ELR: ద్వారకతిరుమల మండలం గొల్లగూడెంలో నిర్వహిస్తున్న వ్యభిచారం గృహంపై ఎస్సై సుధీర్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. ఎస్సై మాట్లాడుతూ.. పంచవ నాగమణి, భర్త సునీల్ గృహంలోనే విటులను రప్పించి అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారంతో ఇద్దరూ విటులను, ఒక బాధితురాలను అదుపులోకి తీసుకున్నామన్నారు.
WGL: ఎనుమాముల మార్కెట్ యార్డును నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. మిర్చి సీజన్ నేపథ్యంలో మార్కెట్కు పెద్ద సంఖ్యలో వస్తున్న రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులో తాగునీటి సదుపాయం, తగిన షెడ్లు, తూకం ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
NTR: గత రెండు నెలల క్రితం టీడీపీ సీనియర్ కార్యకర్త ఇప్పిలి రాంబాబు గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా రూ.10,000 / చెక్కును నిన్న అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చిన తమను సంప్రదించాలని రాంబాబు కుటుంబ సభ్యులను కోరారు.
KRNL: గూడూరు నగర పంచాయతీ SC కాలనీలో SI రాజ కుళ్లాయప్ప సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, IVRS కాల్స్, నకిలీ రుణాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అనుమానిత కాల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు.
అన్నమయ్య: ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న కులవర్ధన్ తల్లి అంజలిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర శుక్రవారం తెలిపారు. కేసు అత్యంత దారుణంగా జరిగినదని, మైనర్ బాలికను పరిగణనలోకి తీసుకోకుండా అగంతకుడు కులవర్ధన్ బాలికను హత్యకు గురిచేశాడని పేర్కొన్నారు. చట్టం తన పని తానే చేస్తుందన్నారు.
W.G: నరసాపురం సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతుల దృష్ట్యా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ మధుకుమార్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాయపేట, మొగల్తూరు రోడ్డు, జేసీకిలి స్కూల్ ఏరియా, దేవునితోట, సబ్ కలెక్టర్ బంగ్లా, మున్సిపల్ ఆఫీస్ రోడ్డు, మూడు బొమ్మల సెంటర్, క్రిస్టియన్ పేట, కప్పలపేట ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందని తెలిపారు.
సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూపర్స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్నారు. వృద్ధుడి గెటప్లో సత్యదేవ్ మేకోవర్, టీజర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మేలో విడుదల కానుందని సత్యదేవ్ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ను చిత్ర బృందం ప్రకటించనుంది.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10:30 గంటలకు జరగనుంది. నగరంపాలెంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్పర్సన్ కత్తెర హెనీ కిస్ట్రినా అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
SDPT: హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పప్పెట్రీ షోలో సిద్దిపేట జిల్లాకు చెందిన మాధవి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దుబ్బాక మండలం గంభీర్పూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె ప్రదర్శించిన బొమ్మలాట అందరినీ ఆకట్టుకుని రాష్ట్రస్థాయి కన్సోలేషన్ బహుమతిని దక్కించుకుంది. జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి రమేశ్ ఆమెను అభినందించారు.
AP: తూ.గో జిల్లా దేచర్లలో బుల్లెట్ల కలకలం రేగింది. UP నుంచి వచ్చి ఉంటున్న సమీర్ హుస్సేన్ నుంచి పోలీసులు 9mm పిస్టల్ బుల్లెట్లు 9, 315 రైఫిల్ కోసం ఉపయోగించే 8mm బుల్లెట్లు ఆరింటిని స్వాధీనం చేసుకున్నారు. UP వెళ్లివస్తుండగా పరిచయమైన ఆదిత్యరాజ్ ఇవి ఇచ్చాడని, అతని వద్ద గన్, బుల్లెట్లు ఉన్నాయని సమీర్ పేర్కొన్నాడు. ఆదిత్యపై ఇప్పటికే రాజమండ్రి PSలో పలు కేసులు ఉన్నాయి.
MDK: ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు.
GDWL: రాజ్యాంగం పట్ల అవగాహనతోనే భావి భారత పౌరులు ఉత్తమంగా ఎదుగుతారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన ఆడపిల్లల చదువు ఆవశ్యకత పోస్టర్, బాలల కోసం భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సైన్స్ ప్రచారం మాత్రమే కాకుండా, సామాజిక అంశాలపై జేవీవీ చూపుతున్న చొరవను అభినందించారు.
KDP: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ CM,YS జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తాడేపల్లిలో ఉపాధ్యాయ MLC,YCP రామచంద్రారెడ్డి జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉపాధ్యాయుల తరఫున పోరాటాలు చేస్తున్నామని జగన్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రేలకుంట గ్రామంలో ఇవాళ SDF నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరు కానున్నారు. ఈ విషయాన్ని మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.