• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

నిప్పంటుకొని మహిళకు తీవ్ర గాయాలు

ATP: గుంతకల్లు మండలం గుర్రబాడు గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు ఇంట్లో వంట చేస్తుండగా చీరకు నిప్పంటుకొని లక్ష్మీ అనే వివాహితకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుల సూచనలు మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

December 14, 2024 / 07:21 AM IST

ఒంగోలులో పదినెలల బాలుడు కిడ్నాప్

ఒంగోలు నగరంలోని ప్రగతినగర్‌లో పది నెలల బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. ఒడిశాకు చెందిన ప్రదీప్ సునానీ మూడేళ్లుగా ఒంగోలు కార్ కేర్లో పనిచేస్తున్నాడు.‌ ప్రగతినగర్‌లో ఉంటున్న అతని కుమారుడు మహీర్‌ను పక్కింట్లో ఉంటున్న దయామణి తీసుకెళ్లి తీసుకురాలేదు. దీంతో తల్లిదండ్రులు వెతకగా ఎవరూ కనిపించలేదు. దీంతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు

December 14, 2024 / 07:04 AM IST

పేకాట స్థావరంపై దాడి.. నగదు స్వాధీనం

ప్రకాశం: మార్టూరు మండల పరిధిలోని రాజుపాలెం- విజయనగర్ కాలనీ మధ్యలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో మార్టూరు సీఐ శేషగిరిరావు శుక్రవారం దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.72వేలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

December 14, 2024 / 06:55 AM IST

అతి కిరాతకంగా తల్లిదండ్రులను చంపిన కుమారుడు

కన్న తల్లిదండ్రులను కుమారుడు అతి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం బాపట్ల మండలంలో చోటుచేసుకుంది. అప్పికట్లలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు విజయ భాస్కరరావు దంపతులు జీవిస్తున్నారు. గత అర్థరాత్రి సమయంలో ఈ దంపతులపై వారి కుమారుడు బలమైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు పట్టించారు. అయితే ఈ హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

December 14, 2024 / 05:20 AM IST

మనుబోలు పోలీసు స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం

NLR: మనుబోలు మండల కేంద్రమైన మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదిమందికి పైగా గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా పలమనేరు వాసులు ఓ టూరిస్ట్ బస్సులో తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి సొంత ఊరికి వెళుతుండగా ముందు వెళ్తున్న వాహనం ఆగడంతో బస్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. దీంతో నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న లారీ వేగంగా ఢీ కొట్టింది.

December 14, 2024 / 04:25 AM IST

వినుకొండలో రైలు కిందపడి ఆత్మహత్య

PLD: డోన్ వైపు వెళుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. శుక్రవారం వినుకొండ – చీకటిగలపాలెం రైల్వేస్టేషన్ మధ్య డోన్ వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుడు నిండు చేతులు చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడన్నారు. చొక్కా మీద ఈధర్ అనే గ్రామం పేరు ఉన్నట్లు చెప్పారు.

December 14, 2024 / 04:10 AM IST

చెరుకుపల్లిలో యువకుడి అదృశ్యం

బాపట్ల: చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యంపై చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చెరుకుపల్లిలో గ్లోబల్ కంప్యూటర్స్ అండ్ మొబైల్స్ వ్యాపారం చేస్తున్న షేక్ మహమ్మద్ ఖాసీం వలీ ఈనెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఖాసీం తల్లి షేక్ కరిమున్నీసా శుక్రవారం చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

December 14, 2024 / 04:04 AM IST

800 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

TG: మెదక్ జిల్లా మాడిగి RTA చెక్‌పోస్ట్ వద్ద 800 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముంబైకి లారీలో తరలిస్తున్న గంజాయిని పూణె, గోవా రాష్ట్రాలకు చెందిన DRI స్పెషల్‌ఫోర్స్ అధికారులు వెంబడించగా..లారీ డ్రైవర్.. చెక్‌పోస్ట్ వద్ద వాహనాన్ని వదిలి పారిపోయాడు. డ్రైవర్ ఎంతసేపటికి రాకపోవడంతో లారీని పరిశీలించగా గంజాయి విషయం బయటపడింది. వెంటనే గంజాయిని ఇరు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగ...

December 14, 2024 / 02:42 AM IST

రూ. 10 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

గుజరాత్‌లోని పాటన్‌లో 5 టన్నుల ఎర్రచందనం దుంగలను ఏపీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 155 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గుజరాత్‌ పోలీసుల సాయంతో దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు సంబంధించిన ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. ఈ ఎర్రచందనం విలువ రూ. 10 కోట్లు ఉంటుందని అంచనా.

December 14, 2024 / 12:03 AM IST

ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మహిళకు తీవ్ర గాయాలు

ATP: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుర్రబాడు గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు ఇంట్లో వంట చేస్తుండగా చీరకు నిప్పంటుకొని లక్ష్మీ అనే వివాహితకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుల సూచనలు మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

December 13, 2024 / 07:57 PM IST

నకిలీ నోట్లు స్వాధీనం.. ఆరుగురు అరెస్టు

AP: శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సరిహద్దు ప్రాంతం పట్టుపురం వద్ద నకిలీ కరెన్సీ నోట్లు మార్పు చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.57.25 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిలో ఒకరు  వైసీపీ ఎంపీటీసీ కరజాడ గ్రామానికి చెందిన దాసర రవికుమార్ అని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 13, 2024 / 04:05 PM IST

బాపట్లలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

BPT: బాపట్ల పట్టణం శ్రీనివాస నగర్ ఫస్ట్ లైన్ పబ్లిక్ స్కూల్ దగ్గరలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కర్లపాలెం వైపు నుంచి బాపట్ల వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 13, 2024 / 03:14 PM IST

భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

SRD: జహీరాబాద్ నియోజకవర్గంలో గల తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం పరిధి ప్రత్యేక అధికారుల బృందం భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 13, 2024 / 03:00 PM IST

నందిగామలో తప్పిన పెను ప్రమాదం

ఎన్టీఆర్: నందిగామ బైపాస్ దగ్గర భారీగా గుంతలు ఉండటం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. శుక్రవారం ఉదయం ఒక కారు ముందున్న కారును ఢీకొట్టడం వల్ల ముందున్న కారు స్వల్పంగా ధ్వంసం అయింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రహదారిని మరమ్మతులు చేయవలసిందిగా స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

December 13, 2024 / 02:47 PM IST

హత్య కేసులో కోర్టు ముద్దాయికి జీవిత ఖైదు

KKD: రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని 2020లో జరిగిన ఓ హత్య కేసులో కోర్టు ముద్దాయికి జీవిత ఖైదు విధించింది. రాజమండ్రి రూరల్ కొంతమూరుకు చెందిన కనకదుర్గను హత్య చేసిన కేసులో నరసింహరాజును ముద్దాయిగా కోర్టు నిర్ధారించింది. సాక్షుల విచారణ అనంతరం జడ్జి విజయ్ గౌతమ్ ముద్దాయిపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదుతోపాటు, రూ.2 వేలు జరిమానా విధించారు.

December 13, 2024 / 02:20 PM IST