RR: కేశంపేట మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామ సమీపంలో ఉన్న పెద్ద చెరువును సర్పంచ్ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. MLA వీర్లపల్లి శంకర్కు రైతులు చెరువుసమస్యలను విన్నవించడంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. MLA ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖఅధికారులు చెరువును ప్రత్యక్షంగా పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన నివేదికలు సేకరించారు.
JGL: రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై యంత్రాంగం దృష్టి సారించింది. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో ఉన్న పుష్కర ఘాట్లను డీపీవో రేవంత్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో గణేష్, ఎస్సై నవీన్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్పంచ్ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి మనోజ్, ఆర్పీలు పాల్గొన్నారు.
SRD: జిల్లా మహిళాల, శిశు, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేయనున్నారు. కలెక్టర్ కార్యాలయానికి ఇటీవల 50 స్కూటీలను తీసుకువచ్చారు. ఇప్పటికే స్కూటీల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులను గుర్తించారు. త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేస్తామని జిల్లా సంక్షేమ అధికారిని లలిత కుమారి తెలిపారు.
SRD: సంగారెడ్డి పట్టణ ప్రజలు తమ ఇళ్ల వద్ద తడి, పొడి, హానికర చెత్తను వేరువేరుగా వేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఇలా చెత్తను వేరు చేయడం వల్ల ప్రాసెసింగ్ సులభమవుతుందన్నారు. ప్రజలు మార్కెట్కు వెళ్లే సమయంలో ప్లాస్టిక్ కవర్లను విడిచి, పర్యావరణ హితమైన సంచులను వాడాలని సూచించారు.
SDPT: పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు స్థానిక కంటెంట్ క్రియేటర్లు రూపొందించిన వీడియోలకు మంచి స్పందన లభించింది. సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియమాలపై చిన్న వీడియోలు @Siddipet_Police_Commis sionerateను ట్యాగ్ చేయాలని రష్మీ పెరుమాళ తెలిపారు.
NLG: మాతృభాష పరిరక్షణ మనందరి బాధ్యత అని గ్రంథాలయ ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ పిలుపునిచ్చారు. కేతేపల్లి మండలం, భీమవరం జి.ప.ఉ.పాఠశాలలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషా ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పాలన్నారు. అభివృద్ధికి మాతృభాషనే పునాది అని, ఇందులో పట్టుంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని పేర్కొన్నారు.
ADB: తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎస్పీకి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.
KMM: హైదరాబాద్కు విచ్చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేంద్రం నుండి ఒక్క ఇల్లు కూడా సాధించలేకపోయిందని, కానీ, ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఇప్పటికే 11.57 లక్షల మంది అర్హులను గుర్తించిందని ఆయన పేర్కొన్నారు.
SRCL: బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను శనివారం షీ టీమ్ బృందం సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా బాలికలు, మహిళలు వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 8712656425కు ఫిర్యాదు చేయాలన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని సూచించారు.
WNP: వనపర్తి పట్టణంలో శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రెడ్ బుక్స్ డే ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయంలో జిల్లా నాయకుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్మికుల హక్కులు మొదలగు వాటి గురించి రెడ్ బుక్స్ ద్వారా తెలిసిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
MBNR: జడ్చర్లలోని డా.బీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్లం, హిందీ, తెలుగు, సంస్కృతం, ఉర్దూ విభాగాలన్ని కలిసి ఘనంగా మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీ. సుకన్య పాల్గొని మాట్లాడారు. మనిషి వికాసం మాతృభాషతో జరుగుతుందన్నారు. భాష అమ్మలాంటిదని, అమ్మను ప్రేమించినట్లు భాషను ప్రేమించి, గౌరవించాలన్నారు.
NGKL: ఊర్కొండ మండలం బొమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన గోవిందు విజయ్ యాదవ్ కుమారుడు గోవిందు తులసీధర్ రాష్ట్రస్థాయి దివ్యంగా క్రీడల్లో చక్కని ప్రతిభ కనబరిచి తన సత్తాను చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్, జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు అతడికి అభినందనలు తెలిపారు.
GDWL: అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంను ‘బలగం’ చిత్ర దర్శకుడు, సినీ నటుడు వేణు యెల్దండి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారిని, స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది సురేశ్ పాల్గొన్నారు.
KNR: ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఆదేశాలకు అనుగుణంగా పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తనకు మహేష్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. లింగ, ధనిక, పేద, మత ఏ ఇతర వాటితో సంబంధం లేకుండా అందరికీ సామాజిక న్యాయం అందించేలా చట్టాలు రూపొందించబడ్డాయని అన్నారు.