• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

85వ రోజుకి చేరిన రిలే నిరాహార దీక్షలు

NGKL: చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఎర్రవల్లి-గోకారం రిజర్వాయర్లో ముంపునకు గురికాకుండా చూడాలని చేస్తున్న రిలే నిరాహార దీక్ష మంగళవారంతో 85 రోజులకు చేరుకుంది. అలాగే R&R ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. తమ భూములు తమకు కావాలని, తమ ఇళ్లు ముంపునకు గురి కాకుండా కాపాడాలని కోరారు.

February 24, 2026 / 12:38 PM IST

MGNREGA పనులను ప్రారంభించిన.. సర్పంచ్

MLG: మంగపేట మండలం నిమ్మగూడెం, రమణక్కపేట, దొమేడ గ్రామాల్లో మంగళవారం MGNREGA పనులను ఆయ గ్రామాల సర్పంచులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి కాలంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ పథకం ద్వారా గ్రామీణులు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామాల వార్డ్ మెంబర్లు ఉన్నారు.

February 24, 2026 / 12:36 PM IST

రుద్రవరం మండల సర్వసభ్య సమావేశం

NDL: రుద్రవరం మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 28వ తేదీన నిర్వహించబడనుందని ఎంపీడీవో భాగ్యలక్ష్మి ఇవాళ తెలిపారు. మండల అధ్యక్షుడు మబ్బు బాలస్వామి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు సకాలంలో హాజరు కావాలని, శాఖల అధికారులు ప్రగతి నివేదికలతో సిద్ధంగా ఉండాలని ఆమె ఆదేశించారు.

February 24, 2026 / 12:36 PM IST

2 రోజులు తిరుపతి ఐజర్‌లో కార్యక్రమాలు

తిరుపతి: ఏర్పేడులోని తిరుపతి IISERలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఫిబ్రవరి 28, మార్చి 2వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఆ రెండు రోజులు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమాలు జరుగనున్నాయి. 200కు పైగా శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రత్యక్ష ప్రయోగాలు చేపడతారు. మార్చి 2న కౌస్తావ్ సాన్యాల, రుచి ఆనంద్, ధనంజయ శర్మ ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వనున్నారు.

February 24, 2026 / 12:34 PM IST

మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

AKP: నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామం మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని ప్రిన్సిపాల్ సంధ్య తెలిపారు. మంగళవారం నుంచి వచ్చే నెల మార్చి 31 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. https://www.cse.ap.gov.in , https://www.apms.apcfss.in అనే వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

February 24, 2026 / 12:34 PM IST

బాధిత కుటుంబానికి LOC అందజేసిన ఎంపీ

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన ఠాకూర్ పద్మాబాయ్ చికిత్స కోసం నిజాం ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్‌లో చేరగా, మెదక్ ఎంపీ రఘునందన్ రావు రూ.2,00,000 ఎల్ఓసిని కుటుంబ సభ్యుడు వికాస్ సింగ్‌కు అందించారు. కార్యక్రమంలో జిన్నారం మండల బీజేపీ అధ్యక్షుడు కొత్తకాపు జగన్ రెడ్డి, రమణ సింగ్ తదితరులు ఉన్నారు.

February 24, 2026 / 12:32 PM IST

దేవాదుల సాక్షిగా రేవంత్ రెడ్డి ట్వీట్

TG: జలవివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దేవాదుల సాక్షిగా కృష్ణా, గోదావరి జలాల సాధనలో వివాదమా?, పరిష్కారమా? అంటే తాము పరిష్కారం కోరుకుంటామని అన్నారు. చర్చలా, పంచాయితీనా అంటే తాము చర్చలే కోరుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందివ్వడమే తమ ప్రభుత్వం మందున్న టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

February 24, 2026 / 12:32 PM IST

ఆలయ అభివృద్ధి కోసం భూమి కొనుగోలు

JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని గల శ్రీ స్వయంబూ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భూమిని కొనుగోలు చేశారు. ఆలయ ఆవరణలో కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయానికి ప్రక్కనున్న కొండ శ్రీనివాస్ గౌడ్ చెందిన రెండు గుంటల భూమిని రూ. 17,10,000 వేలకు కొనుగోలు చేసినట్లు వాళ్ళ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు.

February 24, 2026 / 12:31 PM IST

ఉపాధి హామీ పనులు ప్రారంభం

MDK: చిలిపిచేడ్ మండలం శిలాంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను నూతన సర్పంచ్ రాజేందర్ రెడ్డి, కార్యదర్శి అఖిల్ మంగళవారం ప్రారంభించారు. కూలీలకు పని కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. అర్హులైన గ్రామస్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రమేశ్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

February 24, 2026 / 12:31 PM IST

కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 985 పాయింట్లు పతనమై 82,308 వద్ద, నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 25,424 వద్ద కొనసాగుతున్నాయి. US అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు, ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా AI ప్రభావం, టారిఫ్ భయాలతో ఐటీ రంగానికి చెందిన ఇన్ఫోసిస్, TCS వంటి సంస్థలు 3 శాతం మేర నష్టపోయాయి.

February 24, 2026 / 12:30 PM IST

గాంధారి సిహెచ్‌లో గర్భిణీలకు వైద్య పరీక్షలు

KMR: గాంధారి CHCలో అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు డాక్టర్ సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CHC పరిధిలోని గర్భిణీ మహిళలు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే వారికి పౌష్టికాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.

February 24, 2026 / 12:30 PM IST

మల్లమ్మ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే సంతాపం

BHNG: మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన మట్టిపల్లి మల్లమ్మ ఇటీవల మరణించగా, మంగళవారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆమె నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

February 24, 2026 / 12:30 PM IST

ఆలయ నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని వినతి

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని కాపు వాడలో పోచమ్మ ఆలయం స్థల సేకరణ చేయాలని 6వ వార్డ్ కౌన్సిలర్ ఎమ్మాజీ శారదా సంతోష్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదేశాల మేరకు తహసీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు. ఆలయ స్థలం సేకరణకై పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని, త్వరలోనే ఆలయ నిర్మాణానికి స్థల సేకరణ చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారని తెలిపారు.

February 24, 2026 / 12:30 PM IST

‘ఫోటోగ్రాఫర్ పై దాడి నిందితులను శిక్షించాలి’

NLG: తిరుమలగిరి మండలంలో ఫోటోగ్రాఫర్ మధుపై మద్యం మత్తులో దాడి చేసి, కెమెరాలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చిట్యాల మండల ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు సైదులు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వృత్తిధర్మంలో ఉన్నవారిపై ఇలాంటి దాడులు అమానుషమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిట్యాల పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

February 24, 2026 / 12:28 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ప్రజాబాట’

SRPT: అనంతగిరి మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో మంగళవారం ఘనంగా ‘ప్రజాబాట’ కార్యక్రమం నిర్వహించారు. అనంతగిరి సెక్షన్ అధికారులు, గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ పర్యటన చేశారు.​ ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజాబాట ద్వారా సేకరించిన వినతులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 12:28 PM IST