SKLM: బూర్జ మండలం డొంకలపర్త వద్ద ప్రధాన రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే ఆ ప్రాంతంలో ప్రతి రోజూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, సంబంధిత అధికారులు చొరవ తీసుకొని గోతులను పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
BHNG: బ్యాంకులో నగదు డ్రా చేసేందుకు వెళ్లిన యువకుడు అదృశ్య మయ్యాడు. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లికి చెందిన ఎండీ సమీర్ చౌటుప్పల్లో నగదు డ్రా చేసేందుకు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లాడు. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. మిత్రులు, బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మేడ్చల్: కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ ముళ్ళ కత్వచెరువు నాలా కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృత దేహాన్ని కాలువలో నుంచి కేపీహెచ్బీ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. రంగపురి ప్రాంతంలోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి.. తన నలుగురు కూతుళ్లను చంపి ఆత్యహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.&n...
TG: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య సుమలత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్(TFCC)లో ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్ గా పని కోసం వచ్చి ప్రేమ పేరుతో తన భర్తను వేధింపులకు గురిచేసినట్లు TFCCలో ఫిర్యాదు చేశారు. బాధితురాలు కక్షతోనే కావాలని జానీ మాస్టర్ పై అక్రమ కేసు పెట్టిందని.. అక్రమ కేసు ఆరోపణలపై చర్య లు తీసుకోవాలని సుమలత విజ్ఞప్తి చేశారు.
కేంద్ర నిఘా సంస్థలు తాజాగా ఉగ్రదాడులపై కీలక హెచ్చరికలు చేశాయి. ముంబై మహానగరంలో ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో ప్రసిద్ధ ప్రార్థనా స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
VZM: ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు గ్రామమైన పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం పాచిపెంట ఎస్సై సురేష్ గంజాయి పట్టుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్ ఒడిస్సా నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీలు చేశారు. వారి వద్ద నుంచి కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళంకు చెందిన ఆవల అనిల్, తన స్నేహితుడు భరత్గా గుర్తించి, వారిపై కేసు నమోదు చేశారు.
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లాలోని 16వ నెంబర్ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. దాదాపు 23 మందికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ నుంచి కొంత మంది భక్తులతో బస్సు.. పూరీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆగ్నేయ అమెరికాలో హరికేన్ హెలెనా బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడాతో పాటు జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా ప్రాంతాల్లో ఇది పెను ప్రభావం చూపించింది. ఆయా ప్రాంతాల్లో 44 మంది మృతి చెందారు. పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో రోడ్లు, ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లోకి నీరు చేరింది. ఘటనాస్థలాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీని కారణంగా 15-26 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధిక...
భారీ పేలుడు సంభవించి ఇళ్లు ధ్వంసమైన ఘటన తమిళనాడులో జరిగింది. విరుదునగర్ జిల్లా సాతూర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించటంతో ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఫైర్ సిబ్బంది, రెస్య్కూ టీమ్ ఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు.
WG: మానసిక దివ్యాంగ బాలికపై కారు డ్రైవర్ వేధింపులకు పాల్పడిన ఘటన ప.గో జిల్లా కాళ్ల మండలంలో జరిగింది. 5వ తరగతి చదువుతున్న బాలికను ఏలూరుకు చెందిన కృపారావు ఈనెల 19న కారులో తీసుకెళ్లి వేధించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటికెళ్లాక ఆ బాలిక తల్లిదండ్రులు చెప్పడంతో వారు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కృపారావును శుక్రవారం అరెస్ట్ చేశామని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
జనగాం: పాలకుర్తి మండలంలో డీసీఎం బోల్తా పడి ఆవులు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివారులో అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాను శనివారం తెల్లవారుజామున అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో తరలిస్తున్న సుమారు 100 గోవులు మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను చౌటుప్పల్ ఆసుపత్రికి, గాయపడిన వారిని హైదరాబాద్కు తరలించారు.
MDK: కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న AR కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా కలెక్టరేట్లో డ్యూటీ చేస్తున్నాడు. రాత్రి తుపాకీతో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు.
VZM: ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాల్లో యువతి ఫోటోలు పెట్టి వేధిస్తున్న విజయనగరానికి చెందిన యువకుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గుంటూరులో అరెస్టు చేసి విశాఖ తీసుకువచ్చారు. విశాఖకు చెందిన ఓ యువతికి ఇన్స్టాగ్రామ్ ద్వారా యువకుడు పరిచయం అయ్యాడు. యువకుడితో కొద్ది రోజులు పాటు చాటింగ్ చేసి తర్వాత కలిసి తీసుకున్న ఫోటోలు ఇన్స్టా ద్వారా అందరికీ పంపించాడు.