HYD: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెక్రటేరియట్లో జరిగిన సమీక్షలోని నిర్ణయాలపై కంటోన్మెంట్ MLA శ్రీగణేశ్ అధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
KNR: మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే ఆడపిల్లల వివాహానికి రూ. 10,116 ఇస్తానని హుజరాబాద్ 21వ వార్డు కౌన్సిలర్ పంజాల రాజ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఎన్నికలో ఆయన గెలవడంతో ఇచ్చిన హామీ మేరకు వార్డుకి చెందిన పోగు తేజస్వినికి వివాహం నిశ్చయం కాగా ఇవాళ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలందరూ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్ను అభినందించారు .
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం, ఏన్కూర్ మండలం హిమామ్ నగర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
NRML: ఆర్టీసీ సమస్యల పరిష్కారం, ప్రభుత్వంలో విలీనం తదితర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 24న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.ఆర్.రెడ్డి శుక్రవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. వేతన సవరణ అమలు, బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ వంటి ప్రధాన డిమాండ్లపై అన్ని డిపోల ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ విషయంలో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాకా పేరు ప్రతిష్టను అభాసుపాలు చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, మనవడు ఎంపీ వంశీకృష్ణ దౌర్జన్యాలు అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పలు ప్రారంభోత్సవాలు, భూమి పూజలను నిర్మల్ డసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఉట్నూర్లోని కన్నాపూర్, గంగాపూర్, పాత ఉట్నూర్లలో రూ.10 లక్షలతో వివో బిల్డింగ్స్కు భూమి పూజ చేశామన్నారు. అలాగే రూ. 20 లక్షలతో జీపీ భవనాలు ప్రారంభం అయ్యాయన్నారు.
ASF: నమ్మి కౌన్సిలర్ టికెట్ ఇస్తే పార్టీని మోసం చేసిన ఘనత మాజీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్దని స్థానిక నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఆసిఫాబాద్లో మాట్లాడుతూ.. జిల్లాలో యూత్ కాంగ్రెస్లో ఇచ్చిన ఏకైక టికెట్ శ్యామ్ వాళ్ళ భార్యకే అన్నారు. వారిని గెలిపించేందుకు తాము తీవ్రంగా కష్టపడినట్లు తెలిపారు. మరోసారి పార్టీ పైన తప్పుడు ఆరోపణ చేస్తే సహించేది లేదన్నారు.
NLG: యువత స్వయంకృషితో ఎదగాలని చిట్యాల ఎస్సై రవి కుమార్ అన్నారు. చిట్యాల మండలం, పెద్దకాపర్తిలో ఏర్పాటు చేసిన బెల్లం చాయ్ షాప్ను శుక్రవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ఆర్థికంగా ఎదగడం కోసం వ్యాపారాలను ఎంచుకోవాలని సూచించారు. నిర్వాహకులను ఎస్సై అభినందించారు.
WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ఆకేరు వాగుపై చెక్ డాం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తూ ముందుకు వెళుతుందని, నియోజకవర్గంలోని పంటల సాగుకు నీటిని అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
MDK: చేగుంట ఏఎంసీ పాలకవర్గ తొలి సమావేశం ఛైర్మన్ తాడేం వెంగల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. రైతులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. సెక్రటరీ ఉష, సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, కమిటీ డైరెక్టర్లు కుర్మ లక్ష్మి, మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు, ఆంజనేయులు, కాషబోయిన శ్రీనివాస్, బాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 22 నుంచి మార్చి 9 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని CP రష్మీ పెరుమాళ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు నిర్వహించకూడదన్నారు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా సీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. బంద్ల పేరిట కారణాలు చెబుతూ సంస్థలు, కార్యాలయాలు మూసివేయాలని చూస్తే చర్యలు తప్పవన్నారు.
GDWL: ఎనిమిది నెలల బేసిక్ శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగిలం ‘ఆర్య’ను జిల్లాకు కేటాయించారు. ఐఐటీఏ మొయినాబాద్లో శిక్షణ పొందిన ‘ఆర్య’ పేలుడు పదార్థాలను గుర్తించడంలో నైపుణ్యం సాధించిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం డాగ్ హ్యాండ్లర్ భీమేష్, డాగ్ స్క్వాడ్ ఎస్పీకి ఆర్యను పరిచయం చేశారు.
MBNR: జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం 2,082 క్వింటాళ్ల వేరుశనగ చేరింది. ఈ సందర్భంగా గరిష్ట ధర క్వింటాకు రూ.10,269గా నమోదైంది. కనిష్ట ధర రూ.4,500 కాగా, సాధారణ ధర రూ.9,169గా ఉంది. గతంలో క్వింటాకు రూ.12,000కు పైగా ధర పలికిన సందర్భాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
SRD: మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డికి కాంగ్రెస్లో అవమానం జరగకుండా ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం కోరారు. పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఆఫర్లు వచ్చిన బయటకు వెళ్లలేదని గుర్తు చేశారు.
MBNR: చిన్నచింతకుంట మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మన్న కుమారుడికి మంజూరైన రూ.లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (GMR) అందజేశారు. శుక్రవారం గ్రామ సర్పంచ్, నాయకుల సమక్షంలో ఈ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.