SKLM: రణస్థలం మండలంలోని చిన్న పిషిణి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 15 మందిని జె.ఆర్.పురం పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.33,480 నగదు, 15 సెల్ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. SI ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
SRCL: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై గణేశ్ తెలిపారు. చేపూరి కైలాసం(60) ఆదివారం ఉదయం 8 గంటలకు తన ఎక్సెల్ వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఇటుక ట్రాక్టర్ డ్రైవర్ ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన కైలాసం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
ELR: లింగంపాలెం మండలం కే. గోకవరం ఎక్సైజ్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 10 మద్యం బాటిళ్లను సీజ్ చేశామని సీఐ అశోక్ తెలిపారు. చింతలపూడి సర్కిల్ పరిధిలో నాటు సారా తయారీ, అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడితే శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపు నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు తణుకు ఎక్సైజ్ సీఐ సత్తి మణికంఠ రెడ్డి తెలిపారు. ఆదివారం గ్రామంలో దాడి చేసి తట్టవర్తి మల్లికార్జునరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఎనిమిది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎస్ఐ బి.లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
KMR: బిచ్కుంద మండలం గోపన్నపల్లి శివారులో కట్టెల ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనలో ఓ రైతు చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం శాంతాపూర్ నుండి నీలగిరి కట్టెలను హస్టుల్కు చెందిన ఈర్వంత్ అనే రైతు,తన చేనులో గుడిసె వేయడానికి ట్రాక్టర్ తీసుకొని వెళ్తుండగా గోపనపల్లి శివారులో కట్టెల ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ట్రాక్టర్లో ఉన్నరైతు ఈర్వంత్ కట్టెల కింద పడి మృతి చెందాడు.
NZB: ఆర్మూర్ పట్టణం సుభాష్ నగర్ వంతెన వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు కోడిగుడ్ల లోడ్తో వెళుతున్న టాటా ఏసీ వ్యాన్ ఢీ కొన్నాయి. ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఆర్మూర్ వద్ద ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. టాటా ఏసీ వ్యాన్ డ్రైవర్ ని ఆంబులెన్స్లో నిజామాబాద్ హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: బల్లికురవ మండలంలోని వేమవరం వాగు వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలంలోని కొప్పరం గ్రామానికి చెందిన మునీర్ భాష తన కుటుంబ సభ్యులతో కలిసి చిలకలూరిపేట నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వేమవరం గ్రామం వద్ద వీరిది చక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న SK. ఖాన్సా అనే మూడు నెలల పాప అక్కడికక్కడే మరణించింది.
SRPT: అనంతగిరి మండలం శాంతినగర్లోని ఎస్సీ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి తిరుమలేష్ బావిలో పడి మృతి చెందాడు. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు కావడంతో ట్యూటర్ వీరబాబు ఇద్దరు విద్యార్థులను తన పొలం వద్ద పని ఉందని తీసుకెళ్లాడు. ఈతకు దిగగా ఈత రాకపోవడంతో తిరుమలేష్ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోగితో వెళ్తున్న ఓ అంబులెన్స్ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి బిహార్లోని చంపారన్కు రోగిని తరలిస్తుండగా.. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఓ పాదచారుడిని ఢీకొట్టిన అంబులెన్సు ఆ తర్వాత స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. ఐదుగురికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. అనిష్ షా(18) అనే రోగిని తమ స్వగ్రామానికి త...
JN: పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పల మండలం బోడబండ తండాలో ఆదివారం గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. తండాకు భూక్య మల్లేష్ అతని భార్య భూక్య బుజ్జి లు కలిసి గుడుంబా కాస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశారు. దాడుల్లో 4 లీటర్ల గుడుంబా, 15 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎస్ఐ సృజన్ కుమార్ తెలిపారు.
బిహార్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బక్సర్ జిల్లా సారెంజాపూర్ గ్రామంలో మట్టి పెళ్లలు కూలి నలుగురు బాలికలు ప్రాణాలు విడిచారు. ఇంటి కోసం మట్టి తవ్వుతుండగా ఆరుగురు బాలికలపై పెళ్లలు పడ్డాయి. వెంటనే పెళ్లలను తవ్వి బాధితులను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు శివాని, సంజ్, నైన్తారా, సరితగా గుర్తించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్...
SKLM: కొత్తూరు మండలం కాశీపురంలో ఆదివారం కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. అరసవిల్లి నుంచి ముగ్గురు కారులో వస్తుండగా మెట్టూరు సమీపంలో వాహనం అదుపుతప్పి పొలంలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ELR: ఆర్ఆర్ పేట పరిధిలో నివాసం ఉంటున్న ప్రియాంక (25) అనే వివాహిత ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త వేధింపులు, అనుమానంతో ఉరి వేసుకుని మృతి చెందిందని, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MDK: శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన వ్యక్తి కుటుంబ కలహాలతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్ మోతిలాల్(38)కు ఇద్దరు భార్యలు ఉండడంతో కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. మనస్థాపానికి గురైన మోతిలాల్ పురుగుల మందు సేవించాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.
PLD: రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గాయపడిన ఘటన పిడుగురాళ్ల పట్టణ శివారులోని కొండమోడు వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే పిడుగురాళ్ల పురపాలక సంఘ పరిధిలోని లెనిన్ నగర్ కాలనీ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ ద్విచక్ర వాహనంపై వస్తున్న చిన్నాను లారీ ఢీకొంది. ఈ ఘటనలో చిన్నా తీవ్ర గాయాలపాలయ్యాడు.