KMM: మధిర మున్సిపల్ వైస్ ఛైర్మన్గా ఎన్నికైన కోన ధని కుమార్ని కోన వారి కుటుంబ సభ్యులు శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో సాధించిన ఈ విజయాన్ని కుటుంబ గౌరవంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని కోన ధని కుమార్ స్పష్టం చేశారు.
ASF: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పని దినాల లక్ష్యం చేరుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నామని ఆసిఫాబాద్ జిల్లా DRDO దత్తారాం శనివారం ప్రకటనలో తెలిపారు. నిత్యం ఉపాధి హామీ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. గడువులోగా లక్ష్యం చేధించేలా ప్రణాళికలు అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు.
MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా ఓటరు జాబితాలో తప్పు ఒప్పులను సరి చేసుకోవాలని తహశీల్దార్ రజనీకుమారి సూచించారు. ఓటర్ జాబితాలో చనిపోయిన వారి ఓట్లు తొలగించే కార్యక్రమం చేపడుతున్నామని, ఎవరైనా చనిపోతే బీఎల్ఓ వద్ద ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసి చనిపోయిన వారి పేరు తొలగించాలని సూచించారు. ఏవైనా తప్పు ఒప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం ఉందని అన్నారు.
NLG: ఫార్మర్ రిజిస్టీకి మరో 7 రోజులే గడువు మిగిలి ఉంది. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్టీ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 5,54,347 మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. ఇప్పటివరకు 2,41,039 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు.
RR: చౌదరిగూడ మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో గణపతి అభయ ఆంజనేయ, శివాలయం, రామాలయం, నవగ్రహాల ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా దేవాలయ అభివృద్ధికి దిలీప్ శర్మ అనే వ్యక్తి రూ. 1,50,000 విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిపోయే విధంగా అందించిన ఈ విరాళం ఆలయ నిర్మాణ పనులు, మహోత్సవ ఏర్పాట్లకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కూచిరాజుపల్లిలో శనివారం ఉదయం 7:00 గంటలకు కోతుల దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి ముందు బ్రష్ చేసుకుంటున్న అంబటి రాజ్ కుమార్పై కోతుల మంద అకస్మాత్తుగా మూకుమ్మడి దాడి చేసింది. ఈ ఘటనలో రాజ్ కుమార్ భుజానికి, చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి.
SRPT: రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని వ్యవసాయ శాఖ ఏఈ త్రివేణి అన్నారు. శనివారం గరిడేపల్లి మండలం కొండాయిగూడెంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. పాస్ పుస్తకం, ఆధార్, లింక్ అయిన ఫోన్ నెంబర్తో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. దీనివల్ల బీమా, రుణాలు తదితర ప్రయోజనాలు కలుగుతాయన్నారు.
BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పున ప్రతిష్ట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజ, ఉత్సవ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. ప్రత్యేక ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఈవో మహేష్ సమన్వయంతో చేపట్టారు.
KMM: ఖమ్మంకు చెందిన శ్రీనివాసరావు వద్ద 2016లో రాజేంద్రప్రసాద్ రూ.10 లక్షలు అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించేందుకు ఆయన జారీ చేసిన రూ.12 లక్షల విలువైన చెక్కులు బ్యాంక్లో బౌన్స్ అవ్వడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన ఖమ్మం న్యాయమూర్తి బిందు, నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు.
WNP: పెబ్బేరు మున్సిపాలిటీలో పెదేంటి ఆడపిల్ల పెళ్లికి అండగా నిలబడాలనే సామాజిక బాధ్యతతో శనివారం నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తన సొంత ఖర్చులతో ఎమ్మెల్యే మెగా రెడ్డి పెళ్లి కానుక అందజేశారు. ఈ పెళ్లి కానుక లో రూ.3 వేలు, పెళ్లి వస్త్రాలను అందజేశారు. ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఎంతో కొండంత అండగా నిలిచిందన్నారు.
SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలో 13వ వార్డు కోనాయపల్లి పరిధిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నూతన వస్త్రాలు అందజేశారు. శనివారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆది శ్రీనివాస్ లబ్ధిదారులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
MBNR: నారాయణపేటలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ప్రతినిధులు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ డీకే అరుణను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అరుణ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు ప్రజలకు సేవ చేయడంలో తమ వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
VKB: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మోడల్ సోలార్ విలేజ్ పథకం గురించి అవగాహ సదస్సు నిర్వహిస్తున్నట్లు KADA స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్, TGSPDCL, CMD ముషరాఫ్, TGREDCO, MD అనీలా పాల్గొంటారని తెలిపారు.
SRPT: తుంగతుర్తిలోని పోలీస్ స్టేషన్కు ఇంటర్ ప్రశ్నా పత్రాలు శనివారం చేరుకున్నాయి. ఈ నెల 25 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్, ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ అరుణలు పేర్కొన్నారు. ప్రశ్న పత్రాలను స్టేషన్లో ప్రాంగణంలో సరిచూసుకుని ప్రత్యేక పెట్టెల్లో భద్రపరచారు.
MHBD: మహబూబాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్లో శనివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లేవని, చీరాల నుంచి సికింద్రాబాద్ టికెట్ మాత్రమే లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి గురించి ఏవైనా సమాచారం ఉన్నవారు 8712658602 నెంబర్ ద్వారా పోలీసులకు తెలియజేయవలసిందిగా సూచించారు.