• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం

హైదరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ నుంచి బండ్లగూడకు వెళ్తున్న లారీ, మంగళవారం అర్థరాత్రి గౌడవెళ్లి సమీపంలో ఓఆర్ఆర్‌పై అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో లారీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమవ్వడంతో.. లారీ డ్రైవర్ సందీప్(27) స్పాట్‌లోనే సజీవదహనమయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.

December 4, 2024 / 01:42 PM IST

కొవ్వూరులో యువకుడు సూసైడ్

W.G: కొవ్వూరు పట్టణంలో యువకుడు బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చందన్ బెహరా కొవ్వూరు థియేటర్ సెంటర్ సమీపంలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియ రాలేదు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

December 4, 2024 / 01:14 PM IST

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

MNCL: కోటిపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని పెట్రోల్ పంప్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని అదే గ్రామానికి చెందిన పాణెం కిరణ్‌(22)గా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

December 4, 2024 / 12:44 PM IST

ఆరిలోవలో లారీ దగ్ధం

VSP: విశాఖపట్నం 12వ వార్డులో ఆరిలోవ దరి శ్రీకాంత్ నగర్‌లో పార్క్ చేసి ఉన్న లారీ బుధవారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైయింది. ఆరిలోవ ఎస్సై కృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే లారీ చాలా వరకు కాలిపోయింది. కాగా ఇది షార్ట్ సర్క్యూటా.. లేక ఆకతాయిల పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

December 4, 2024 / 11:27 AM IST

కూలీల ఆటో బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు

BDK: ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన అశ్వారావుపేట మండలంలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వినాయకపురం చిలకల గండి ముత్యాలమ్మ తల్లి సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిందని చెప్పారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన వారిని అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

December 4, 2024 / 10:40 AM IST

చంద్రగిరి హైవేపై తప్పిన ప్రమాదం

CTR: చంద్రగిరి హైవేలో ఓ ఇన్నోవా వాహనం ప్రమాదానికి గురైంది. బెంగుళూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఇన్నోవా వాహన డ్రైవరు నిద్ర మత్తులో డివెడర్ మధ్య ఉన్న సిగ్నల్ బోర్డును ఢీకొట్టాడు.. దీంతో ఆయన ఎగిరి రోడ్డు పైన పడ్డాడు. డ్రైవర్‌కు ఎలాంటి దెబ్బలు తగలకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడం వలన పెనుప్రమాదం తప్పింది.

December 4, 2024 / 10:28 AM IST

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్య

ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దుండగులు హత్య చేశారు. నెబ్‌సరాయి ప్రాంతంలో నివాసం ఉంటున్న దంపతులు, వారి కుమార్తెను దారుణంగా హత్య చేశారు. ఆ సమయంలో దంపతుల కుమారుడు వాకింగ్‌కి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

December 4, 2024 / 10:22 AM IST

ఆవులపై పెద్దపులి దాడి.. రెండు ఆవులు మృతి

SKLM: పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం గొప్పిలి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో పెద్దపులి దాడి చేసిందని పాతపట్నం అటవీశాఖ సెక్షన్ రేంజర్ పట్ట అమ్మి నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. పెద్దపులి ప్రస్తుతం ఒడిశా ప్రాంతానికి తరలి వెళుతున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. రెండు ఆవులపై దాడి చేయడంతో మృతి చెందాయని ఆయన స్పష్టం చేశారు.

December 4, 2024 / 10:06 AM IST

తెలంగాణ ఉద్యమకారుడు భాస్కర్‌రావు కన్నుమూత

BDK: తెలంగాణ ఉద్యమకారుడు మోరే భాస్కర్‌రావు శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ బుధవారం మరణించారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కొత్తగూడెం ప్రాంతం నుంచి ఆయన కీలక పాత్ర పోషించారు. 2001లో KCR ప్రారంభించిన TRS పార్టీ తరఫున ఈ ప్రాంతం నుంచి కీలక నేతగా పనిచేశారు. వార్డు కౌన్సిలర్‌గా, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు.

December 4, 2024 / 09:36 AM IST

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. మహారాష్ట్రలోని సిర్వంచ, అహేరి, గచ్చిరోలి, చంద్రపూర్‌లో భూప్రకంపనలు వచ్చాయి. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్‌లో స్వల్పంగా భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.

December 4, 2024 / 09:20 AM IST

విషాదం.. మిద్దె కూలి ముగ్గురు మృతి

ATP: జిల్లాలో విషాద ఘటన జరిగింది. రెండ్రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి కందుర్పిలో మిద్దె కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు. మృతులు గంగన్న, సంధ్య, శ్రీదేవిగా గుర్తించారు. పాత మిద్దె కావడంతో వర్షానికి నాని కూలినట్లు తెలుస్తోంది.

December 4, 2024 / 09:13 AM IST

పాత బాకీ అడిగితే మహిళపై కత్తితో దాడి

ATP: గుత్తి పట్టణంలోని కమటం వీధిలో బుధవారం పాతబాకీ ఇవ్వాలని అడిగిన విషయంలో మాటమాట పెరిగి నాజీయ అనే వివాహితపై అదే కాలనీకి చెందిన వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో నజియాకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.

December 4, 2024 / 08:58 AM IST

తీవ్ర విషాదం: ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

AP: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుందుర్పిలో ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఇటీవల వర్షానికి మిద్దెపై వర్షపు నీరు నిల్వ ఉంది. దీంతో మిద్దె కూలినట్లు తెలుస్తోంది. మృతులను గంగన్న, శ్రీదేవి, సంధ్యగా గుర్తించారు.

December 4, 2024 / 08:17 AM IST

ఏపీలో ఎక్కడెక్కడ భూకంపం వచ్చిందంటే

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. విజయవాడ, రాజమండ్రి, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గుడివాడ, మంగళగిరిలో సహా పలు ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే, తెలంగాణలో 20 ఏళ్ల తర్వాత 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమి లోపల 40 కి.మీ. నుంచి రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు వెల్లడించారు.

December 4, 2024 / 08:15 AM IST

ఏపీలో ఎక్కడెక్కడ భూకంపం వచ్చిందంటే..

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. విజయవాడ, రాజమండ్రి, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గుడివాడ, మంగళగిరి సహా పలు ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే, తెలంగాణలో 20 ఏళ్ల తర్వాత 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమి లోపల 40 కి.మీ. నుంచి రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు వెల్లడించారు. మీ ప్రాంతంలో కూడా భూకంపం వచ్చిందా? కామ...

December 4, 2024 / 08:15 AM IST