KKD: PGRS అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు సూచించారు. సోమవారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో 44 మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
KMR: జిల్లావ్యాప్తంగా నేడు జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్ష ముగిసింది. మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో 10,581 మంది విద్యార్థులకు గాను 10,173 మంది హాజరయ్యారు. 408 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, జిల్లాలో సగటు హాజరు శాతం 96.14గా నమోదైందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా, మౌలిక వసతులు కల్పించినట్లు వారు తెలిపారు.
PDPL: 2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్కుమార్ ఇవాళ తెలిపారు. 6వ తరగతిలో పూర్తి సీట్లు, 7 నుంచి 10 తరగతులకు మిగిలిన సీట్లకు ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.
TPT: గూడూరు, తిప్పవరపాడు పరిసర ప్రాంతాలలో హిజ్రాల నిలువు దోపిడీ చేస్తున్నారు. పరువు భయంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. జేబుల్లో చేతులు బట్టలు విప్పేసి బరి తెగిస్తున్నారు. ఓ మహిళ నా దగ్గర లేవు అంటున్నా బ్యాగ్ చూపించు అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. దీనిపై స్పందించాల్సిన పోలీసులు తమకు ఫిర్యాదులు రాలేదంటూ మిన్నకుంటుండడంతో హిజ్రాలు ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి.
ప్రకాశం: మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామంలో సెంటు వాగు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి పశువుల షెడ్డు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్లు సోమవారం ఎమ్మార్వో కార్యాలయానికి ఫిర్యాదు వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మార్వో చిరంజీవి ఆ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా షెడ్డు నిర్మించిన వారిని షెడ్డు నిర్మించడానికి గుర్తించి, నోటీసులు ఇచ్చారు.
AP: కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చౌడేశ్వరి నగర్కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అయితే, కల్తీపాల ఘటనలో ఇది వరకే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విజయనగరం నియోజకవర్గం గోసంరక్షణ సమితిలో మార్వాడి కమ్యూనిటి వారు ముందుస్తుగా ఏర్పాటుచేసిన హోలీ సంబరాలలో సోమవారం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. ఈసందర్బంగా చిన్నా, పెద్దా అంతా ఒక దగ్గర చేరి రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. రసాయనాలు కలిపిన రంగులు కాకుండా సహజ రంగులు వాడాలని సూచించారు.
VSP: జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సోమవారం సీతంపేట పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. సభ్యత్వం పార్టీ బలోపేతానికి కీలకమని, బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇది ముఖ్యమని తెలిపారు.
KNR: క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని హుజురాబాద్ ఏసీపీ వి.మాధవి సూచించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో సోమవారం పీఎం సంసద్ క్రీడా మహోత్సవంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి క్రీడలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రీడలో రాణించాలని ACP కోరారు.
BHNG: మండలలోని కేంద్రమైన దూది వెంకటాపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
WNP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సోమవారం వనపర్తి జిల్లాలో మహిళా సంఘాల సభ్యులతో సమీక్షించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని మాట్లాడుతూ సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.
CTR: మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిని పోలీసులు పట్టుకుని 1st స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.90,000 జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు.
JGL: మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ పదవీ విరమణతో, జగిత్యాల మున్సిపల్ కమిషనర్గా ఉన్న స్పందనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం స్పందన మెట్పల్లి మున్సిపల్ కమిషనర్గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
TPT: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కే.ఆర్. సూర్యనారాయణ భారీ సదస్సుకు సంబంధించిన గోడపత్రికను కాళహస్తిలోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళల పాత్ర కీలకమని, మహిళా ఉద్యోగుల సమస్యలు, వారి హక్కులను వివరించారు.
TPT: తిరుపతి అదనపు ఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 195 ఎర్రచందనం దుంగలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని తెలిపారు. బృందాన్ని అభినందిస్తూ అధికారులకు రివార్డులు ప్రకటించారు.