• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

మంత్రాలయం మండలంలో రోడ్డు ప్రమాదం

KRNL: మంత్రాలయం మండలం చిలకలడోనా శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై పరమేశ్ నాయక్ వివరాల మేరకు.. బెంగళూరు నుంచి మంత్రాలయానికి వస్తున్న కారును రోడ్డు పక్కన ఆపారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకి చెందిన టెంపో వాహనం కారుని వెనక నుంచి ఢీకొంది. కారులో ఉన్న వికాస్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. టెంపో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులన్నారు.

September 27, 2024 / 01:38 PM IST

శ్రీ చైతన్య కాలేజీలో 100 మంది బాలికలకు అస్వస్థత

TG: శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల 100 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో ఉన్న శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో గర్ల్స్ క్యాంపస్‌లో చోటుచేసుకుంది. దీంతో విద్యార్థినులను సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే యాజమాన్యం మాత్రం వైరల్ ఫీవర్ వచ్చిందని, వర్షాల వల్ల పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యినట్లు తెలుపుతున్నారు.

September 27, 2024 / 01:30 PM IST

వావిలపాడులో మద్యం బాటిళ్లు స్వాధీనం

VZM: వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై బి.దేవి తన సిబ్బందితో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వావిలపాడు గ్రామంలో ఓ మహిళ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 6 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్మినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

September 27, 2024 / 01:00 PM IST

దేవర రిలీజ్.. మంటల్లో ఎన్టీఆర్ కటౌట్

TG: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘దేవర’ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మూవీ విడుదలైన సందర్భంగా అభిమానులు పలుచోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ క్రాకర్స్ కాల్చగా.. అవి ఎన్టీఆర్ కటౌట్ పై పడి మొత్తం కాలిపోయింది.  ఈ ఘటన ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్షన్ థియేటర్ వద్ద చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు అక్కడ ఉన్న వారికి ఎవరికి గాయాలు కాలేదు.

September 27, 2024 / 11:52 AM IST

థియేటర్‌లో దేవర చూస్తూ అభిమాని మృతి

AP: థియేటర్‌లో ‘దేవర’ చూస్తూ అభిమాని ఒకరు చనిపోయాడు. ఈ విషాద ఘటన కడపలోని అప్సర థియేటర్‌లో జరిగింది. మూవీని చూస్తూ మస్తాన్ వలీ అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే మస్తాన్ గుండెనొప్పి రావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుడు సీకే దీన్నె మండలం జమాల్‌పల్లికి చెం...

September 27, 2024 / 11:25 AM IST

‘అదుపుతప్పిన స్పిరిట్ లారీ’

ప్రకాశం: మద్దిపాడు మండలం గుండ్లాపల్లి హైవే వద్ద ఈరోజు ఉదయం కాకినాడ నుండి రేణిగుంట వైపు స్పిరిట్ లోడుతో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్నా మరొక లారీని ఢీ కొని అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. స్పిరిట్ లోడు కావటంతో సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మరియు పోలీసులు సంఘటన స్టలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

September 27, 2024 / 11:21 AM IST

కాలేజ్ బస్సులు ఢీ.. డ్రైవర్ మృతి

TG: ఓ ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ప్రమాదం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కళాశాల బస్సులు ఆటోను తప్పించబోయి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం కారణంగా నర్సాపూర్-సంగారెడ్డి మధ్య భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. 

September 27, 2024 / 10:58 AM IST

గొర్రెల మందపై తోడేళ్లు దాడి

MNCL: నెన్నల మండలం కోనంపేట గ్రామానికి చెందిన ఐలయ్య గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేయడంతో 6 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడి వివరాల ప్రకారం.. గురువారం మేతకు వెళ్లిన గొర్రెలను సాయంత్రం ఊరు బయట మందలో ఉంచారు. ఈ క్రమంలో తోడేళ్లు ఒక్కసారిగా మందపై దాడి చేసి 6 గొర్రెలను పట్టుకొని లాక్కెల్లాయి.

September 27, 2024 / 10:32 AM IST

‘విద్యార్థి మృతదేహం లభ్యం’

W.G: తణుకు మండలం కోనాల గ్రామానికి చెందిన తానంకి శ్రావణి(14) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ప్రధానోపాధ్యాయుడు మందలించడంతో మనస్థాపం చెందిన శ్రావణి గురువారం ముద్దాపురం మూలలంక కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్రావణి ఆచూకీ కోసం గాలించిన ఫైర్, ఎన్డీఆర్ ఆఫ్ సిబ్బందికి శుక్రవారం శ్రావణి మృతదేహాన్ని గుర్తించి తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

September 27, 2024 / 10:18 AM IST

‘బైకును ఢీ కొన్న లారీ.. వ్యక్తి స్పాట్ డెడ్’

ప్రకాశం: జరుగుమల్లి మండలం వాగులేటిపాడు గ్రామ సమీపంలో లారీ ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. సింగరాయకొండకు చెందిన బి శ్రీనివాసులు(43) టంగుటూరు వైపు వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు. చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

September 27, 2024 / 09:28 AM IST

అశోక్ మృతికి గల కారణాలు ఇవే..!

GDWL: గద్వాలలో సీనియర్ అసిస్టెంట్‌ అశోక్ గురువారం ఉరివేసుకున్న విషయం తెలిసిందే. అశోక్ ఇటివలే పెబ్బేరుకు బదిలీ అయ్యారు. ఆర్థిక సమస్యల వల్లే తన భర్త సూసైడ్ చేసుకొని ఉండవచ్చని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై కల్యాణ్‌కుమార్ తెలిపారు. కాగా తాను షేర్ మార్కెట్‌లో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టానని, ఇందులో తన ఫ్రెండ్స్‌వి రూ.20 లక్షలు ఉన్నాయని రాసిన లేఖను పోలీసులు...

September 27, 2024 / 09:04 AM IST

డీసీఎం బోల్తా.. వ్యక్తి మృతి

SRPT: మునగాల మండలం మాధవరం వద్ద డివైడర్ ఢీకొని అదుపుతప్పి డీసీఎం బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు, డీసీఎంలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

September 27, 2024 / 08:40 AM IST

VIDEO: ‘విద్యుత్ ఘాతానికి గురైన రైతు’

AKP: రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన శెట్టి రాంబాబు అనే రైతు శుక్రవారం ఉదయం విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతనిని వెంటనే సమీప బంధువులు చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖపట్నం కెజిహెచ్ ఆసుపత్రికి తరలించారు.

September 27, 2024 / 08:07 AM IST

గోవింద్రాలలో దారుణ హత్య…!

KMM: కామేపల్లి మండలం గోవింద్రాలలో ఓ వికలాంగుడి దారుణ హత్య గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల వివరాలిల ప్రకారం.. గోవింద్రాలకి చెందిన బావుసింగ్(30) దివ్యాంగుడు. ప్రభుత్వ కార్యాలయాలలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

September 27, 2024 / 07:55 AM IST

అభిమానినంటూ ఆభరణాలు దొంగలించిన మహిళ

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఓ 32 ఏళ్ల మహిళ నమ్మించి మోసగించింది. మీ ఫ్యాన్‌ అంటూ.. అతడితో ఫొటోలు దిగుతూ రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలను కాజేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో ఆమెతోపాటు ఆమె భర్తనూ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌ను బురిడీ కొట్టించి మహిళ దొంగిలించిన 100 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

September 26, 2024 / 05:05 PM IST