• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్

TG: గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్‌లోని ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. ఉప్పల్ శాంతినగర్ మై ఫీల్ రెస్టారెంట్ ప్రాంతంలో ఒరిస్సాకు చెందిన సుమన్ పాల్, అశోక్ బిస్వాస్, బిపుల్ బిస్వాస్ గంజాయి అమ్మకాలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎస్టీఎఫ్ టీమ్ దాడి చేయగా 3.8 కేజీల ఎండు గంజాయి పట్టుబడింది. వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు, జైలో కారును స...

October 31, 2024 / 08:14 PM IST

మద్యం మత్తులో కాలువలో పడి వ్యక్తి మృతి

VZM: మెరకముడిదాం మండలం బుధరాయవలసకు చెందిన కాంక్రీట్ లేబర్‌గా పనిచేస్తున్న ఎలకల జోగి నాయుడు (40) గురువారం మధురవాడ మొగదారమ్మ కాలనీ సమీపంలోని ఉన్న కాలువలో పడి మృత చెందాడు. పండగ పూట మద్యం మత్తులో కాలువలో పడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

October 31, 2024 / 07:34 PM IST

బాణసంచా పేలి ఒకరు మృతి

ELR: ఏలూరులోని తూర్పు వీధి గౌరీ దేవి గుడి వద్ద ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఉల్లిపాయ బాంబులు తీసుకెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోతుల పడగా బాంబులు పేలి బండిపై వెనకాల కూర్చున్న సుధాకర్ అనే వ్యక్తి అక్కడక్కడ మృతి చెందాడు. చుట్టుపక్కల ఉన్న మరో ఐదుగురు వ్యక్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు. పోలీసులు విచారణ చేపట్టారు.

October 31, 2024 / 06:18 PM IST

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు

ELR: ఉంగుటూరు జాతీయ రహదారి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. నారాయణపురం నుండి ఉంగుటూరు వెళుతుండగా వెనక నుంచి ఒక వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలు కాగా, అతనిని హైవే అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది.

October 31, 2024 / 05:46 PM IST

యువకుడు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

ATP: అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ప్రభాకర్ కుమారుడు డీ. భరత్ తేజ అదృశ్యమయ్యాడు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయి, తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు అనంతపురం 2 టౌన్ సీఐ 9440796806, ఎస్ఐ 9346917119 నంబర్లకు తెలపాలని కోరారు.

October 31, 2024 / 05:32 PM IST

పామర్రు హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

కృష్ణా: పామర్రులో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామర్రు నుంచి కత్తిపూడి నేషనల్ హైవే కొత్త పెదమద్దాలి గ్రామం వద్ద కారు అదుపు తప్పింది. రోడ్డుపక్కనే ఉన్న కాలువలోకి కారు దూసుకుపోయినట్లు స్థానికులు వెల్లడించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయినట్లు తెలిపారు.

October 31, 2024 / 05:20 PM IST

సముద్రంలో విద్యార్థి గల్లంతు

VZM: భోగాపురం మండలం కొండ రాజుపాలెం గ్రామానికి చెందిన గనగళ్ల దానయ్య సముద్రంలో గల్లంతయ్యాడు. గురువారం ఉదయం ముగ్గురు స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లాడు. దానయ్య గల్లంతుకావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దానయ్య రామచంద్రపేట హైస్కూల్‌లో పదోతరగతి చదువుతున్నాడు.

October 31, 2024 / 05:17 PM IST

యువకుడు మృతి

VSP: భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలోని పద్మనాభం మండలం కురపల్లి గ్రామంలో ఓ ప్రైవేటు రిసార్ట్‌లో స్విమ్మింగ్ ఫుల్‌లో మృతదేహం కలకలం రేపింది. గురువారం ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. స్నేహితుల పుట్టిన రోజు వేడుక‌లో ఈ విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మద్యం తాగి స్విమ్మింగ్ ఫుల్ దిగి అభిషేక్ వంశీ (24)మృతి చెందిన‌ట్టు ప్రాథమిక నిర్థార‌ణ‌కు పోలీసులు వ&zwn...

October 31, 2024 / 05:16 PM IST

‘2 పూరి ఇల్లులు దగ్ధం’

SKLM: సరుబుజ్జిలి మండలం పాటపాడు-పర్వతాల పేట గ్రామంలో గురువారం మధ్యాహ్నం పూరి ఇల్లులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకునే మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో ఎన్.ముఖలింగం కుటుంబానికి చెందిన 2 పూరి ఇల్లులు, సుమారు రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.

October 31, 2024 / 05:02 PM IST

SBIలో అగ్ని ప్రమాదం

VSP: విశాఖపట్నంలోని జైల్ రోడ్డు సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖ ప్రధాన బ్రాంచ్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దట్టంగా పగలు వ్యాపించడంతో స్థానికులు తగిన మాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.

October 31, 2024 / 04:42 PM IST

ఆస్తికొసం కొడుకును హత్యచేయించిన తల్లి

AP: ఆస్తికొసం ఓ తల్లి కన్న కొడుకును హత్య చేయించిన ఘటన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం హసనాబాద్‌లో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా తల్లి, కొడుకు మధ్య ఆస్తి వివాదం కొనసాగుతోంది. దీంతో మహబూబ్ బాషా(28)పై తన తల్లి మున్నీబీ దాడి చేయించింది. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చేందాడు. ‘తల్లి, కుమారుడి మధ్య ఉన్న ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాం.&...

October 31, 2024 / 03:56 PM IST

పెద్దాపురంలో అగ్ని ప్రమాదం.. తాటాకు ఇల్లు దగ్ధం

KKD: పెద్దాపురంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తాటాకుల ఇల్లు దగ్ధం అయింది. గురువారం పెద్దాపురంలోని వీర్రాజుపేటలో మాడ మల్లికార్జున తాటాకు ఇంటిపై తారాజువ్వ పడి ఇల్లు దగ్ధం అయింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోయినా, సుమారు రూ.50,000 ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు.

October 31, 2024 / 03:25 PM IST

బాణసంచా పేలి మహిళ మృతి

ఏలూరు: తూర్పు వీధి గౌరమ్మ గుడి వద్ద గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. దీపావళి బాణసంచా తీసుకెళ్తుండగా బైక్ అదుపుతప్పి గోతిలో పడింది. ఈ సమయంలో బాణసంచా పేలిపోవడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఏలూరు 1టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

October 31, 2024 / 01:13 PM IST

విషాదం: రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

పండగపూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 6గురు మృతి చెందగా 5గురు గాయపడిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. మీరట్ హైవేపై వెళ్లున్న టెంపోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో అందులో ఉన్న 6గురు మృతి చెందారు. అనంతరం వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 5గురు గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...

October 31, 2024 / 12:59 PM IST

కాలువలో పడి మృతి చెందిన వ్యక్తి మృతదేహాం లభ్యం

KKD: సామర్లకోట మండలం పి. వేమవరం గ్రామానికి చెందిన ఆనాల భూషణం మృతదేహం గురువారం ఉదయం పి. వేమవరం పంట కాలువలో లభ్యమైంది. బుధవారం రాత్రి బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

October 31, 2024 / 12:22 PM IST