దేశంలోని రైల్వేజోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టుల కింద 3,445 జాబ్స్కు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యా అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈనెల 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, అక్టోబర్ 20 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://www.rrbapply.gov.in/ స...
లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 492 మంది మృతి చెందారు. మరో 1600 మందికి పైగా గాయపడ్డారు. కాగా, లెబనాన్పై ఈ స్థాయిలో భీకర దాడి.. 2006 నాటి ఇజ్రాయెల్-హెజ్బొల్లా యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడే జరిగింది.
ELR: పెదపాడు మండలానికి చెందిన భార్యాభర్తలకు సోమవారం జీవిత ఖైదు శిక్ష పడిందని ఏలూరు పోక్సో కోర్టు ఇంఛార్జ్ పీపీ రామాంజనేయులు తెలిపారు. విజయలక్ష్మికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. భర్త మృతితో మేనమామ సతీశ్ను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఆ ఇద్దరిపై సతీశ్ అత్యాచారం చేయగా 2023లో కేసు నమోదయిందన్నారు. నేరం రుజువు కావడంతో ఏలూరు పోక్సో కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది.
VSP: కంచరపాలెం జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై అతివేగంగా డ్రైవ్ చేయడంతో పక్కనే ఉన్న డివైడెర్ని బలంగా ఢీ కొట్టారు. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులు కప్పరాడకు చెందిన యువకులుగా స్థానికులు గుర్తించారు.
NLR: జిల్లా వింజమూరు మండలంలో మోటర్ తీగలు చోరీ చేయడం సంచలనంగా మారింది. వింజమూరు మండలం తక్కెళ్ళపాడులో పొలంలో ఉన్న ఓ మోటార్ తీగలు, పలు సామగ్రిని దొంగిలించారు. గతంలోనూ ఇలాంటివి చాలా జరిగాయని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.
NLR: మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై ఓ ట్రావెల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం విజయవాడ నుంచి చెన్నైకి 18 మంది ప్రయాణికులతో వెళ్తుండగా.. యాచవరం రోడ్డు దాటాక బస్సు టైరు పగిలిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి మరో వైపు వెళ్లిపోయింది. ఆసమయంలో వేరే వాహనాల ఉండకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.
HYD: కోట్పల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. ధారూర్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్ తన స్పెషల్ టీంతో గస్తీ నిర్వహిస్తుండగా వాగు నుంచి ఇసుకను తీసుకెళ్తున్న వాహనాన్ని పట్టుకొని రేంజ్ ఆఫీసుకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేసి పైఅధికారులు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు రేంజ్ ఆఫీసర్ తెలిపారు.
VSP: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ శివారు కల్లివానిపాలెంలో పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7 వేలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
KDP: సిద్దవటం మండలంలోని JMJ కాలేజ్ సమీపంలో సోమవారం బద్వేల్ గ్రామానికి చెందిన నాగరత్నమ్మ,(35) బస్సు దిగి రోడ్డు దాటుతుండగా.. ఒంటిమిట్ట మండలం సాలబాద్ గ్రామానికి చెందిన ప్రదీప్(35) ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి తగలడంతో మహిళకు బలమైన గాయం తగిలింది. గాయపడిన మహిళ, ద్విచక్ర వాహనదారునికి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
KDP: సిద్ధవటం మండలంలో కడప బద్వేలు ప్రధాన రహదారిలోని సుబ్బారెడ్డి ఎస్టేట్ వద్ద సోమవారం మోటార్ బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీ కొనడంతో తీవ్ర గాయాలయతో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందాడు. అతని ఆచూకీ తెలిసినవారు సిద్ధవటం పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిద్ధపటం ఎస్సై తెలిపారు.
NLR: వింజమూరు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి ఏఎస్ పేటకు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి వింజమూరు చెరువులోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బ్రేక్ ఫెయిల్ అవడంతో కారు అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు.
KDP: రాయచోటి మండల పరిధిలోని గొర్లముదివేడుకు చెందిన గౌనిపల్లి మల్లయ్య (55) రాళ్లను కొట్టి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. రోజూ మాదిరిగానే గుట్ట వద్ద రాళ్లు కొడుతూ మట్టి తవ్వుతున్న క్రమంలో పెద్ద బండరాయి వచ్చి మీద పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్ తీరంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని డాకర్ తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో నుంచి 30 మృతదేహాలను నావికా దళం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ మృతదేహాలు కుళ్లిన స్థితిలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అసలు ఆ పడవ ఎక్కడ నుంచి వచ్చిందో అన్న దానిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.
TG: భార్య మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేటలో చోటుచేసుకుంది. మహేశ్ గౌడ్(36) అనే వ్యక్తి తాగడానికి డబ్బులు అడగగా.. భార్య లేవని చెప్పడంతో గొడవపడ్డాడు. అనంతరం ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒడిస్సా నుంచి హైదరాబాద్, ముంబై పట్టణాలకు తరలిస్తున్న 300 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు.. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ గంజాయి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో గంజాయిని తరలించడం వెనుక చాలమంది ప్రమేయం ఉందని.. మిగతా నిందితులను పట్టుకునే పని...