MHBD: పెద్దవంగర మండలం పడమటి తండాకు చెందిన ధరావత్ సోమన్న తన కుమారుడు విజయ్ మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గురువారం క్షణికావేశంలో తండ్రి గొంతుపై కుమారుడు కత్తితో దాడి చేశారు. గాయపడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపారు.
RR: తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలలో నిన్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు చదువు బోధించారు. పలువురు విద్యార్థులు ఒక్కరోజు హెడ్ మాస్టర్, కలెక్టర్ వంటి హోదాల్లో కనిపించారు. ఈ సందర్భంగా ఫోటోలు దిగి తీపి జ్ఞాపకాలను మిగిల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
VKB: ధారూర మండల పరిధిలోని నాగసమందర్లో మరింత కట్టుదిట్టం చేస్తూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం ధారూర్ ఎస్సై సున్నం రాఘవేందర్ ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సర్పంచ్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ఎంతో దోహదపడతాయని తెలిపారు.
MNCL: యూరియా బుకింగ్ యాప్లో రైతులు ఫోన్ నెంబర్ను లింక్ చేయించుకోవాలని జన్నారం మండలం కవ్వాల్ క్లస్టర్ అక్రమ్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు యూరియా బస్తాల కోసం ఇంకా యాప్లో ఫోన్ నెంబర్ను లింక్ చేయించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో వారికి యూరియా బస్తాలు అందే అవకాశాలు లేదని హెచ్చరించారు. దేవునిగూడెం రైతు వేదికకు రైతులు రావాలని సూచించారు.
NLG: రూ. కోట్లు పెట్టి నిర్మించిన చిట్యాల పురపాలక వైకుంఠధామంలో సౌకర్యాల లేమి అద్దం పడుతోంది. గురువారం రాత్రి మునుగోటి వెంకన్న అనే వ్యక్తి అంత్యక్రియల సమయంలో కనీసం విద్యుత్ దీపాలు లేకపోవడంతో, సెల్ఫోన్ టార్చ్ లైట్ల సాయంతో కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. విద్యుత్ స్తంభాలు ఉన్నా దీపాలు అమర్చకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KNR:గంగాధర మండలంలో మాజీ సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని కోరుతూ గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో డి.రాముకు పలువురు మాజీ సర్పంచ్లు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు మాజీ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ శివారులో ఉన్న పెద్ద చెరువు వద్ద పక్షులు కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఆ చెరువు వద్దకు పలు రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ఓరియంటల్ వైట్ ఇబ్బిస్, కామన్ కూట్ వంటి పక్షులు అక్కడకు చేరుకుంటున్నాయి. చెరువు ప్రాంతంలో ఆహారం, నీరు అందుబాటులో ఉండడంతో పక్షులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ శివారులో ఉన్న పెద్ద చెరువు వద్ద పక్షులు కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఆ చెరువు వద్దకు పలు రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ఓరియంటల్ వైట్ ఇబ్బిస్, కామన్ కూట్ వంటి పక్షులు అక్కడకు చేరుకుంటున్నాయి. చెరువు ప్రాంతంలో ఆహారం, నీరు అందుబాటులో ఉండడంతో పక్షులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
HYD: జలమండలి ప్రజలతో మమేకమయ్యేందుకు ‘బస్తీ బాట’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం శుక్రవారం నుంచి వారానికి నాలుగు రోజులు అమలులో ఉంటుంది. ఈ సందర్భంగా, ఎండీ నుంచి వార్డు మేనేజర్ల వరకు అధికారులు బస్తీలు, కాలనీల్లో ప్రత్యక్షంగా పర్యటించి నీరు, సీవరేజ్ సమస్యలను గుర్తించి, తక్షణ పరిష్కార చర్యలు చేపడతారు.
SRCL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని 14, 19వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
MBNR: సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ చెస్ ఉమెన్స్ టీం బయలుదేరింది. యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ క్రీడాకారులను అభినందించి ట్రాక్ షూట్ మరియు టీం యూనిఫామ్లను అందించి క్రీడల్లో మంచి ప్రదర్శన కనబరచాలని కోరారు. రిజిస్టర్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్ర పాల్గొన్నారు.
BDK: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ను ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకటరావు, గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు శుక్రవారం పాల్వంచలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందుతున్నట్లు పేర్కొన్నారు.
NGKL: అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవి ప్రాంతంలోని రాయల గండిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని క్రీ.శ 1536లో చింతగుండ రంగారావు నిర్మించారు. ఈ ప్రాంతానికి రంగా రయుని గండి అని పేరు పెట్టగా కాలక్రమేన అది “రాయలగండి” గా ప్రసిద్ధి చెందింది. ఈ చెన్నకేశవ స్వామి ఆలయంలో మాల దాసరి వర్గానికి చెందిన వారు పూజలు నిర్వహించడం విశేషం.
SRPT: మేళ్లచెరువు మండలంలో జాతర సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా ముగిసింది. ఫైనల్ పోరులో విజయనగరం, వైజాగ్ జట్లు తలపడగా, విజయనగరం జట్టు విజేతగా నిలిచి లక్ష రూపాయల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. విజేతకు ట్రోఫీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.