KRNL: గతనెల 27న రాంపల్లిలో జరిగిన శారద హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పత్తికొండ సీఐ పులిశేఖర్, తుగ్గలి ఎస్సై కృష్ణమూర్తితో కలిసి వివరాలు వెల్లడించారు. హత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టిగా, భార్యపై అనుమానంతో భర్త ఏకాశి రామానాయుడు, మద్దికెర లాలప్ప సహకారంతో కత్తితో పొడిచి హత్య చేశారని తెలిపారు.