KNR: శంకరపట్నం మండలంలో 8402 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ తెలిపారు. 4135 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, రైతులు తమ వ్యవసాయ క్లస్టర్లలో ఏఈవోలతో ఈనెల 28లోగా చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు కేంద్ర ప్రభుత్వ పథకాల అర్హత కోల్పోతారని స్పష్టం చేశారు.
SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ధర్మగుండం పునర్నిర్మాణ పనులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ పరిశీలించారు. దాతల సహకారంతో జరుగుతున్న ఈ పనులను బ్రహ్మోత్సవాల (జాతర)లోపు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆలయ కమిటీకి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
JN: జిల్లాలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2.73 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి SMAM పథకం కింద ఈ నిధులు మంజూరైనట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. రైతులకు కావలసిన యంత్ర పరికరాలు 50% రాయితో అందిస్తామని,రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని డీడీ రూపంలో సంబంధిత కంపెనీలకు చెల్లించాలని సూచించారు.
NLG: చిట్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్గా పందిరి గీత రమేష్, వైస్ ఛైర్ పర్సన్గా గుండెబోయిన శ్రీ లక్ష్మి సైదులు, కౌన్సిలర్లు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ దండు శ్రీనివాస్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే వేముల, రాష్ట్ర డైరీ ఛైర్మన్ గుత్తా అమిత్ నూతన పాలకవర్గాన్ని సన్మానించి, అభినందించారు.
HYD మ్యాప్ అధికారికంగా మారిపోయింది. ORR దాటి RRR వరకు అథారిటీ పరిధి విస్తరించింది. 104 మండలాల్లోని 1,355 గ్రామాలు ఇప్పుడు ఈ పరిధిలోకి వచ్చాయి. RRRకి ఇరువైపులా 2 కి.మీ మేర ‘డెవలప్మెంట్ బఫర్’ జోన్ అమల్లోకి వచ్చింది. ఇకపై ఇక్కడ గ్రామ పంచాయతీ లేఅవుట్లకు అనుమతి ఉండదు. మొత్తం 10,472 చ.కి.మీ పరిధిలో కఠినమైన HMDA నిబంధనలు అమలు కాబోతున్నాయి.
GWDL: నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు ధరూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయానికి గురి చేసిందన్నారు. అలాగే జిల్లాలో రైతుల సమస్య పరిష్కారానికై ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సమావేశంను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి మహిళలు, రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
MHBD: గూడూరు మండలం గండసోములుతండాలో ఆదివారం కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానికుడు బోడ ధన్యకు చెందిన పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమై బూడిదైపోయింది. ఈ ఘటనలో సుమారు రూ. 2 లక్షల విలువైన ఆస్తి నష్టపోయింది. ప్రభుత్వం బాధితుల ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
NZB: బస్సాపూర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఆజీఎస్ కింద మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులతో ఈ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఉపసర్పంచ్ వంశీ పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి నిధులు వెచ్చించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
RR: మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమీర్పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పర్యటనలో సర్పంచ్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 23న ఉదయం 10:30 గంటలకు జిల్లా స్థాయి భౌతిక, రసాయన శాస్త్ర టాలెంట్ టెస్ట్ జరగనుంది. ఈ విషయని మెదక్ డివిజన్ అధ్యక్షుడు ఎల్.మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు.
NGKL: తాడూర్ మండల కేంద్రంలోని మూడో వార్డులోని బొడ్రాయి వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు సర్పంచ్ సంద మల్లయ్య ఇవాళ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. భూగర్భ డ్రైనేజ్ వల్ల వార్డులో పారిశుద్ధ్య సమస్యలు తీరి, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలో గల సాయిబాబా ఆలయం వద్ద నిర్మించిన శ్రీ సంత్ గాడ్గే బాబా మహరాజ్ మూర్తి ఆవిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ డోంగర్ గావ్ గ్రామ సర్పంచ్ ఇమ్రాన్ లాల ఆదివారం హాజరయ్యారు. ఇమ్రాన్ లాలను సమాజ సభ్యులు సాంప్రదాయ పద్దతిలో సన్మానించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.
SDPT: అక్కన్నపేట మండలం జనగామ గ్రామానికి చెందిన మోటే అజయ్ గత 15 రోజుల క్రితం ఆగి ఉన్న ట్రాక్టర్ని ఢీకొట్టడంతో ప్రాణాలను కోల్పోయాడు. తనతో కలిసి పదవ తరగతి చదువుకున్న జడ్.పి.హెచ్.ఎస్ అంతక పేట 2009 బ్యాచికి చెందిన తన తోటి స్నేహితులు అందరూ కలిసి దాదాపుగా లక్ష 40 వేల రూపాయలని తన కూతురి పేరుపై ఎల్ఐసిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
SRD: ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. జిల్లాలోని సంఘ భవనంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మెరుగైన పీఆర్సీని ప్రకటించాలని కోరారు. ప్రతి తరగతికి ఓ ఉపాధ్యాయున్ని నియమించాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
MNCL: వచ్చే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.