KMM: కుటుంబ కలహాలతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ముదిగొండ మండలంలో చోటుచేసుకుంది. బాణాపురం గ్రామానికి చెందిన బాణాల శ్రీనివాస్ (24) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. కొండన్న పల్లి స్టేజి వద్ద కారును వెనక నుంచి బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు వెనుక భాగం ధ్వంసం కాగా, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ELR: దేవరపల్లి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. జాతీయ రహదారిపై కంటైనర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని స్థానికులు తెలిపారు. ఏలూరు వైపు నుంచి కొవ్వూరుకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
VZM: సోమవారం తెల్లవారుజామున నాతవలస టోల్ ప్లాజా వద్ద విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వెళ్లే హైవే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని బిచ్చగాడు మరణించినట్లు డెంకాడ ఎస్ఐ ఏ.సన్యాడినాయుడు సోమవారం తెలిపారు.మృతుడు హైవే రోడ్డు సర్వీసు రోడ్డులో నిద్రిస్తుండగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కేసును హిట్ అండ్ రన్ గా నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
జనగాం: పాలకుర్తి మండలం ధర్ధపెల్లి వాగులో సోమవారం తెల్లవారుజామున ఓ కారు పడిపోయిన ఘటనలో ఇరువురు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. పాలకుర్తి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
NLR: కావలి మండలం పెద్దవరం- ఆర్ సి పాలెం మార్గంలోని అడవిలో కోడిపందెం స్థావరంపై ఆదివారం రూరల్ సీఐ జి. రాజేశ్వరరావు, ఎస్సై బాజీ బాబు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందాలు ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. నిందితుల నుంచి రూ. 15, 400 నగదు, నాలుగు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
VZM: మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులు ముగ్గురు ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరి మృతదేహాలు సోమవారం ఉదయం బయటపడ్డాయి. వాటర్ ఫాల్స్ దిగువన ఇద్దరి యువతుల మృతదేహాలు దొరికాయి. వీరిలో బొబ్బిలికి చెందిన కె.సౌమ్య ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
MNCL: గోదావరిఖని శివారులోని గోదావరి నదిలో ఆదివారం గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గోదావరిఖని రెండో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం..మంచిర్యాలలోని చున్నంబట్టికి చెందిన వెంకటేశ్గా గుర్తించారు. కాగా జూలైలో ఇతను అత్తను హత్య చేసి, ఇటీవల జైలుకి వెళ్లాడు. బెయిల్పై విడుదలైన వెంకటేశ్ గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిలో శమమై కనిపించాడు.
WG: నరసాపురంలో గంజాయి రవాణా చేస్తూ ముగ్గురు దొరికారు. అరుంధతీపేటకు చెందిన సిర్రా పెద్దిక్, కప్పల సందీప్, బొల్లం మణిచంద్రమౌళిల గంజాయి తీసుకు వస్తూ పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని సీఐ యాదగిరి కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. 1.930 కిలోల గంజాయి పట్టుబడగా.. దీని విలువ రూ.39 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
AP: అల్లూరి జిల్లాలో జలపాతంలో గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని అమృత, సౌమ్యలుగా గుర్తించారు. గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నిన్న ఒక్కసారిగా వర్షం కురవడంతో జలపాతంలో నీరు ఉద్ధృతంగా ప్రవహించి ఐదుగురు కొట్టుకుపోయారు. స్థానికులు ఇద్దరిని కాపాడగా.. మిగిలిన ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే.
అమెరికాలో తుపాకీ సంస్కృతి నానాటికి పెరిగిపోతుంది. అక్కడ మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అలబామా రాష్ట్రం బిర్మింగ్హమ్లోని ఓ బార్లో జరిగిన కాల్పుల ఘటనలో ఓ మహిళ సహా నలుగురు చనిపోయారు. మరో 18 మంది గాయాలపాలయ్యారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
VZM: కొత్తవలస మండలం కాంటకాపల్లి వద్ద శారదమెటల్స్ పరిశ్రమయార్డ్ లోని బొగ్గులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.ఒడిశాలోని లారీలో దిగుమతి చేసుకున్న స్టీమ్డ్ కోల్ బొగ్గుయార్డ్ ఆన్లోడ్ చేశాక మృతదేహం గుర్తించినట్లు కంపెనీ హెచ్.అర్.హెచ్.సన్యాసిరావు పోలీసులకుసమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఆ మేరకు సీఐ షణ్ముఖరావు యార్డ్ను పరిశీలించారు. మృతుడు 35-40 మధ్య వయస్సు ఉంటుందని పేర్కొన్నారు.
NLR: జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో సోమవారం ఉదయం క్యాంపర్ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న క్యాంపర్ ముందు ఆగి ఉన్న లారీని ఢీకొంది. దీంతో క్యాంపర్లోని ఒకరు చనిపోయారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: పొదిలిలో మతిస్థిమితం లేని ఓ మహిళను ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహిళను వైద్య పరీక్షల కోసం ఒంగోలుకు తరలించారు. మహిళ అత్యాచారానికి గురైనట్లుగా వైద్యులు నిర్ధారించడంతో ఆదివారం పోలీసులు మతిస్థిమితం లేని మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టిన యువకుడిపై పోలీసుల కేసు నమోదు చేశారు.
ADB: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని టెంబి పంచాయతీ పరిధిలో గల చిన్నమీయ తాండ గ్రామంలో దంగర్ రాజు తన పంట చేలలో సాగు చేస్తున్న 60 గంజాయి మొక్కలను పట్టుకున్నామని ఎస్సై అప్పారావ్ తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దంగర్ రాజుపై కేసు నమోదు చేసుకుని, రిమాండ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.