• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తెలుగు అధ్యయన శాఖ బోర్డర్ స్టడీస్ ఛైర్మన్‌గా ఆచార్య కనకయ్య

NZB: TUలోని తెలుగు అధ్యయన శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా ఆచార్య కనకయ్య నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం టీయూ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన గతంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆడిట్ సెల్ డైరెక్టర్, అడ్మిషన్స్ డైరెక్టర్, ప్రిన్సిపల్, డీన్, విభాగాధిపతిగా వ్యవహరించారు. ఆయన నియామకం పట్ల పలువురు అధ్యాపకులు అభినందించారు.

February 24, 2026 / 05:00 PM IST

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

WNP: వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా పర్యాటక అధికారి నరసింహ మంగళవారం పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి సహకారంతో మంజూరైన ఈ చెక్కులను బాలేశ్వరయ్య (రూ. 12 వేలు), స్వామి (రూ.21 వేలు), షామా (రూ.9 వేలు)లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 05:00 PM IST

మిత్రుడి కుటుంబానికి పూర్వ విద్యార్థుల భరోసా

SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన రాంబాబు మృతి చెందడంతో ఆయన వృద్ధ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు, భార్య దిక్కులేని వారయ్యారు. ఈ విషాద సమయంలో తామున్నామంటూ భరోసా ఇస్తూ మిత్రులందరూ కలిసి ఇవ్వాళ రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. ​ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

February 24, 2026 / 05:00 PM IST

బాన్సువాడలో భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

KMR: బాన్సువాడ పట్టణంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం పరిశీలించారు. ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలను పరిశీలించి భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఎలాంటి చిన్న ఘటన కూడా చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలు కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.

February 24, 2026 / 05:00 PM IST

‘ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువులకు అత్యుత్తమ చికిత్స’

PDPL: ప్రైవేటు ఆసుపత్రిలో నెలలు నిండక ముందు జన్మించిన నవజాత కవల పిల్లలకు PDPL ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో అత్యుత్తమ చికిత్స అందించి బాగు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ మంగళవారం తెలిపారు. ఈనెల 6న అడ్మిట్ చేసుకుని డా. వాసుదేవరావు నేతృత్వంలో చికిత్స అందించి ఇవాళ డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డా. శ్రీధర్ వైద్యులను అభినందించారు.

February 24, 2026 / 04:57 PM IST

కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల జ్ఞాపిక సదస్సు పోస్టర్స్ విడుదల

ASF: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 27న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో CPI (ML) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కాగజ్ నగర్‌లో మంగళవారం విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి ఎండీ చాంద్ పాషా మాట్లాడుతూ.. భూ, కార్మిక, రైతాంగ పోరాటాల్లో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు.

February 24, 2026 / 04:49 PM IST

అధ్వానంగా మారిన రహదారి

NRPT: మక్తల్-మంథన్ గోడ్ రహదారి అధ్వానంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన వర్షం వల్ల గొల్లపల్లి సమీపంలో రోడ్డుపై భారీ నీరు చేరి చెరువును తలపిస్తోంది. గుంతలతో బురద ఏర్పడిన రోడ్డుపై వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

February 24, 2026 / 04:45 PM IST

ఎమ్మెల్యేను కలిసిన యాదవ సంఘం నాయకులు

PDPL: పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామానికి చెందిన యాదవ సంఘం నాయకులు మంగళవారం ఎమ్మెల్యే విజయరమణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా,ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కన్నారు.

February 24, 2026 / 04:44 PM IST

లక్ష్మణ్ రాథోడ్​కు ఇండియన్ బెస్ట్ ఇన్​స్పిరేషన్​ అవార్డ్

KMR: విద్యార్థులకు, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వారి ఉన్నతికి విశేష కృషి చేస్తున్న జడ్పీహెచ్​ఎస్​ పేట్​సంగం పీఈటీ, బామన్​ నాయక్​ స్పోర్ట్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు లక్ష్మణ్​రాథోడ్​కు ఇండియన్​ బెస్ట్​ ఇన్​స్పిరేషన్ అవార్డు వరించింది. న్యూఢిల్లీకి చెందిన గ్యాన్ ఉదయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అవార్డును ఆయనకు అందజేసింది.

February 24, 2026 / 04:40 PM IST

పాఠశాలలో లాంగ్వేజ్ టీచర్ల కాంప్లెక్స్ సమావేశం

NZB: భీంగల్ మండలం పల్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలల లాంగ్వేజెస్ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఐ.సీ.టీ టూల్స్, డిజిటల్ టూల్స్, IFP బోర్డు, దీక్ష ఆప్ మొదలైన వాటిని పాఠశాలలో ఏ విధంగా ఉపయోగిస్తునరన్న ఆంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల లాంగ్వేజెస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 24, 2026 / 04:40 PM IST

కేంద్ర మంత్రిని కలిసిన కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్

సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ బండి సంజయ్‌ను శాలువుతో ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్‌గా గెలుపొందడం సంతోషంగా ఉందని ఎంపీ అభినందిచారు. ప్రజలకు నిరంతరం తోడు ఉంటూ.. వార్డు అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రి తెలిపారు.

February 24, 2026 / 04:38 PM IST

‘పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత’

HNK: పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బాల్య వివాహ విముక్తి అవగాహన ప్రచార రథాన్ని నేడు హన్మకొండలో ఎంపీ ప్రారంభించారు. బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.

February 24, 2026 / 04:37 PM IST

గెలుపును జీర్ణించుకోలేక అక్రమ అరెస్టులు

MLG: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై ములుగు జిల్లా బీఆర్ఎస్ దళిత నాయకుడు చిట్టిమల్ల సమ్మయ్య తీవ్రంగా స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా గెలుపును జీర్ణించుకోలేక నిర్బంధాలకు పాల్పడటం హేయమని అన్నారు. కుళ్ళు రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ ప్రవీణ్, కర్రీ శ్రీను, బియ్యం శ్రీను, బోడ ప్రసాద్, పాల్గొన్నారు.

February 24, 2026 / 04:35 PM IST

తెలంగాణ ఉద్యమకారుని జలజకు ఘన నివాళులు

MHBD: జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం తెలంగాణ మలి విడత ఉద్యమకారిణి, రచయిత్రి జలజకు కళాకారులు ఘనంగా నివాళులర్పించారు. జలజ చిత్రపటానికి డీ పీ ఆర్ ఓ రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ కృష్ణవేణి, కళాకారులు పాల్గొన్నారు.

February 24, 2026 / 04:34 PM IST

పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్

MBNR: హన్వాడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా బోధన, సదుపాయాలు, నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం SSC విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

February 24, 2026 / 04:33 PM IST