HYD: చేవెళ్ల మండలం ఆలూర్ స్టేజ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ వ్యక్తం చేశారు. లారీ అదుపుతప్పి దూసుకెళ్లడంతో కూరగాయలు అమ్మే వాళ్ళు చనిపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినా వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
TG: సంగారెడ్డి జిల్లా డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తాపడింది. ఈ సంఘటన కోహిర్ మండలం వెంకటాపూర్ కూడలి వద్ద చోటుచేసుకుంది. డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తాపడటంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ...
AP: సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా విజయనగరంలో విశ్రాంత అధ్యాపకురాలి వద్ద నుంచి రూ. 40 లక్షలు కాజేశారు. తన పేరుతో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సుజాతకుమారికి ఫోన్కాల్ చేసి ఆమె దగ్గరి నుంచి రూ. 40 లక్షలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. జమ్ముకశ్మీర్, పుణెకు చెందిన ఐదురుగు నిందితులు అరెస్ట్ చేశారు.
TG: హైదరాబాద్లోని మేడ్చల్లో దారుణం జరిగింది. నెమ్మదిగా మాట్లాడమన్నందుకు వ్యక్తిని హత్య చేశాడు. ఈ ఘటన నేరేడ్మెట్ వినాయకనగర్ చౌరస్తా చోటుచేసుకుంది. రాముల అనే వ్యక్తి పాన్ కొట్టుండగా మరో వ్యక్తి గట్టిగా అరుస్తుండటంతో నెమ్మదిగా మాట్లాడాలని సూచించాడు. దాంతో ఇద్దరి మధ్య మటామాట పెరిగి రాములను దుండగుడు రాయితో కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు నిందితుడి ...
ప్రకాశం: పొదిలి మండలం మల్లవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద రోడ్డును దాటుతున్న వృద్ధురాలను కారు సోమవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 సాయంతో సమీప వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
TG: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ దుర్మార్గుడు ఐదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోక్సో చట్టం కింద కేేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్...
మేడ్చల్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. నిందితుడు చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితుడిని ఎలాగైనా సరే పట్టుకుని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: నారాయణ కాలేజీలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని నారాయణ కాలేజీ బాత్రూంలో తనుష్ నాయక్ (16) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనుష్.. ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. లెక్చరర్ వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ATP: బ్రహ్మసముద్రం మండలం తిప్పయ్య దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల బేబీ(26) ఆదివారం సాయంత్రం తన ఇంటి ముందర ఉన్న జొన్న పొట్టును పొయ్యి వెస్తేందుకు వెళ్లింది. జొన్న పొట్టు తీస్తుండగా ఆమె ఎడమ కాలుకు పాము కాటు వేసింది. ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. దీనిపై బ్రహ్మసముద్రం ఎస్సై నరేంద్ర కుమార్ కేసు నమోదు చేసి వివరాలు తెలిపారు.
ATP: గార్లదిన్నె మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక నాగరాజు అనే వ్యక్తి సోమవారం తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
AP: శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన ఇచ్చాపురం మండలంలోని కొఠారి గ్రామంలో చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్కు ఎమ్మెల్యే అశోక్ వెళ్లి వస్తుండగా వృద్ధుడిని కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావటంతో వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. మృతుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
కోనసీమ: మండపేట మండలం కేశవరం రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని 80 ఏళ్ల వృద్ధ యాచకుడు సోమవారం మృతి చెందాడు. గ్రామంలో యాచకం చేస్తూ జీవనం సాగిస్తున్నాడనీ గ్రామస్తులు చెబుతున్నారు. ఎరుపు తెలుపు గీతల చొక్కా, పట్టు పంచె, పసుపురంగు టవల్ ధరించి ఉన్నాడు. అతనికి బంధువులు ఎవరూ లేకపోవడంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
TG: రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: దువ్వూరు మండలం కానగూడూరులో సోమవారం తండ్రి చేతిలో కొడుకు హత్య గురైన సంఘటన జరిగింది. వివరాలకు వెళితే పీరయ్య గారి హుస్సేన్ భాష(23 ) నిత్యం తాగి ఇంట్లో వారిని వేధిస్తుండగా తండ్రి మాబు షరీఫ్ రోకలి బండతో తలపై కొట్టాడు. హుస్సేన్ భాషను హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మద్యంలో మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న దువ్వూరు పోలీసులు హత్యపై కేసు నమోదు చేశారు.
TG: హైదరాబాద్లో పోలీసులు కార్ల దొంగలను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు జూపూడి ఉషతో సహా మల్లేష్, సాగర్ పాటిల్, అనిల్ను అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో కార్లను అద్దెకు తీసుకొని మహారాష్ట్ర, కర్ణాటకలో విక్రయిస్తున్నారని, రూ.2.5 కోట్ల విలువైన 21 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు.