• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మేడ్చల్‌లో పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్

MDCL: మేడ్చల్ సర్కిల్ పరిధిలో నీటి ట్యాంకర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు దాదాపు 15 ట్యాంకర్ల వరకు సరఫరా జరుగుతున్నట్లు సమాచారం. ఒక్కో ట్యాంకర్‌కు రూ.600 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వేసవి తీవ్రత పెరగడంతో భూగర్భజలాల కొరత స్పష్టమవుతోంది.

February 25, 2026 / 05:53 PM IST

‘నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలి’

RR: కుమ్మెర మల్లన్న జాతరలో మృతి చెందిన రెండు నెలల పసిపాప కుటుంబాన్ని షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల రజక సంఘం నేతలు కలిసి మద్దతు తెలుపుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిందితులకు కఠిన శిక్ష అమలు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో శివశంకర్, బాల్ రాజ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 05:51 PM IST

ESI ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎంపీ

HNK: ESI ఆసుపత్రిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాకు త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్ పార్క్, విమానాశ్రయం వంటి మూడు ప్రధాన ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో కార్మికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, ఆసుపత్రిలో పేషెంట్లకు నాణ్యమైన సేవలను అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు ఎంపీ సూచించారు.

February 25, 2026 / 05:49 PM IST

బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: మణుగూరు పీవీ కాలనీలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 11వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.

February 25, 2026 / 05:46 PM IST

‘సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

MDK: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్ సీఐ రంగా కృష్ణ సూచించారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు పంపిన మెసేజ్, లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

February 25, 2026 / 05:43 PM IST

మార్చ్ 28న జాతీయ లోక్ అదాలత్

ADB: ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పెండింగ్ కేసులను అధికంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. రానున్న లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన సమన్వయ సమావేశంలో పలు సూచనలు చేశారు.

February 25, 2026 / 05:40 PM IST

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

WGL: నెక్కొండ మండలం పెద్దకోర్పోల్ గ్రామానికి చెందిన మట్టే ఏలియా అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన ఏలీయా.. విద్యుత్ ప్రమాదానికి గురై మృతిచెందాడు. దీంతో పెద్దకోర్పోల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏలీయా కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

February 25, 2026 / 05:40 PM IST

సమాజసేవలో ఎన్జీవోలు ముందుండాలి: కలెక్టర్

SRPT: సమాజసేవలో ఎన్జీవోలు ముందుండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. HCL Foundation విరాళంగా అందించిన ఆధునిక వైద్య పరికరాలను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అందజేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ఈ పరికరాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.

February 25, 2026 / 05:40 PM IST

‘నష్టపరిహారం చెల్లించి రోడ్డు పనులు చేపట్టాలి’

JN: జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్ల ప్లాట్లు కోల్పోతున్న ప్లాట్ల యజమానులకు నష్టపరిహారం చెల్లించి రోడ్డు పనులను చేపట్టాలని CPM జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. జనగామలో బాధిత ఫ్లాట్ల యజమానులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు కనకారెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

February 25, 2026 / 05:39 PM IST

గన్ పార్క్ నుంచి మీడియా అకాడమీకి జర్నలిస్టుల ర్యాలీ

HYD: డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కార్డులను పెంచాలని డెస్క్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో HYDలోని గన్ పార్క్ నుంచి నాంపల్లి చాపల్ రోడ్డులోని మీడియా అకాడమీ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అకాడమీ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. TWJF వ్యవస్థాపక అధ్యక్షులు సోమయ్య మాట్లాడుతూ.. అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 05:39 PM IST

కొమ్మాల జాతరపై నిర్లక్ష్యం బీజేపీ నేత కాళీప్రసాద్

WGL: గీసుకొండ మండలం కొమ్మలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకుడు కాళీప్రసాద్ రావు పరిశీలించారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 9 వరకు జరిగే ఉత్సవాలనేపథ్యంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి. మాట్లాడుతూ.. మంత్రి కొండ సురేఖ, స్థానిక ఎమ్మెల్యే రేవూరి మధ్య వర్గ పోరు కారణంగా ఆలయఅభివృద్ధి నిలిచిపోయిందన్నారు.

February 25, 2026 / 05:34 PM IST

ఇంటర్ ఎగ్జామ్స్ పరిశీలించిన కలెక్టర్

MDK: కొల్చారం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా హాళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరు, పరీక్షల నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలను తెరిచారా లేదా అన్నది తెలుసుకున్నారు.

February 25, 2026 / 05:34 PM IST

ఇంటర్ చేంజ్ విధానం అమలు చేయాలని వీసీకి వినతి

HNK: కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంను డిసబుల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. పార్ట్ టైమ్ అధ్యాపకుల నియామకాలలో దివ్యాంగుల రోస్టర్ పాయింట్ల ఇంటర్ చేంజ్ విధానం అమలు చేయాలని వీసీని వారు కోరారు. జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ యాకుబ్ పాషా, రాంబాబు, శ్రీశైలం, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 05:34 PM IST

గద్వాలలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం

GDWL: రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా గద్వాల కలెక్టరేట్ ముందు ఎర్రవల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రత్యేక హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ద్విచక్ర వాహనదారులకు స్వయంగా హెల్మెట్లు ధరింపజేశారు. రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

February 25, 2026 / 05:34 PM IST

నారాయణపేట చీరలకు జీఐ అవగాహన

NRPT: జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేటలోని ఎస్‌ఆర్ ఫంక్షన్ హాలులో జీఐ గుర్తింపుపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు సీఈవో తేజస్ తెలిపారు. నారాయణపేట చీరలకు భౌగోళిక సూచిక సర్టిఫికెట్ లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని చెప్పారు. జీఐ సాధనకు సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు యజమానులు పాల్గొన్నారు.

February 25, 2026 / 05:32 PM IST