తమిళనాడు(tamilnadu) తిరుప్పత్తూరులోని వాణియంబాడిలో విషాదం చోటుచేసుకుంది. తైపూసం ఉత్సవాల్లో భాగంగా ఉచితంగా తెల్ల ధోతీలు, చీరల టోకెన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలు కాగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ తైపూసం ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ తమిళనాడులో ఇద...
ఆంధ్రప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమదాలవలస మండలం మందడిలో మహిళా కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఉపాధి హామీ కూలీలు పనులు చేసుకుంటుండగా లారీ దూసుకురావడంతో ఘటనా స్థలంలోనే నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరు...
సినీ ఇండస్ట్రీలో హీరోగా చెలామణి అవుతూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఒకరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేసిన నవీన్ రెడ్డి మోసాలకు పాల్పడ్డాడు. కంపెనీలోని సహ డైరెక్టర్లకు తెలీయకుండా కంపెనీ ఆస్తులను తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రూ.55 కోట్లు మోసం...
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ 1 గనిలో ఈరోజు పేలుడు ఘటన జరగడంతో ఓ కార్మికుడు మృతి చెందాడు. జైనాథ్ కుమార్ అనే ట్రైనీ వెల్డర్ రాత్రి షిప్ట్లో సీహెచ్పీ సర్పేస్ ఫీడర్ ఫైర్ ఎక్సనెంజర్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవాశాత్తు గ్యాస్ పేలింది. ప్రమాదంలో కొత్తగూడెం మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన జైనాథ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఏ...
నమ్మించి మోసం చేశాడని ఓ ఎమ్మెల్యేపై అతడి స్నేహితురాలు సంచలన ఆరోపణలు చేసింది. తన ఎన్నికల కోసం డబ్బును సేకరించేందుకు ఎమ్మెల్యే సెక్స్ రాకెట్ కూడా నిర్వహిస్తున్నాడని గతంలో ఆరోపించిన ఆమె ప్రస్తుతం అతడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె వాదనలు విన్న కోర్టు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: తెలంగ...
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు పెను ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో అతడి కాన్వాయ్ లోని కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఓ కారు అదుపు తప్పి అఖిలేశ్ కాన్వాయ్ లపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 7 వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా.. అఖిలేశ్ యాదవ్ సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటన యూపీలోని హర్దోయ్ జిల్లాలో జరిగింది. చదవండి: ‘గడపగడప’లో ఎమ్మెల్యే ద...
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నవీ ముంబైలోని టర్బే డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు చట్టుపక్కలకు భారీగా వ్యాపించడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంటలు వ్యాపిస్తుండటంతో డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళనకు గురియ్యారు #WATCH | Massive fire at ...
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డిని సీబీఐ ఇవాళ విచారించింది. అవినాష్ రెడ్డి ఫోన్కాల్ డేటా ఆధారంగా సుమారు ఆరున్నర గంట పాటు కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ఈ విచారణ జరిగింది. కాగా, నవీన్ ను రహస్యంగా విచారించినట్టు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ విజయవాడ వెళ్లిపోయారు. ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినా...
కర్మ ఫలం అంటే ఇదే కావచ్చు. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అన్నట్టుగా ఒక యువకుడు తన ఫ్రెండ్ను చంపి అతడి బాడీని లోయలో పడేయబోయి కాలు జారి తనే లోయలో పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అంబోలి ఘాట్లో చోటు చేసుకుంది. సతారా జిల్లా కరాడ్కు చెందిన బౌసో మనే అనే వ్యక్తి ఆర్థిక వ్యవహారాల్లో గొడవలు రావడంతో తన ఫ్రెండ్ సుశాంత్ ఖిల్లరే అనే వ్యక్తిని హత్య చేశాడు. ఆ […]
కడప పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టణం నడిబొడ్డున అర్ధరాత్రి ఇద్దరు యువకులపై కత్తులతో కొందరు యువకులు దాడులకు పాల్పడ్డారు. కాపు కాచి మరీ ఇద్దరు స్నేహితులను హతమార్చారు. తీవ్ర గాయాలతో ఓ యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొక యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ సంఘటన కడపలో కలకలం రేపింది. డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: కలకలం.. టీడీపీ మండల అధ్యక్షుడిపై క...
ఆంధ్రప్రదేశ్ లో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. పల్నాడు జిల్లా రొంపిచర్లలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాల కోటిరెడ్డిపై కాల్పులు జరిగాయి. రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డికి తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనప్రాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈ కాల్పులకు పాల్పడింది ఎవరో తెలియడం లేదు. రాజకీయ కక్షతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టా...
కామం మైకంలో అభం శుభం తెలియని బాలికపై కామాంధుడు ఎగబడ్డాడు. అతడి పైశాచిక ప్రవర్తనకు భయాందోళనకు గురైన బాలిక బాత్రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అయినా వదల్లేదు. తలుపులు పగులగొట్టి బాలికను పట్టుకున్నాడు. కేకలు వేస్తుండడంతో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాలిక నోట్లో యాసిడ్ పోసి అతి క్రూరంగా ప్రవర్తించాడు. యాసిడ్ బాధకు విలవిలలాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక కన్నుమూసి...
ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో విషాద ఘటన జరిగింది. ఓ రైల్వే ఉద్యోగి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరు చూస్తుండగానే పట్టాలపైకి దూకేశాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పేరు రాకేష్ గౌడ్. పశ్చిమ రైల్వేలో చీఫ్ లోకో ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ఆయన ప్లాట్ ఫామ్ పై నిల్చుని ఉన్నారు. కాసేపు అటు ఇటు […]
విమాన ప్రయాణంలో ప్రయాణికులు రచ్చరచ్చ చేస్తున్నారు. ముష్టిఘాతాలు, బాహాబాహీకి దిగి బీభత్సం సృష్టిస్తున్నారు. దేశీయంగానే కాక అంతర్జాతీయ విమానాల్లోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విమానంలో ఓ మహిళ నానా రభస చేసింది. సిబ్బందిపై దాడి చేయడమే కాక విమానంలో అర్ధ నగ్నంగా తిరుగుతూ వికృత చేష్టలకు పాల్పడింది. తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు...
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం గురించి డీఈవోను కలెక్టర్ ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. తమ పిల్లలకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న...