• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం

MDK: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కొల్చారం మండలం రంగంపేటకు చెందిన కార్తీక్ (24) మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి HYDకి వెళ్తుండగా మియాపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు.

December 1, 2024 / 12:09 PM IST

చలిగాలులకు వ్యక్తి మృతి

TPT: వాకాడు మండలం వాళ్లమేడు గ్రామానికి చెందిన బండి శేషయ్య(73) అనే వ్యక్తి చలిగాలులకు మృతి చెందారు. చలిగాలులకు తీవ్ర ఇబ్బంది పడిన శేషయ్యను ఆదివారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా జీవచ్ఛవంలాగా పడిఉండడంతో స్థానిక వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారని మృతుని బంధువులు తెలిపారు.

December 1, 2024 / 12:05 PM IST

విద్యార్ధిని మిస్సింగ్‌పై కేసు నమోదు

కోనసీమ: ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17ఏళ్ల విద్యార్థిని అదృశ్యంపై రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి కేసు నమోదు అయింది. ఆమె రాజమండ్రిలో హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్లిన ఆమె తిరిగి రాలేదని వసతి గృహ సంక్షేమ అధికారిణి నాగమణి ఇచ్చిన ఫిర్యాదుపై రాజమండ్రిలో కేసు నమోదు చేశారు.

December 1, 2024 / 12:03 PM IST

వివాహేతర సంబంధంతోనే హత్య.?

TPT: శ్రీకాళహస్తి మండలం ఓటుగుంట ఎస్టీ కాలనీలో శనివారం రాత్రి యువకుడు రవిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, రవిని వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. రవి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన స్వస్థలం వెంకటాపురం కాగా ఏడేళ్లుగా ఓటుగుంట ఎస్టీ కాలనీలో ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

December 1, 2024 / 11:54 AM IST

జడ్జికి రూ.35 వేల లంచం.. వ్యక్తి అరెస్ట్

కోర్టులో విచారణ సందర్భంగా లేబర్ కోర్టు జడ్జికి ఓ వ్యక్తి రూ.35 వేల లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. జడ్జికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన బాపు సోలంకి అనే వ్యక్తిని గుజరాత్ అవినీతి నిరోధక బ్యూరో అరెస్టు చేసింది. సోలంకి కోర్టు గదిలోకి వెళ్లి జడ్జి టేబుల్‌పై మూసివున్న కవరు ఉంచాడు. దాన్ని తెరవమని న్యాయమూర్తి తన సిబ్బందిని కోరగా.. కవరు లోపల రూ.35,000 కనిపించినట్లు అధికారులకు తెలిపారు.

December 1, 2024 / 11:32 AM IST

ఆటో ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

KRNL: ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన రాజాం పట్టణంలోని హీరో బైక్ షో రూమ్ వద్ద శనివారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు మేరకు ఓ ప్యాసింజర్ ఆటో వేగంగా వచ్చి రోడ్డును దాటుతున్న సుమారు 60 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తలపై తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియలేదు.

December 1, 2024 / 11:04 AM IST

ఆటో ఢీకుని మహిళ మృతి

వరంగల్: నర్సంపేట ప్రధాన రహదారి లేబర్ కాలనీ అపోలో ఫార్మసి వద్ద ఆదివారం రోడ్డు దాటుతున్న ఇద్దరు దంపతులను ఆటో ఢీకొట్టింది. దంపతులను ఆస్పత్రికి తరలించగా లేబర్ కాలనీకి చెందిన ల్యాదేళ్ల సంపూర్ణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు.

December 1, 2024 / 10:34 AM IST

విచారణ కోసం రాజ్ కుంద్రాకు ఈడీ పిలుపు

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను విచారణ నిమిత్తం హాజరుకావాలని ఈడీ కోరింది. పోర్న్ రాకెట్ కేసులో అశ్లీల చిత్ర నిర్మాణం, ప్రసారం కేసులో భాగంగా అతని ఇల్లు, కార్యాలయాలపై దాడి చేసిన రెండు రోజుల అనంతరం ఇది జరిగింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని కుంద్రాను కోరినట్లు వర్గాలు తెలిపాయి.

December 1, 2024 / 10:00 AM IST

రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను విచారణ నిమిత్తం హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. పోర్న్ రాకెట్ కేసులో అశ్లీల చిత్ర నిర్మాణం, ప్రసారం కేసులో భాగంగా అతని ఇల్లు, కార్యాలయాలపై దాడి చేసిన రెండు రోజుల అనంతరం ఇది జరిగింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని కుంద్రాను కోరినట్లు వర్గాలు తెలిపాయి.

December 1, 2024 / 10:00 AM IST

రైల్వే ట్రాక్ పై యువకుడు ఆత్మహత్య

NLG: నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లిలో విషాదం నెలకొంది. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన కామసాని వేణుకుమార్ రెడ్డి(29) శనివారం రాత్రి 10గం.ల సమయంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం కమాన్ దగ్గరలోని రైల్వే ట్రాక్ పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు కొద్దిరోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

December 1, 2024 / 09:50 AM IST

వ్యవసాయ పనులకు వెళ్తూ మృత్యువాత

NZB: వ్యవసాయ పనులకు వెళ్తూ ఓ రైతు మృత్యువాత పడిన విషాద ఘటన. పెర్కిట్‌కు చెందిన శ్రీరాం అశోక్ ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం బైక్ పై వెళ్తుండగా నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ పంప్ సమీపంలో ఢీ కొట్టింది. ఈప్రమాదంలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

December 1, 2024 / 09:33 AM IST

కోడి కోసం వెళ్లి వ్యక్తి మృతి

KDP: కోడి కోసం వెళ్లిన వ్యక్తి చనిపోయిన ఘటన జిల్లాలో జరిగింది. కొండాపురంలోని వడ్డెవాళ్ల కాలనీకి చెందిన కుడుమల నాగేశ్(52) ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కోళ్ల కోసం మిద్దె పైకి ఎక్కారు. ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

December 1, 2024 / 09:18 AM IST

ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్‌కు రిమాండ్

TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుద‌ల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్‌కు రిమాండ్ విధించారు. నిఖేష్ కు ఈనెల 13 వరకు ఏసీబీ జడ్జి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో కాసేపట్లో నిఖేష్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

December 1, 2024 / 09:15 AM IST

పురుగుమందు తాగి వ్యక్తి మృతి

ELR: పోలవరం మండలం గుంజవరంకి చెందిన రాంబాబు (46) మృతిపై అతని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. రాంబాబు నవంబర్ 28న పురుగుమందు సేవించడం జరిగిందని, రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. రాంబాబు మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కుమారుడు రవీంద్ర శనివారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

December 1, 2024 / 08:36 AM IST

చంద్రగిరిలో దొంగతనం

TPT: చంద్రగిరి మండలం కొత్తఇళ్లు గ్రామంలో భారీ దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన సిద్ధులు నాయుడు కుటుంబం శనివారం ఇంటికి తాళాలు వేసి తిరుపతిలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. ఇదే అవకాశంగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంటిలోని రూ.6 లక్షలు నగదు, సుమారు 200 గ్రాముల బంగారాన్ని దోచుకుపోయారు.

December 1, 2024 / 08:23 AM IST