• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అప్రెంటిన్షిప్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

నల్లగొండ రీజియన్ పరిధిలో ఇంజనీరింగ్ మరియు డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి తెలిపారు. ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ / డిప్లొమా అభ్యర్థులు NATS వెబ్‌సైట్ https://nats.education.gov.in ను మార్చి 5 వరకు సందర్శించి నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 75691 18549 సంప్రదించాలన్నారు.

February 25, 2026 / 10:09 PM IST

క్రీడలతోనే ఆరోగ్యం, ఆనందం: పుల్లారావు

PLD: యువతలో ఆసక్తి పెంచేందుకే సీఎం చంద్రబాబు ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ శాసనసభ క్రీడాపోటీల్లో ఆయన పాల్గొన్నారు. తోటి ఎమ్మెల్యేలతో కలిసి వాలీబాల్ ఆడారు. ప్రజలను సంతోషంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, సాంకేతికత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలే ఉత్తమ మార్గమన్నారు.

February 25, 2026 / 10:00 PM IST

వైద్య విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన గవర్నర్

GNTR: ప్రత్తిపాడు ఈదులపాలెంలోని కాటూరి మెడికల్ కళాశాల 22వ గ్రాడ్యుయేషన్ వేడుకలకుబుధవారం ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయన పట్టాలు అందజేశారు. డాక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి నవతరం వైద్యులను అభినందిస్తూ, వృత్తిలో రాణించాలని గవర్నర్ ఆకాంక్షించారు.

February 25, 2026 / 10:00 PM IST

బాపట్లలో ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’

BPT: బాపట్లను మత్తు రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ చేపట్టారు. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో వేదుళ్లపల్లి పోలీసులు, ఈగల్ సెల్ సిబ్బంది విద్యాసంస్థల వద్ద తనిఖీలు చేశారు. నిషేధిత ‘కూల్ లిప్’ తదితర పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. పాఠశాలలకు 100 మీటర్ల లోపు వీటిని అమ్మరాదన్నారు.

February 25, 2026 / 10:00 PM IST

రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు కౌన్సిలింగ్

KDP: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో జీవిస్తూ కుటుంబంతో గౌరవప్రదమైన జీవనం గడపాలని హితవు పలికారు.

February 25, 2026 / 09:56 PM IST

వీరభద్ర స్వామి దర్శించుకున్న సబ్ కలెక్టర్

రాయచోటి వీరభద్ర స్వామివారిని రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన వారి కుటుంబ సభ్యులు కలిసి దర్శించుకున్నారు. వారికి దేవస్థాన అర్చక స్వాములు, ఆలయ ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఆలయ కార్యనిర్వాహణాధికారి డీవీ రమణారెడ్డి పూర్ణపలంతో స్వాగతం పలికారు. అర్చనలు చేసిన అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.

February 25, 2026 / 09:46 PM IST

న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష

SDPT: బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి సిద్దిపేట కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన శంకర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ, అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేశారు.

February 25, 2026 / 09:45 PM IST

ఇంటర్ పరీక్షలకు 852 మంది గైర్హాజరు

KRNL: జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 852 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. 27,571 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 26,718 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.

February 25, 2026 / 09:44 PM IST

జనసేన నాయకులతో MLA భేటీ

ELR: ఉంగుటూరు MLA క్యాంపు కార్యాలయంలో బుధవారం MLA పత్సమట్ల ధర్మరాజు అధ్యక్షతన గణపవరం మండల నాయకులతో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ.. రేపటి నుంచి ప్రారంభమవుతున్న ప్రారంభమవుతున్న 5వ విడత జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు వల్ల కార్యకర్తలకు కలిగే ప్రయోజనాలు వివరించారు.

February 25, 2026 / 09:44 PM IST

ఎంపీడీవో పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి

W.G: పెనుగొండ ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి పని తీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల వ్యాప్తంగా జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పురోగతిపై సమీక్షించారు. సర్వే నత్త నడకన సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం జేశారు. రెండు రోజుల్లో టార్గెట్ పూర్తి చేయాలంటూ ఆమె ఆదేశాలు జారీ చేశారు.

February 25, 2026 / 09:43 PM IST

టీమ్ సెలక్షన్ పై శ్రీకాంత్ ఫైర్

భారత్ తుది జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. అసలు కోచ్ గంభీర్ ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించాడు. ఇలాంటి చెత్త ప్రయోగాలతో ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని వ్యాఖ్యానించాడు. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నాడు.

February 25, 2026 / 09:40 PM IST

విజయనగరం ఆర్డీవో బదిలీ..?

VZM: 2018 గ్రూప్-1 అధికారులపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఆర్డీలోలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. వారిని అప్రాధాన్యత పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం కోర్టుకు కూడా హాజరుకావాల్సి వచ్చింది. వారిలో విజయనగరం ఆర్డీవో దాట్ల కీర్తి కూడా ఉన్నారు.

February 25, 2026 / 09:35 PM IST

ఈడుపుగల్లులో కలెక్టర్ పర్యటన

కృష్ణా: కలెక్టర్ బాలాజీ కంకిపాడు(M)లోని ఈడుపుగల్లులో నిర్మాణంలో ఉన్న తారురోడ్డును బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఆపి నిర్మాణ నాణ్యత, గతంలో ఎదురైన ఇబ్బందులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పనుల పురోగతిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు మండలంకు చెందిన ఆర్‌అండ్‌బీ డీఈఈ బలరాం పాల్గొన్నారు.

February 25, 2026 / 09:32 PM IST

గంజాయి నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సీపీఐ

GNTR: డ్రగ్స్ మాఫియా, కార్పొరేట్ వైద్య దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ నేత నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరులో జరిగిన పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28న డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా నిర్వహించే నిరసనలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం గంజాయి, కల్తీ ఆహారం నియంత్రించడంలో విఫలమైందన్నారు.

February 25, 2026 / 09:30 PM IST

సెక్రటరికి వినతి ప్రతం అందజేత

WGL: ఉమ్మడి జిల్లాలోని పాలకుర్తి, మహబూబాబాద్ గిరిజన గురుకుల పాఠశాల & కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఇవాళ DSFI ఆధ్వర్యంలో గురుకులాల సెక్రటరీ సీత లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSFI రాష్ట్ర( P) శివ వర్మ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మెనూని అందించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

February 25, 2026 / 09:21 PM IST