AP: గుంటూరు కాజా టోల్ప్లాజా దగ్గర ఎర్రచందనంను పోలీసులు పట్టుకున్నారు. లారీలో చెన్నై నుంచి విశాఖకు తరలిస్తున్న రెండున్నర టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. లారీలో పేపర్ బండిల్స్ మధ్య ఎర్రచందనం దుంగలు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే డ్రైవర్, క్లీనర్ లారీ వదిలి పారిపోయారు.
న్యూయార్క్లో దారుణం జరిగింది. అమెరికా ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ యునైటెడ్ హెల్త్కేర్ సీఈవో బ్రియాన్ థాంప్సన్ హత్యకు గురయ్యారు. మిడ్టౌన్లోని హిల్టన్ హోటల్ బయట ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ముఖానికి మాస్కుతో వచ్చిన దుండగుడు బ్రియాన్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం చోటుచేసుకుంది. కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుడిని చంపేశారు. ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థులు తరగతి గదిలోనే ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. దీంతో ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఉపాధ్యాయుడిని ఆ విద్యార్థులు ఎందుకు చంపారనేది తెలియాల్సి ఉంది.
AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపల్లి హైస్కూల్లో ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందాడు. విద్యార్థులు అల్లరి చేస్తుండగా ఉపాధ్యాయుడు ఏజాస్ అహ్మద్ వారిపై కేకలు వేసాడు. ఆ సమయంలోనే ఆయన ఒక్కసారిగా తరగతి గదిలోనే కుప్పకూలాడు. వెంటనే రాయచోటి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
MDK: శివంపేట మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన తల్లి కూతుర్లు పూజ (23), నిషిత (2) అదృశ్యమైనట్టు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పడుకున్న పూజ, నిశిత తెల్లవారుజామున కనిపించలేదని వివరించారు. చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదని వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
కృష్ణా: విజయవాడ రాజీవ్ నగర్లో బుధవారం మధ్యాహ్నం మృతదేహం కలకలం రేపింది. నున్న పోలీసుల వివరాల మేరకు.. నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 50 వరకు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి మృతుడి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
NDL: నందికొట్కూరు పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన బుధవారం ఉర్దూ స్కూలు గేటు గోడ కూలీ మహిన్ అనే ఒకటవ తరగతి బాలిక మృతి చెందగా మరో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలు తగలగా చికిత్స నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం జరిగిన పాఠశాలను ఎమ్మెల్యే జై సూర్య పరిశీలించారు. మృతి చెందిన బాలికకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందిజేస్తామన్నారు.
PPM: పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బలగ శంకర్రావుకు చెందిన నాలుగు ఎకరాల వరిగడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.20,000 ఆస్తి నష్టం జరిగిందని శంకర్రావు తెలిపారు.
GNTR: పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పలపాడు చెరువులో గుర్తు తెలియని మృతదేహం బుధవారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని గుంటూరు నగరానికి చెందిన ఓ ట్రస్ట్ సభ్యుల సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. ఆ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
GNTR: పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పలపాడు చెరువులో గుర్తు తెలియని మృతదేహం బుధవారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని గుంటూరు నగరానికి చెందిన ఓ ట్రస్ట్ సభ్యుల సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. ఆ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రులోని నాగమల్లి చెట్టు వద్ద ఉన్న చెరువులో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. స్థానికులు అల్లవరం పోలీసులకు దీనిపై సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి శరీరంపై ప్యాంటు మాత్రమే ఉందని స్థానికులు తెలిపారు.
కృష్ణా: వీరులపాడులో బుధవారం ఉదయం ఓ ద్విచక్ర చక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. గ్రామానికి చెందిన పాలపర్తి వినీత్ అనే వాహన యాజమానుడు తన ఇంటి ముందు వాహనాలు నిలపగా గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేయటంతో వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతయింది. వీరులపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.
కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్యన్కావు గ్రామంలో అతివేగంగా వచ్చిన లారీ శబరిమల భక్తులతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ భక్తుడు మృతి చెందారు. చిన్నారులు, వృద్దులతో సహా 16 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప...
మేడ్చల్: తనను అధ్యాపకుడు వేధిస్తున్నారని ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డబిల్పూర్ గ్రామంలో ఉన్న బైబిల్ కళాశాలలో విద్యార్థిని చదువుతుండగా అదే కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేస్తున్న వినయకుమార్ మానసికంగా, శారీకంగా తనను వేధిస్తున్నాడని కళాశాల డైరెక్టర్ బోజిరెడ్డికి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్నమయ్య: రాజంపేట భువనగిరి పల్లి ఆర్చి సమీపంలో లారీ – ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న సంఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కొని మృతి చెందాడు. బుధవారం ఉదయం కర్ణాటక లారీని, హైదరాబాద్ వెళ్లే బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్కు కాలు విరిగింది. బస్సు క్లీనర్, మరో నలుగురు గాయపడ్డారు.