SRPT: డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, డ్రైవర్ కంటి చూపు బాగా ఉంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతాడని సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల వాహన డ్రైవర్లకు శనివారం సూర్యాపేటలో పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక రవి మహాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభిచారు.
MDK: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా రేపటి నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని ఎస్పీ తెలిపారు.
SRD: స్విమ్మింగ్ పూల్ కోచ్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. 40 ఏళ్లలోపు ఉండి, ఎన్ఐఎస్ సర్టిఫికెట్ కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు మార్చి 7 లోపు కలెక్టరేట్లోని క్రీడా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 7981798957 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
JGL: జగిత్యాల పట్టణం విద్యానగర్లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాన్ని శనివారం దేవాలయం ఆవరణలో ఆవిష్కరించారు. మార్చి 26- 28 వరకు శ్రీరాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ అశోక్ రావు తెలిపారు. ఉత్సవాల్లో మార్చి 26 గురువారం విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యవచనం, రక్షాబంధన నిర్వహిస్తామన్నారు.
MDK: మెదక్ పట్టణంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి మహమ్మద్ ఇమ్రాన్ కుటుంబంపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు టౌన్ సిఐ మహేష్ తెలిపారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, గణేష్, శ్రీను, సురేష్ తదితర 30 మంది వ్యక్తులు ఇమ్రాన్ ఇంటిపైకి వచ్చి దాడికి యత్నించినట్లు వివరించారు.
NLG: గుండ్లపల్లి(డిండి) మండలం ఎర్రగుంటపల్లి, వావిల్ కోల్ రహమంతాపూర్, కందుకూరు, సింగరాజుపల్లి, తవక్లాపూర్ గ్రామాలలో నూతనంగా నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య కార్యాలయ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలునాయక్ శనివారం శంకుస్థాపన చేశారు. కందుకూరు స్కూల్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన చేసిన అనంతరం సీసీ రోడ్డును ప్రారంభించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్: మిడ్జిల్ మండలంలోని వెలుగోములలో సర్పంచ్ సువర్ణమ్మ అధ్యక్షతన శనివారం గ్రామసభ నిర్వహించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి ఎద్దడి కలగకుండా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అండర్ డ్రైనేజీ, వీధి దీపాలు, సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ కార్యదర్శి వినీల ఉన్నారు.
MLG: తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను శనివారం సాయంత్రం ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు అమ్మవార్లకు చీర, సారే సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, SP తదితరులు ఉన్నారు.
WGL: వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మహమ్మద్ అక్బర్ తండ్రి ఇవాళ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MLA KR నాగరాజు మృతుడి ఇంటికి వెళ్లి ఆయన పార్దివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
GDWL: మల్దకల్ కేంద్రంలో రెండవ సంవత్సరం ఆంగ్ల పరీక్షకు ఒక్కరు కూడా గైర్హాజరు కాకుండా అందరూ హాజరుకావడం గర్వకారణం అని సీఎస్ నరసింహులు, డిపార్ట్మెంటల్ అధికారి శేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా, మొత్తం 64 మంది విద్యార్థులకు గాను 64 మంది పరీక్షకు హాజరయ్యారు.
HYD: పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో బోయిన్పల్లిలో ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దైనందిన ఆహారంలో ప్రోటీన్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడారు. గుడ్లు, చికెన్లో పుష్కలంగా లభించే ప్రోటీన్ శరీర నిర్మాణం, కండరాల బలానికి, రోగనిరోధక శక్తి పెంపుకు ఎంతో అవసరమని తెలిపారు.
MDCL: 100% ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరగాల్సిందేనని సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ సృజన కిందిస్థాయి అధికారులకు, స్వచ్ఛ ఆటో కార్మికులకు సూచించారు. ఏమాత్రం తేడా వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుండ్ల పోచంపల్లిలో పర్యటించి, చెరువు పరిసరాల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్స్, గుర్రపు డెక్క తొలగింపు పై ఫోకస్ చేయాలన్నారు.
BHPL: TGలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో 22 లక్షల మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని TRP మొగుళ్లపల్లి (M) అధ్యక్షులు రాజేష్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమని, ఫీజు ఒత్తిడితో ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వెంటనే బకాయిలను విడుదల చేయాలన్నారు.
JN: జఫర్గడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు, ‘మా ఇల్లు’ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య తండ్రి గాదె సాల్మోన్ రెడ్డి (97) మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి MLA హరీష్ రావు, తొలి ఉపముఖ్యమంత్రి రాజయ్య ఇన్నయ్య నివాసానికి వెళ్లి ఆయన తండ్రి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ADB: విద్యార్థులు శాస్త్రీయంగా రాణించాలని ప్రధానోపాధ్యాయుడు కొమ్ము కృష్ణ కుమార్ అన్నారు. సర్. సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకొని బేల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్ర సాంకేతిక కృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కృష్ణకుమార్ పేర్కొన్నారు.