WNP: రేవల్లి మండల తలుపునూరు గ్రామానికి చెందిన కౌసల్య అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమెకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతో CMRF మంజూరికి దరఖాస్తు చేసుకోగా రూ. 32 వేలు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కును మంగళవారం ఎమ్మెల్యే వనపర్తిలోని తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు.
RR: పల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర కీలకమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ముచ్చింతల్ గ్రామ పరిధిలో ఉన్న స్వర్ణభారత్ ట్రస్టులో నిర్వహిస్తున్న రంగారెడ్డి జిల్లా సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామస్తులకు సేవ చేస్తే మంచి పేరు వస్తుందని తెలిపారు.
HNK: జిల్లా కేంద్రంలోని అశోక థియేటర్ చౌరస్తాలో ఆటోమేటిక్ సిసి కెమెరాలను ఆర్టీసీ వరంగల్ టు డిపో అధికారులు మంగళవారం ప్రారంభించారు. అశోకా థియేటర్ చౌరస్తా మీదుగా వాహన రాకపోకలు సాగించేవారు. నిబంధనలను అతిక్రమిస్తే కెమెరాలు పసిగట్టి ఈ చాలాన్ ఇంటికి పంపించడం చేస్తాయి. వాహనదారులు నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
VKB: ఆలంపల్లికి చెందిన ప్రణీత్ అనే 9వ తరగతి విద్యార్థి మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. స్కూల్కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన ప్రణీత్, పాఠశాలకు చేరుకోలేదు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 98485 99876 నంబర్కు సమాచారం అందించాలని కోరారు.
NRML: పెంబి మండలంలోని మందపల్లి శివారులో ఎంపీ ఎస్సై హనుమాన్లు బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్ర వాహనదారుడు సరైన అనుమతి పత్రాలు అన్ని సవ్యంగా ఉంచుకుని, హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వ్యక్తిని శాలువాతో సత్కరించారు. ప్రతి ఒక్క వాహనదారుడు ఇదే విధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.
MDK: అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్చారంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన ఎల్లమ్మ(49) కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతుంది. సోమవారం ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చిన ఆమె మంగళవారం ఇంట్లో ఉరివేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BDK: బూర్గంపాడు మండలంలో ఇద్దరు ఎస్సైలు, వారి తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారం పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి గిరిజన మహిళ నుంచి రూ.1.82 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు తిరిగి ఇవ్వకుండా, బెదిరింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
JGL: వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీరామ భక్తాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆలయ కమిటీ మంత్రిని కోరారు. ఆలయ ఛైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు. అన్నదానం, కళ్యాణ కార్యక్రమాల కోసం రెండు షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఆలయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు.
MDCL: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అన్ని విధాలుగా సిద్ధమై ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై విజయం సాధించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సూచించారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తమ శ్రమకు తగిన ఫలితం అందుకోవాలని ఆకాంక్షించారు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.
MNCL: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ గ్రామస్థాయి పరిపాలనలో జీపీవోల పాత్ర కీలకమైనదని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధ్రువపత్రాల జారీ, లబ్ధిదారుల ఎంపిక జీపీవోల ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సూచించారు.
SRD: పటాన్ చెరువు పట్టణంలో భారీ CSR నిధులతో నిర్మాణంలో ఉన్న “సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్”కు దివంగత డా. కిషన్ రావు పేరు పెట్టేందుకు తాను తీవ్రంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. CM రేవంత్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్లతో మాట్లాడి, నూతన ఆసుపత్రికి కిషన్ రావు పేరు పెట్టించే దిశగా చర్యలు తీసుకుంటానని కస్బా బృంద సభ్యులతో ఆయన పేర్కొన్నారు.
SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ మోయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను కోహెడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనిగరం గ్రామ శివారులో తనిఖీల సందర్భంగా TG36-T-2838 నంబరు గల ట్రాక్టర్ పట్టుబడింది. డ్రైవర్ దర్శనం రాజేందర్పై కేసు నమోదు చేశారు. కోహెడ ఎస్సై పి. అభిలాష్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
NGKL. కుమ్మెర ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ నేత రామచందర్ రావు మండిపడ్డారు. గుడి, బడి వంటి బహిరంగ ప్రదేశాల్లో కులవివక్షను పూర్తిగా నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి వెంటనే ఎక్స్రేషియా ప్రకటించి, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
GDWL: జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరిలో 77 మందిని రక్షించామన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,323 మంది పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించామని వివరించారు.
SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ మోహినికుంట మల్లిఖార్జున స్వామి ఆలయ హుండీని ఈనెల 28న ఉదయం 11 గంటలకు లెక్కించబడునని ఆలయ పూజారి భద్రయ్య ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఆలయ ఆవరణలో జరిగే హుండీల లెక్కింపునకు పర్యవేక్షణకు దేవాదాయ శాఖ, జగిత్యాల డివిజన్ పరిశీలకులు పర్యవేక్షణలో భక్తుల సమక్షంలో హుండీలు లెక్కించబడునని పేర్కొన్నారు.