BDK: మణుగూరు కట్టు మల్లారం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పోడు భూమి సమస్యపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫారెస్ట్ అధికారులను క్యాంపు కార్యాలయానికి పిలిపించి సమస్యను సమగ్రంగా చర్చించారు. గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
CTR: పుంగనూరు పురపాలక కార్యాలయంలో రేపు బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్టు, బస్టాండులోనికి వచ్చు ప్రవేటు వాహన దారుల నుంచి ఫీజు వసూలు, PMC బస్టాండ్, పబ్లిక్ యూరినల్స్ మొదలగు వాటికీ వేలం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
స్వాతంత్య్రం తర్వాత భారత్లోపలు రాష్ట్రాల పేర్లు మారాయి. యునైటెడ్ ప్రావిన్స్ ఉత్తరప్రదేశ్గా, మద్రాస్ తమిళనాడుగా, మైసూర్ కర్ణాటకగా రూపాంతరం చెందాయి. ఉత్తరాంచల్.. ఉత్తరాఖండ్గా, ఒరిస్సా ఒడిశాగా మారగా, లక్కడివ్ దీవులు లక్షద్వీప్గా పిలవబడుతున్నాయి. తాజాగా కేరళ పేరును కూడా ‘కేరళం’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అన్నమయ్య: మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రెడిఫుడ్స్ ఫ్యాక్టరీ సమీపంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే మరణించింది. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జింకను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద విడుదలైన నిధులతో ఇవాళ సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. టీడీపీ నాయకుడు బీపీ ఈరన్న కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
పట్టణాల్లో ఉన్న పేదలకు ‘పీఎం ఆవాస్ యోజన 2.0’ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా కొత్తగా 2,87,618 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో PMAY-U 2.0 పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మంజూరైన మొత్తం ఇళ్ల సంఖ్య 13.61 లక్షలకు చేరింది. తాజా విడతలో ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లబ్ధి చేకూరనుంది.
NDL: భారత్–జర్మనీ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యురాలిగా నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి నియమితులయ్యారు. దీంతో ఆమె మరోసారి అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఎంపీ మాట్లాడుతూ.. రెండు దేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనను ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
తండ్రిని తుపాకీతో కాల్చి చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి డ్రమ్ములో పెట్టిన ఘటన యూపీలో జరిగింది. అక్షత్ అనే యువకుడు తన తండ్రి మానవేంద్ర సింగ్(50)ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా కోసి డ్రమ్ములో పెట్టాడు. మర్నాడు తన తండ్రి కనబట్లేదని పోలీసుల ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
NRPT: కోస్గి మండలంలోని ముశ్రీఫా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు ఉపాధ్యాయులతో వివరించారు. పాఠశాల GHMగా పవన్, కలెక్టర్గా శివరాం, విద్యాశాఖ మంత్రి ముస్థాక్, వివరించినట్లు పాఠశాల GHM శేఖరయ్య తెలిపారు. ఉత్తమ విద్యా బోధన చేసిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. తోటి విద్యార్థులకు విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలను బోధించారు.
BPT: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బాపట్ల పట్టణంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు బుధవారం గౌతం గ్రాండ్ హోటల్లో సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ సమన్వయకర్త పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు.
AP: పూర్తికాని వెలుగొండను.. జాతికి అంకితమంటూ జగన్ ప్రజలను మోసగించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. గుండ్లకమ్మ గేట్లు విరగ్గొట్టి గత పాలకులు ఇసుక దోపిడీకి పాల్పడ్డారని, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఏం చేసినా చంద్రబాబే చేశారని గుర్తుచేశారు. గుండ్లకమ్మ గేట్ల మరమ్మతులతో పాటు కూటమి ప్రభుత్వం గేట్లు బిగించిందన్నారు. రైతులకు సకాలంలో నీరు అందించి పంటలను కాపాడామని తెలిపారు.
ASF: పెంచికల్ పేట్ మండలం ఎలుకపల్లికి చెందిన నాగేశ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జేసీబీ తవ్విన మట్టి దిబ్బల సమీపంలో మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న SI అనిల్ కుమార్ బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
T20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా టీమిండియా సెమీస్ అవకాశాలు కఠినంగా మారాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రేపు భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. దీనికోసం తాజా పిచ్ను వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని సమాచారం. దీంతో భారత్ భారీ స్కోర్ చేసే ఛాన్స్ ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
GNTR: రాజధాని అమరావతిలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రతినిధుల బృందం బుధవారం కూడా పర్యటించింది. తాడేపల్లి మండలం ఉండవల్లి పంప్ హౌస్ వద్ద పనుల పురోగతిని సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు వారికి క్షుణ్ణంగా వివరించారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై ఏడీబీ అధికారులు ఈ పర్యటన ద్వారా పూర్తి అవగాహన చేసుకున్నారు.
NDL: మహానందిలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనపై బుధవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. MPHEO హుస్సేన్ రెడ్డి, తదితరులు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారి నుంచి నమూనాలను సేకరించారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, ప్రజలు సర్వేకు సహకరించాలని అధికారులు కోరారు.