HNK: పరకాల పట్టణంలో జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన వేముల సాత్విక (12) వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సాత్విక మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.