పెళ్లి దండపాణికి ససేమిరా ఇష్టం లేదు. దీంతో కొడుకు, కోడలిపై కోపం పెంచుకున్నాడు. వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొడుకు, కోడలిని కత్తితో నరికాడు. కొడుకు సుభాష్ తీవ్రగాయాలతో అక్కడే ప్రాణాలు పొగొట్టుకున్నాడు. కోడలిపై కత్తితో దాడి చేస్తుండగా.. ఇంట్లోనే ఉన్న నిందితుడి అత్త కన్నమ్మల్ అతడిని ఆపాలని ప్రయత్నించింది. అతను ఆమెను కూడా కత్తితో నరికి హత్య చేశాడు.
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలోని మోతిహారిలో శనివారం కల్తీ మద్యం తాగి 20 మంది మరణించారు.ఈ ఘటనలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.
. ప్రధాని సభలో ఈ సంఘటన చోటుచేసుకోవడం భద్రతా సిబ్బందికి సవాల్ గా మారింది. ప్రముఖులే లక్ష్యంగా ఇటీవల దాడులు జరుగుతున్నాయి. జీ-7 దేశాల మంత్రుల సమావేశాలు జరగనున్న వేళ ఈ సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
జూబ్లీహిల్స్(Jubilee Hills) లోని ఓ పబ్ లో మ్యూజిషియన్(Musician arrested) గా పని చేసే ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో అరెస్టయ్యాడు. ఆమె ఫిర్యాదు మేరకు అతన్నిపోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఎండాకాలం నేపథ్యంలో నీటి కుంటలోకి ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారుల్లో ముగ్గురు ఆకస్మాత్తుగా మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని గోదావరిఖని జిల్లాలో చోటుచేసుకుంది.
విచారణ పూర్తయి ఉదయ్ పాత్ర ఉందని గుర్తించిన పోలీసులు తండ్రి కొడుకులను అరెస్ట్చేసినట్లు సమాచారం. ఉదయ్ ను పులివెందుల నుంచి కడప జైలు అతిథిగృహానికి తీసుకెళ్లి విచారణ.
ఉత్తర ప్రదేశ్ షాజహాన్ పూర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దొంగతనం చేశాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి, రాడ్డుతో కొట్టగా.. ఆ దెబ్బలు తాళలేక చనిపోయాడు.
బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేయడం రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా గొంతును నరేంద్ర మోదీ తొక్కేస్తున్నారని కాంగ్రెస్ తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలు సబబు కాదని హితవు పలికాయి.
చీమలపాడు ప్రమాదంలో గాయపడిన వారినిహైద్రాబాద్(Hyderabad) నిమ్స్ హాస్పిటల్లో(Nims) రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురువారం పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అతడి ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో కొన్నాళ్లకు ఈ కేసు సీఐడీ విభాగానికి బదిలీ అయ్యింది. పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ క్షీర్ సాగర్ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. అతడిపై పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపుతానని బెదిరించి, భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన జయేష్ పుజారాను నాగ్పూర్ పోలీసులు విచారిస్తున్నారు. అతనిపై యూఏపీఏ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు.