కొండచరియలు విరిగి పడటంతో 19 మంది మృతిచెందిన ఘటన చైనాలో ఆదివారం చోటుచేసుకుంది. విరిగిపడ్డ కొండ చరియల ప్రాంతంలో 40 వేల మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒడిశాలో రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident) సిగ్నలింగ్ లోపం వల్లే జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. గూడ్స్ ట్రైన్లో ఇనుము ముడి పదార్థాలు ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువైందని, అందుకే చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
కేంద్రం అందించే సాయానికి అదనంగా రాష్ట్రం నుంచి కూడా పరిహారం(Compensation) అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident)లో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.
వేసవిలో చిన్నపిల్లలే టార్గెట్గా కుక్కల దాడులు జరుగుతున్నాయి. తాజాగా వీధి కుక్క ఓ బాలుడిపై దాడి(Dog Attack) చేసింది. ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స జరుగుతోంది.
రూ.500 కోసం కన్నతండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. కోపంతో ఊగిపోయిన నితీష్ ఆవేశంగా ఇంటికి వచ్చి తన డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. సుబ్రమణ్యం డబ్బులు ఇవ్వనని చెప్పాడు. కొడుకును మందలించాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆ సమయంలోనే హత్య చేశాడు.
పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ రోజే ఓ జంట విచిత్రమైన స్థితిలో చనిపోయారని వెలుగులోకి వచ్చింది. వారు ఊపిరాడక మరిణించారని పలువురు చెబుతుండగా..మరికొంత మంది హార్ట్ ఎటాక్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషాద ఘటన యూపీ(uttar pradesh)లో చోటుచేసుకుంది.
ఆదివారం తెల్లవారుజామున ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. ఆ క్రమంలో ఏపీలోని కాకినాడ జిల్లా ఎ.కొత్తపల్లి సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీకొట్టి పక్కనే ఉన్న వినాయక గుడిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మ్యత్యువాత చెందారు. మరణించిన వారిలో లారీలో ఉన్న డ్రైవర్ చుక్కల శేఖర్(28), క్లీనర్ నాగేంద్ర(23), గుడిలో నిద్రపోతున్న సోము లక్ష్మణ రావు(48) ఉన్నారు.
ఒడిశా ప్రమాద మృతులకు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని.. రక్తదానం చేయాలని అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు.
హీరోయిన్ అయ్యే లక్షణాలు మీ కూతురిలో ఉన్నాయని చెప్పాడు. అయితే శరీరంలో కొన్ని మార్పులు జరగాలని.. బొద్దుగా తయారుకావాలని చెప్పాడు. దీంతో ఆ తల్లిలో అనూహ్య మార్పులు వచ్చాయి. అతడి మాటలు నమ్మి శరీరంలో అవయవాల ఎదుగుదల కోసం ప్రమాదకరమైన ఇంజెక్షన్లు కుమార్తెకు ఇవ్వడం ప్రారంభించింది.
డాక్టర్ వెబ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు అనేక యాప్లలోకి ప్రవేశించిన కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్ను కనుగొన్నారు. ఇది గతంలో Google Play స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ కృత్రిమ మాల్వేర్ ఏకంగా 400 మిలియన్ సార్లు డౌన్లోడ్ చేయబడిందని గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ డాక్టర్ వెబ్ ప్రకారం 'SpinOk' అనే స్పైవేర్ ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ కింద ఉన్న యాప్స్ ఫోన్ల...
Anantapur: అనంతపురంలో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. ఆడపిల్ల పెళ్లికి ఖర్చు చేయాల్సిన సొత్తును ఓ దొంగ మండపం నుంచే ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన అనంతపురం నగర శివారులోని నీలం రాజశేఖరరెడ్డి కల్యాణ మండపంలో గురువారం చోటుచేసుకుంది. నాల్గవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తెగిపడిన చేతులు, కాళ్ళు, రక్తంతో తడిసిన శరీరాలు, వేర్వేరు ప్రదేశాల్లో చెల్లాచెదురుగా ఉన్న వ్యక్తుల శరీరాలు... ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న చిత్రాలు ఏదో చెబుతున్నాయి.
శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్లో పట్టాలు తప్పిన మరో రైలు కోచ్లను ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో కనీసం 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఇంకా బోగీల్లో చిక్కుకున్న క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది వెలికి తీస్తున్నారు.
ఒడిశా రైలు దుర్ఘటన తర్వాత 18 రైళ్లు రద్దు చేయబడ్డాయి. వాటిలో ఏడు దారి మళ్లించబడ్డాయి. ఒక రైలు పాక్షికంగా రద్దు చేయబడింది. దీంతోపాటు రైల్వే హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు.