మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని బాల్య తండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అనిత(27) అనే మహిళ గురువారం రాత్రి మృతి చెందింది. తండాలో ఉన్న గృహాలకు షార్ట్ సర్క్యూట్ కావడంతో తండావాసులు భయభ్రాంతులకు గురి అయి పరుగులు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
MDK: జిల్లా తూప్రాన్ పట్టణంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తూప్రాన్లో జరిగిన జన్మదిన వేడుకలకు శివంపేటకు చెందిన ఈసుగారి అరుణ్ అలియాస్ బబ్లు(18), మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన శ్రీనివాస్ గౌడ్, పాలాట గ్రామానికి చెందిన మహేందర్ హాజరయ్యారు. వీరు వెళ్తున్న బైక్ను మరో వాహనం ఢీకొనడంతో అరుణ్ చనిపోయాడు.
BDK: 9వ మైలు తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో RMP వైద్యుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కిష్టారానికి చెందిన లక్ష్మణ్ గురువారం రాత్రి ఇల్లందు నుంచి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో RMP తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GDL: ఐజ పట్టణంలో శుక్రవారం కొత్త బస్టాండ్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్ లైన్ మెన్ కృష్ణయ్య గాయాలపాలయ్యాడు. కృష్ణయ్య ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆర్టీసీ బస్సు వెనక టైరు ఆయనపైకి ఎక్కింది. దీంతో కాలు నుజ్జు నుజ్జు అయింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
RR: భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన నాగలక్ష్మికి మనోజ్ అనే వ్యక్తితో ఇటీవల వివాహమైంది. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో నాగలక్ష్మి బుధవారం ఆన్లైన్లో విషం తెప్పించుకొని తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది.
ఛత్తీస్గ్ఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో రెండు 12-బోర్ తుపాకులు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన ...
సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో లారీలో తరలిస్తున్న డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ రూ.50 కోట్లు విలువ ఉంటుందని సమాచారం. వీటిని ఏపీలోని ఓడరేవు నుంచి ముంబయి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
NZB: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఆమె బంధువులు, స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన అతడు చికిత్స పొందుతూ మృతిచెందగా శుక్రవారం ఉదయం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
TG: సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో మాడిగి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లారీలో తరలిస్తున్న డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.50 కోట్లు ఉండవచ్చని అధికారుల అంచనా. ఆ డ్రగ్స్ని ఏపీలోని ఓడరేవు నుంచి ముంబై త...
BDK: డబ్బులు ఇప్పించిన విషయంలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన పినపాక మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణయ్ ఓ వ్యక్తికి అప్పు ఇప్పించాడు. ఆ వ్యక్తి తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో ఒత్తిడికి గురైన ప్రణయ్ రెండు రోజుల క్రితం పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు.
TG: కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను ఓ వ్యక్తి కడతేర్చిన ఘటన హైదరాబాద్లోని బేగంబజార్లో చోటు చేసుకుంది. సిరాజ్ అనే వ్యక్తి తన భార్యను గొంతుకోసి, కుమారుడి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చూసిన సిరాజ్ పెద్ద కుమారుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే దీనికి కారణమని భావిస్తున్నట్ల...
HYD: బేగంబజార్ పీఎస్ పరిధిలో తోప్ ఖానాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన సిరాజ్ నగరానికి వలస వచ్చి తన ఇద్దరు కుమారులు భార్యతో నివాసం ఉంటున్నాడు. కాగా, గురువారం రాత్రి సిరాజ్ భార్య, చిన్న కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన పెద్ద కుమారుడు పారిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
HYD: బేగంబజార్ పీఎస్ పరిధిలో తోప్ ఖానాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన సిరాజ్ నగరానికి వలస వచ్చి తన ఇద్దరు కుమారులు భార్యతో నివాసం ఉంటున్నాడు. కాగా, గురువారం రాత్రి సిరాజ్ భార్య, చిన్న కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన పెద్ద కుమారుడు పారిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
HYD: బహదూర్పుర పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిషన్ బాగ్ ప్రాంతంలో జనవాసాల నడుమ ఉన్న స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్కి సైతం మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.
TG: పలు కేసుల్లో నిందితురాలిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న ధూల్పేట్ గంజాయి డాన్ అంగూర్ బాయిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ ధూల్పేట్ కింద కార్వాన్లో ఎక్సైజ్ పోలీసు బృందం ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకున్నారు. అంగూర్ బాయిపై ధూల్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మంగళ్హాట్లో 4 కేసులు, అసిఫ్నగర్, గౌరారం స్టేషన్లలో 10 ...