయంతి(Hanuman Jayanth) ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మే 14వ తేది నుంచి 18వ తేది వరకూ ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ(TTD) ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు.
శ్రీశైల మహాక్షేత్రం (Srisailam Temple)లో భ్రమరాంభ అమ్మవారి(Bhramaraambha) వార్షిక కుంభోత్సవ సాత్విక బలి ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి గ్రామదేవత అంకాలమ్మ(Ankaalamma)కు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవు దినాల కారణంగా తిరుమల శ్రీవారి(Srivari)ని దర్మించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు లభించిన సెలవులను సద్వినియోగం చేసుకోవాలని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు
మూడు రోజులు వరుస సెలవులు కావడంతో తిరుమల (Tirumala) కొండకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో నేడు కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. ఉద్యోగులు(employees), ఇంటర్ పరీక్షలు పూర్తయిన విద్యార్థులతో తిరుమల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ బాగా పెరిగిపోవడంతో స్వామివారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన క్యూలైన్ శిలాతోరణం అవతలి వరకు ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల (Tirumala) కొండ నిండా భక్తులే ఉన్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుపతి దేవస్థానంలో (Tirupati Devasthanam) భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి (Srivari) సర్వదర్మనానికి 30 గంటల సమయం పడుతుంది.
కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామలోరి కల్యాణం కమనీయంగా జరిగింది. బుధవారం అర్ధరాత్రి సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు రామనామస్మరణతో మార్మోగాయి.
పట్టాభిషేకాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంది.