కృష్ణా: అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్రంలో వెటర్నరీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి పశువైద్యశాల ఏర్పాటు చేసి తగిన డాక్టర్లను నియమించాలని అన్నారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న NTR కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రహరీ దుస్థితిలో ఉందని, నిధులు కేటాయించి ఆధునీకరించాలని కోరారు.
PDPL: ప్రైవేటు ఆసుపత్రిలో నెలలు నిండక ముందు జన్మించిన నవజాత కవల పిల్లలకు PDPL ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో అత్యుత్తమ చికిత్స అందించి బాగు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ మంగళవారం తెలిపారు. ఈనెల 6న అడ్మిట్ చేసుకుని డా. వాసుదేవరావు నేతృత్వంలో చికిత్స అందించి ఇవాళ డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డా. శ్రీధర్ వైద్యులను అభినందించారు.
VZM: గరివిడి మండలం శ్రీరామ్ నగర్లోని ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో ఉన్న సుమారు 95 మంది బధిర విద్యార్థులకు చీపురుపల్లి DSP రాఘవులు ఆధ్వర్యంలో కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మంగళవారం కల్పించారు. దర్శనం అనంతరం ప్రసాదాలు అందించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వారికి సూచించారు. విద్యార్థులను సురక్షితంగా తిరిగి సెంటర్కు చేర్చారు.
TG: టీజీపీఈ-సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 2 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మే 5 వరకు దరఖాస్తు చేసుకొవచ్చని వెల్లడించారు. మే 31 నుంచి జూన్ 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
సత్యసాయి జిల్లాలోని పలు ఆర్టీసీ బస్టాండ్లలో ఖాళీగా ఉన్న దుకాణాలను టెండర్ ద్వారా కేటాయించనున్నారు. ఆసక్తి గల వ్యాపారస్తులు రేపు ఆయా డిపోలకు వెళ్లి టెండర్ ఫారాలను తీసుకోవచ్చు. టెండర్ దరఖాస్తులు సమర్పించడానికి కూడా రేపే చివరి రోజు అని అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన బస్టాండ్లలోని ఖాళీ గదులు నుంచి స్టాళ్ల వరకు ఈ వేలంలో పాల్గొనవచ్చు.
ASF: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 27న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో CPI (ML) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కాగజ్ నగర్లో మంగళవారం విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి ఎండీ చాంద్ పాషా మాట్లాడుతూ.. భూ, కార్మిక, రైతాంగ పోరాటాల్లో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు.
SKLM: జిల్లాలో నమోదైన డయేరియా కేసులపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. మంగళవారం అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలువురు బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని మంత్రికి వివరించారు.
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో మూవీకి ప్రదీప్ రూ.25 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. ఆయనకున్న యూత్ ఫాలోయింగ్తో నిర్మాతలు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, వచ్చే రెండేళ్ల వరకు ప్రదీప్ డేట్లు ఖాళీ లేవట. ఆయన షెడ్యూల్ అంతలా లాక్ అయిపోవడం హాట్ టాపిక్గా మారింది.
GNTR: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుందని గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) గ్రౌండ్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు ఈ ఎంపికలు జరుగుతాయని ఆయన వివరించారు. కావున అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NRPT: మక్తల్-మంథన్ గోడ్ రహదారి అధ్వానంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన వర్షం వల్ల గొల్లపల్లి సమీపంలో రోడ్డుపై భారీ నీరు చేరి చెరువును తలపిస్తోంది. గుంతలతో బురద ఏర్పడిన రోడ్డుపై వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ATP: గుత్తి శివారులోని కోళ్ల ఫారం సమీపంలోని ఓ గోడౌన్ వద్ద తాగునీటి మోటార్, కేబుల్ వైర్ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారని గోడౌన్ యజమాని సుధీర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం బాధితుడు మాట్లాడుతూ.. సుమారు రూ.70,000 విలువ చేసే తాగునీటి మోటర్ కేబుల్ వైర్లను దుండగులు ఎత్తుకెళ్లారన్నారు. బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
PDPL: పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామానికి చెందిన యాదవ సంఘం నాయకులు మంగళవారం ఎమ్మెల్యే విజయరమణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా,ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కన్నారు.
AKP: వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ సోమవారం తెలిపారు. మంచినీటి బోర్లు మరమ్మతులకు గురైతే వెంటనే మెటీరియల్ తో బోర్ మెకానిక్స్ ఆటోలో వెళ్లి రిపేర్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం క్రాష్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు. తాగునీటికి సంబంధించి సమస్యలు ఉంటే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
AP: గ్రూప్-1 వ్యవహారంలో సీఎస్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనందుకు మండిపడింది. అప్రధాన్య పోస్టులకు బదిలీ చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. సుమోటోగా ధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలని తెలిపింది. రేపు ఉదయం 10:30 గంటలకు కోర్టుకు హాజరుకావాలని సీఎస్కు ఆదేశించింది.