అన్నమయ్య: పీలేరు మండలంలోని బాలంవారి పల్లి, నూనెవారి పల్లి మార్గంలో పింఛానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పింఛానది ప్రవాహాన్ని రెవెన్యూ, ఎస్ఐ బాలకృష్ణ, పోలీసు అధికారులు మంగళవారం పరిశీలించారు. గతంలో ఇక్కడున్న మార్గంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఇద్దరూ మరణించిన నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు.
SKLM: నరసన్నపేట జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు టెక్కలి నుండి శ్రీకాకుళం వైపు వెళుతున్న బొగ్గు లారీ ముందు పేలిపోవడంతో లారీ బోల్తా పడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 100 మీటర్ల మీద లారీ రైలింగ్ను తాకుతూ విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి.
MNCL: రైలులో ప్రయాణిస్తూ గుర్తుతెలియని ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మృతుడు దాదర్ ఎక్స్ ప్రెస్ రైలులోని జనరల్ బోగీలో అపస్మారక స్థితిలో ఉండగా మంచిర్యాల రైల్వే స్టేషన్లో దింపారు. వెంటనే 108 అంబులెన్స్కు కాల్ చేయగా అక్కడికి చేరుకొని అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచారు.
NTR: తిరుమలగిరి గ్రామానికి చెందిన ఒక్క గృహిణికి నిన్న రాత్రి +918423958177 నెంబర్ నుండి ఎవరో గుర్తు తెలియని కాల్స్ వచ్చాయని ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా చిల్లకల్లు ఎస్ఐ శ్రీనివాస్ ఆ నంబర్ను బ్లాక్ చేయించారు. ఎస్ఐ మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కోనసీమ: ఆలమూరు మండలం చొప్పెల్లకు చెందిన విశ్వనాధుల వీరభద్రరావు ఇంట్లో నవంబర్ 26న జరిగిన చోరీ కేసులో కడియం మండలం రాజవోలు గ్రామానికి చెందిన తమ్మ వినోద్ కుమార్, ఏలూరు పవన్ కుమార్లను అరెస్ట్ చేసినట్లు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.3 లక్షల నగదు, 48 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీన పరుచుకున్నారు.
AP: విజయనగరం జిల్లా నుంచి శబరి వెళ్లిన భక్తులకు ప్రమాదం తప్పింది. గత నెల 25న రేగిడి మండలం మజ్జిరాముడుపేట నుంచి 41 మంది శబరి వెళ్లారు. కంచి వద్ద బస్సు ఆపి వంట చేస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అయ్యప్ప భక్తుల బస్సు, సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ అయ్యప్ప భక్తులు తిరిగి కంచి నుంచి మరో బస్సులో స్వగ్రామం బయల్దేరారు.
CTR: ఏర్పేడు-వెంకటగిరి జాతీయ రహదారిపై మంగళవారం మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతలపాలెం టోల్ ప్లాజా వద్ద ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. కారులో ఉన్న వ్యక్తిని స్థానికులు బయటకు తీశారు. ఉలుకు పలుకు లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.
ATP: ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. మంగళవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసి, వారి నుంచిరూ.22 లక్షల విలువైన 310 గ్రాముల బంగారు నగలు, ఒక కారు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.
SKLM: ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామంలో పొట్లూరు అచ్యుతరావు, పిల్లాటి అప్పన్నమ్మకు చెందిన ఆవులు ఊరి చివర పంట పొలాలలో మేత కోసం వెళ్లగా అక్కడ తెగివున్న విద్యుత్ వైర్లు తగిలి మూడు ఆవులు మంగళవారం విగత జీవులుగా మారాయి. యజమాని లబోదిబోమంటూ రోధిస్తున్నారు. తమ జీవనం ఆవులు పైనే కొనసాగుతుందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
NLR: సంగం మండలం మర్రిపాడులో చిట్టిబోయిన వెంకటేశ్వర్లు అనే రైతు మంగళవారం పిడుగుపాటుకు గురై మృతి చెందారు. వర్షం వస్తున్న సమయంలో పొలంలో పనిచేస్తుండగా అతని వద్ద పిడుగు పడినట్లు సమాచారం. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
TG: వరంగల్ జిల్లా రంగంపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి రాజమోహన్ను కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు. కారులో మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్లారు. సీసీ ఫుటేజ్లో నిందితుల దృశ్యాలు కనిపించినట్లు సమాచారం. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: వరదయ్యపాళ్యం మండలం సిద్ధాపురం సమీపంలోని 129 కిలోమీటర్ వద్ద తెలుగు గంగ ప్రధాన కాలువ అక్విడెక్టుకు గండి పడింది. ఈ గండి కాస్త పెద్దదైతే ప్రధాన కాలువకే గండి పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలో అక్విడెక్టు వద్ధ స్వల్ప కాలిక లీకేజీ ఉండేదని.. ప్రస్తుతం ఆ లీకేజీ ఎక్కువై గండి పడినట్లు చెప్పుకొచ్చారు.
NLR: కావలి హైవే వద్ద అల్లిగుంటపాలెం జంక్షన్ సమీపంలో మంగళవారం ఉదయం 4 గంటలకు లారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనా స్థలానికి నేషనల్ హైవే పోలీసులు వచ్చి క్రేన్లు సహాయంతో లారీని బయటకు తీశారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
MBNR: చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన విజయ్ (16) మంగళవారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసే సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, విజయ్ చిన్నచింతకుంటలో పదో తరగతి చదువుతున్నాడు.
కోనసీమ: విశాఖ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమలాపురానికి చెందిన సుష్మిత, దుర్గారావు కుటుంబాలు బ్రతుకుదెరువు కోసం షీలానగర్లో నివాసం ఉంటున్నారు. సుష్మిత, దుర్గారావుకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరుకుటుంబాలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు ఓ అపార్ట్మెంట్ పైనుంచి దూకేశారు.