KDP: చెన్నూరు మండలంలోని ఓబులంపల్లె పంచాయతీ పరిధిలోని వాటర్ గండి వద్ద పెన్నా నది నీటిలో శుక్రవారం యువకుడు గల్లంతయ్యాడు. కడప పట్టణం అశోక్ నగర్కు చెందిన దాట్ల యోహన్ అనే యువకుడు విహారయాత్రకు వాటర్ గండి ప్రాంతానికి వచ్చాడు. నదిలో ఈత ఆడుతూ ప్రమాదవశాత్తు పెన్నా నది నీటిలో గల్లంతయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
TG: వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐలో దోపీడీ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ, మహారాష్ట్రకు చెందిన ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో మరో ముగ్గురు దొంగలు ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రూ.1.8 కోట్ల విలువైన బంగారం, కారు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 18న రూ.13.61 కోట్ల విలువైన బంగారం చోరీ చేశారు.
AP: అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలోని కంపెనీలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. విజయశ్రీ ఫార్మా కంపెనీలో రసాయనాలు పడి ఇద్దరికి గాయాలయ్యాయి. ఆ ఇద్దరు కార్మికులను కంపెనీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
AKP: నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. నాతవరం మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన బొత్స శివ అప్పలనాయుడు అనే ఆర్మీ జవాన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం సాయంత్రం ఏడు గంటలకు లాడ్జిలో రూము తీసుకున్న అప్పలనాయుడు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విగతజీవుడిగా కనిపించారు.
HYD: మలక్పేట మెట్రోస్టేషన్ వద్ద అగ్నిప్రమాదం జరగడం నగరంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి బైకులను తగలబెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. మెట్రోస్టేషన్ కింద పెట్రోల్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మలపడు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ను ట్యాంకర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కరిముల్లాకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్కు సమాచారం అందించి నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యాబుద్ధులు నేర్పిన ప్రిన్సిపల్ను ఓ విద్యార్థి కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఛతర్పుర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సక్సెనా ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు. రోజుటి లాగే పాఠశాలకు వెళ్లిన సక్సెనాపై ఓ విద్యార్థి కాల్పులు జరపటంతో అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థిని మందలించటంతో ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. కాల్పుల తర్వాత ఆ విద్యార్థి ప్రిన్సి...
ప్రకాశం: గిద్దలూరులోని రజక బజారులో శుక్రవారం కత్తి దాడికి గురైన సుహాసి అనే మహిళ మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గుర్తు తెలియని వ్యక్తి సుహాసినిపై కత్తితో దాడి చేయడంతో స్థానికులు మొదట గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మార్కాపురం పంపారు.
కర్నూలు: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరిలో మతిస్థిమితం లేని ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలోపడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కుమ్మరి శంకరయ్య (65) కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి రహదారులు వెంట తిరుగుతూ ఉండేవారని అన్నారు. రహదారి వెంట నడుచుకుంటూ వెళ్లిన ఆయన చిప్పగిరి గ్రామ సచివాలయం వెనక ఉన్న బావిలో పడి మృతి చెందాడని తెలిపారు.
TG: హైదరాబాద్, మలక్పేట్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. పిల్లర్ నంబర్ 1409 వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. పార్క్ చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 5 బైకులు దగ్ధం అయ్యాయి. దీంతో దట్టమైన పొగ వ్యాపించింది. పొగ మూలంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా: సీతనపల్లి లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డరని తెలిసింది. ఒక లారీ ఒక ట్రాక్టర్ నీ ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత తిమ్మారెడ్డి శుక్రవారం గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నేతలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. తిమ్మారెడ్డి మృతికి మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి సంతాపం తెలిపారు.
W.G: నల్లజర్ల మండలం దుబచర్లలో శుక్రవారం మరో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతింది. క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిలిభిత్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న ఎర్టిగా కారు అదుపుతప్పి హైవే పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. చెట్టును ఢీ కొట్టిన వెంటనే కారు ముక్కలైంది. కారులో 11 మంది ఉన్నారు. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలవగా.. వారిని ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రకాశం: కొరిశపాడు మండలం మెదరమెట్ల గ్రామంలోని స్థానిక దర్గా సెంటర్ నందు బీహార్ రాష్ట్రానికి చెందిన సలీమా ఖాతుమ్ శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలించారు. అయితే యువతి ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.