• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొని ముగ్గురు మృతి!

పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. పట్టాలు దాటుతుండగా ఎదురుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ...

January 23, 2023 / 01:33 PM IST

ఉత్తరప్రదేశ్ లో ఘోరం..రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. లక్నో- కాన్పూర్ హైవేపై వెళ్తున్న ఓ ట్రక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను ఢీకొంది. అంతేకాకుండా రోడ్డు పక్కనున్నవారిపై కూడా ట్రక్కు దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసుల...

January 23, 2023 / 07:45 AM IST

కన్న తండ్రిపై కత్తితో దాడిచేసిన కూతురు

విశాఖలో హత్యాయత్నం కలకలం రేపింది. తండ్రిపై కూతురు కత్తితో దాడి చేసింది. శంకరమఠం ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు తండ్రిపై కోపంతో కూతురు ఈ దాడి చేసింది. పోలీసులకు తండ్రి ముకుందరావు ఫిర్యాదు చేయడంతో బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు తన లవర్ కి ఇంట్లోని నగలు, నగదు రహస్యంగా ఇచ్చింది. అంతేకాదు అతడినికి ఇవ్వడానికి మరిన్ని డబ్బులు కూడా ఇవ్వమని తండ్రిని...

January 22, 2023 / 06:03 PM IST

అమెరికాలో కాల్పుల కలకలం..పది మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. కాలిఫోర్నియాలోని చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా వేడుక జరుగుతోంది. ఆ కార్యక్రమంలో కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంఘటనకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. చైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో జరుగుతుండగా ...

January 22, 2023 / 04:52 PM IST

తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం

తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం జరిగింది. ధర్మపురిలో జల్లికట్టును వీక్షించేందకు వచ్చిన ఓ బాలుడు మృతిచెందాడు. జల్లికట్టును ను చూసేందుకు గోకుల్ అనే 14 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఎద్దు గోకుల్ ను కడుపులో పొడిచింది. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ...

January 22, 2023 / 03:38 PM IST

అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి దూరిన ఉప తహసీల్దార్

ఉద్యోగం కోసం ఐఏఎస్ అధికారిణిని ప్రసన్నం చేసుకునేందుకు డిప్యూటీ తహసీల్దార్ సాహసానికి ఒడిగట్టారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో సంపన్నులు ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీలోకి దూసుకెళ్లాడు. అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి దూరిపోయాడు. భయపడిపోయిన అధికారిణి కేకలు వేయడంతో కలకలం రేగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం...

January 22, 2023 / 08:23 AM IST

న్యూడ్ వీడియో కోసం కట్టు కథ.. కన్న తండ్రితోనే కిడ్నాప్ డ్రామా

సోషల్ మీడియాను యువత దుర్వినియోగ పరుస్తోంది. అవసరాలకు వాడుకోకుండా అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తోంది. దీని పర్యావసనాలు దారుణంగా ఉంటున్నాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియాలో అమ్మాయితో చేసిన వీడియో కాలింగ్ ద్వారా సినిమా రేంజ్ లో కట్టు కథ అల్లాడు. చివరికి కన్న తండ్రినే మోసం చేశాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ ఘటనలో ...

January 21, 2023 / 07:53 PM IST

ఉమేశ్ యాదవ్‌కి కుచ్చుటోపి పెట్టిన స్నేహితుడు..  రూ. 44 లక్షలు తీసుకొని..

టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ను స్నేహితుడు నిండా ముంచేశాడు. ఆస్తి కొనుగోలు పేరుతో మోసం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొరాడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగ్‌పూర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన 35 ఏళ్ల ఉమేశ్ యాదవ్ 2014లో శైలేశ్ దత్త ఠాక్రే అనే స్నేహితుడిని మేనేజర్‌గా నియమించుకున్నాడు. తన ఆర్థిక వ్యవహారాలు చూసుకునేందుకు స్నేహితుడిని నియమించుకున్నాడు. అయితే, ఏడాది కాలంగా శైలేశ్ ఆ వ్యహారాలను...

January 21, 2023 / 06:04 PM IST

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ పై మరో నటి పరువునష్టం దావా

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. మనీలాండరింగ్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని నోరా ఫతేహి కోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన గౌరవప్రతిష్టలు భంగపరిచి, సినీ కెరీర్ ను దెబ్బ తీసిందని నోరా ఫతేహి ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా నోరా ఫతేహిని కించపరుస్తూ వార్తలు రాసిన 15 మీడియా సంస్థలపై కూడా కేసు వేసింది...

January 21, 2023 / 05:58 PM IST

యువకుడిని కారుతో ఢీ కొట్టి.. ఈడ్చుకెళ్లిన మహిళ!

  ఓ మహిళ కారుతో యువకుడిని ఢీకొట్టడంతో పాటు దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అంతకుముందు మెయిన్‌రోడ్‌పై బాధిత యువకుడి కారు.. నిందితురాలు ప్రియాంక వాహనం ఢీకొట్టుకున్నాయి. దీంతో కారు దిగి మహిళను నిలదీసేందుకు బాధితుడు ప్రయత్నించాడు. ఒక్కసారిగా అవేశానికి లోలైన ప్రియాంక.. అతడ్ని కారుతో ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి.. కారు బ్య...

January 21, 2023 / 04:16 PM IST

ఇఫ్లూలో విద్యార్థిని ఆత్మహత్య.. కారణం అదేనంటున్న విద్యార్థి సంఘాలు

ఇఫ్లూలో దారుణం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ నాల్గో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. తలకు బలమైన గాయం కావడంతో స్పాట్ లోనే చనిపోయింది. మృతురాలిని హర్యానాకు చెందిన అంజలిగా గుర్తించారు. ఆమె ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.విద్యార్థిని ఆత్మహత్యపై స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఆరోపణ...

January 21, 2023 / 04:09 PM IST

బట్టలు వేసి స్విచ్చాన్ చేయగా.. ఒక్కసారిగా పేలిన వాషింగ్ మెషీన్

విద్యుత్ ఉపకరణాలను జాగ్రత్తగా వినియోగించాలి. వాటిపట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన పెను ప్రమాదాలు సంభవిస్తాయి. వాషింగ్ మెషీన్ ఇద్దరి ప్రాణం మీదకు వచ్చింది. ప్రస్తుతం వారు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమవగా.. మంటలు వ్యాపించాయి. ఇంటి బయట పార్క్ చేసిన కారు కూడా పగిలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ క...

January 21, 2023 / 03:58 PM IST

ఘోరం: పిల్లలు పుట్టడం లేదని అస్థికలు తినిపించారు

మూఢనమ్మకాల చాటున మానవులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అతీత శక్తులు ఉన్నాయంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఘోర సంఘటన జరిగింది. పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళకు ఆమె భర్త, అతడి కుటుంబసభ్యులు అస్థికలు తినిపించారు. క్షుద్ర పూజలు నానా బీభత్సం సృష్టించారు. ఆ బాధలకు తాళలేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహారాష్ట్రలోని సింహగడ్ పోలీసుల వివరాల ప్రకారం.. పుణెలోని ధైరీ ప్రాంతంలో నివసిస్త...

January 20, 2023 / 07:38 PM IST

అక్రమ కట్టడాలపై ఉన్నత స్థాయి కమిటీ : మంత్రి తలసాని

హైదరాబాద్‌ లో అక్రమ కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు మంత్రి తలసాని.  ఈ నెల 25న కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. నగరంలోని నల్లగుట్టలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ యుద్ధ ప్రాతిపదికన స్పందించాయన్నారు. ప్రమాదం జరిగిన భవనంలో కెమికల్స్ ఉండటం వల్ల మంటలు తొందరగా అదుపులోకి రాలేదని ఆయన తెలిపారు. పక్కన ఉన్న బస్తీకి మంట...

January 20, 2023 / 05:52 PM IST

సికింద్రాబాద్ ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదు : శ్రీధర్‌

సికింద్రాబాద్ వద్ద షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదని విద్యుత్‌ శాఖ అధికారి శ్రీధర్‌ వెల్లడించారు. షార్ట్‌ సర్య్కూట్ జరిగుంటే విద్యుత్ సబ్ స్టేషన్‌లో ట్రిప్‌ అయ్యేదని, కానీ అలా జరగలేదని తెలిపారు. గురువారం ఉదయం 11.20 గంటలకు సమాచారం అందగానే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లుగా ...

January 20, 2023 / 04:25 PM IST